కఠిన నిబంధనలు సాధ్యం కాదు
రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా నివారణకు కఠిన నిబంధనలు విధించే పరిస్థితి లేదని ఆరోగ్య శాఖ మంత్రి మా.సుబ్రమణియన్ పేర్కొన్నారు. చెంగల్పట్టు జిల్లా ఇడైక్కళినాడు పట్టణ పంచాయతీలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి సోమవారం పరిశీలించారు.
ఆరోగ్యశాఖ మంత్రి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిశీలిస్తున్న మా.సుబ్రమణియన్
మహాబలిపురం, న్యూస్టుడే: రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా నివారణకు కఠిన నిబంధనలు విధించే పరిస్థితి లేదని ఆరోగ్య శాఖ మంత్రి మా.సుబ్రమణియన్ పేర్కొన్నారు. చెంగల్పట్టు జిల్లా ఇడైక్కళినాడు పట్టణ పంచాయతీలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ... పలు దేశాల్లో కరోనావిజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆదివారం నాటికి 14,504 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఆర్థికంగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కఠిన నిబంధనలను సీఎం అమలు చేయడం లేదని చెప్పారు. బాధితులకు తగిన చికిత్స అందించడానికి అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బాధితుల్లో 95 శాతం మంది ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారని వివరించారు.
15 వేలు దాటిన యాక్టివ్ కేసులు
చెన్నై, న్యూస్టుడే: రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో సోమవారం 2,654 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చెన్నైలో 1,066 కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 34,85,429కి చేరింది. బాధితుల్లో కొత్తగా ఎవరూ మరణించలేదు. మొత్తం మరణాల సంఖ్య 38,026గానే ఉంది. రోజు వ్యవధిలో కొత్తగా 1,542 మంది డిశ్చార్జి అయ్యారు. కోలుకున్నవారి మొత్తం సంఖ్య 34,31,787కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 15,616కు పెరిగింది. పుదుచ్చేరిలో 24గంటల వ్యవధిలో కొత్తగా 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరణాలు నమోదుకాలేదు. యాక్టివ్ కేసుల సంఖ్య 501కి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్ట్రాంగ్’గా ఉన్నట్టేనా?
[ 04-05-2024]
తెన్కాశి పార్లమెంటులో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూమ్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. 210 సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తే 90 పనిచేయట్లేదని తేలింది. -
ఆదిశంకరుడికి మహా కుంభాభిషేకం
[ 04-05-2024]
కంచి కామకోటి పీఠం ప్రాంగణంలోని ఆదిశంకరుడు, శ్రీ అనుక్కై గణపతి, సురేశ్వరాచార్యుల సన్నిధులకు ఇటీవల జీర్ణోద్ధరణ చేపట్టారు. -
ఎండ నుంచి ఉపశమనానికి గ్రీన్ నెట్స్
[ 04-05-2024]
ఎండలు భగ్గుమంటుండంతో వాహన చోదకులు సిగ్నళ్ల వద్ద నిలబడేందుకు ఇబ్బంది పడుతున్నారు. వారికి ఉపశమనం కలిగించేందుకు కోవై, తిరుప్పూర్ కార్పొరేషన్ల తరఫున తాత్కాలిక పందిళ్లు ఏర్పాటు చేశారు. -
విజయకాంత్ స్మారక ప్రదేశానికి ప్రపంచ రికార్డులో చోటు
[ 04-05-2024]
నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు దివంగత విజయకాంత్ స్మారక ప్రదేశానికి ప్రపంచ రికార్డులో చోటు దక్కింది. ‘కెప్టెన్’ అనారోగ్యంతో గతేడాది డిసెంబరులో మృతి చెందగా కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే. -
పెరిగిన విమాన సర్వీసులు
[ 04-05-2024]
వేసవి రద్దీతో నగరం నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్య పెరిగింది. పాఠశాలలు, కళాశాలలకు పరీక్షలు ముగిసి సెలవులు ప్రకటించడంతో అనేక మంది కుటుంబాలతో కలిసి సెలవులు గడిపేందుకు వెళ్తున్నారు. -
నీళ్లట్యాంకులో మలం కలిపారని వదంతులు
[ 04-05-2024]
రాణిపేట సమీపం నౌలాక్ పంచాయతీ సిప్కాట్ వద్ద ఉన్న ప్రభుత్వ మహోన్నత పాఠశాల సమీపంలో లక్ష లీటర్ల సామర్థ్యమున్న నీళ్ల ట్యాంకు ఉంది. -
ఎలక్షన్ రెండో సింగిల్ విడుదల
[ 04-05-2024]
‘ఉరియడి’, ‘ఫైట్ క్లబ్’ చిత్రాలతో గుర్తింపు పొందిన నటుడు విజయకుమార్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘ఎలక్షన్’. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ‘ఎలక్షన్’ అనే టైటిల్ చిత్రంపై సినీ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. -
ఊటీలో 10 రోజులపాటు పుష్ప ప్రదర్శన
[ 04-05-2024]
ఊటీలో మొదటిసారిగా ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు పది రోజులపాటు పుష్ప ప్రదర్శన నిర్వహించనున్నట్లు నీలగిరి కలెక్టర్ అరుణ తెలిపారు. -
వీఐటీ ప్రవేశ పరీక్షలో ఏపీ విద్యార్థికి 3వ స్థానం
[ 04-05-2024]
వేలూర్ వీఐటీ విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరానికిగాను ఇంజినీరింగ్లో ప్రవేశాలకు ఇటీవల ప్రవేశ పరీక్షలు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన