అత్తిక్కడవు-అవినాశి పథకం పూర్తయేదెన్నడు?
అత్తిక్కడవు-అవినాశి పథకపు పనులు ఎప్పుడు పూర్తవుతాయని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం ఆయన ఈరోడ్ జిల్లా పెరుందురైలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు.
ప్రభుత్వాన్ని నిలదీసిన ఎడప్పాడి
విల్లివాక్కం, న్యూస్టుడే: అత్తిక్కడవు-అవినాశి పథకపు పనులు ఎప్పుడు పూర్తవుతాయని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం ఆయన ఈరోడ్ జిల్లా పెరుందురైలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ఆరు నెలల క్రితమే పూర్తికావాల్సిన ఈ పథకం ఇంకా నాన్చుడు ధోరణితో అలాగే ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో నేరవేర్చలేని హామీలను ఇచ్చి ప్రజలను డీఎంకే నేతలు మభ్యపెట్టారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని పెదవి విరిచారు. గృహిణులకు నెలకు రూ.1,000 నగదు అందజేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ ఊసే లేదని పేర్కొన్నారు. గ్యాస్ ధర తగ్గిస్తామని ఇచ్చిన హామీ ఏమైందన్నారు. ఎప్పుడో పూర్తికావాల్సిన అత్తిక్కడవు-అవినాశి పథకాన్ని కావాలనే డీఎంకే ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. పెరుందురై నియోజకవర్గపు దాహాన్ని తీర్చే కొడవేరి ఉమ్మడి తాగునీటి పథకాన్ని కూడా పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు.
ఘనస్వాగతం
విల్లివాక్కం, న్యూస్టుడే: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి ఎంపికైన తర్వాత మొదటి సారిగా మంగళవారం ధర్మపురి చేరుకున్నారు. ఆయనకు పార్టీ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. పలుప్రాంతాల నుంచి కార్యకర్తలు తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. వందలాది వాహనాలు బారులు దీరాయి. రద్దీ కారణంగా ఎడప్పాడి వ్యాను నుంచి దిగకుండా ధర్మపురి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రి ముందు టాపుపైకి ఎక్కి ప్రసంగించారు. ప్రసంగం పూర్తయ్యేంత వరకు అంబులెన్స్, ప్రభుత్వ టౌన్ బస్సులతో బాటు అన్ని వాహనాలు ఆసుపత్రి సమీపంలోని ధర్మపురి-సేలం రోడ్డులో నిలిచిపోయాయి. ధర్మపురి డీఎస్పీ వినోద్ రంగంలోకి దిగి ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంతో అవి కదిలాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమ రవాణాకు అడ్డుకట్ట
[ 27-04-2024]
అత్యంత విలువైన వస్తువుల్ని విదేశాల నుంచి అక్రమంగా తెచ్చేందుకు, తీసుకెళ్లేందుకు స్మగ్లర్లు పన్నుతున్న పన్నాగాలు అన్నీఇన్నీ కావు. కరుడుగట్టిన విదేశీ మాఫియాలతో చేతులు కలిపి.. రాష్ట్రాన్ని స్మగ్లర్ల అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. -
అట్టహాసంగా ఏఐ హ్యాకథాన్
[ 27-04-2024]
తమిళ భాషలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)తో ‘నాన్ ముదల్వన్-అన్నా యూనివర్సిటీ-గువి తమిళనాడు కోడర్స్ ప్రీˆమియర్ లీగ్’ (ఎన్ఎం-ఏయూ- టీఎన్సీపీఎల్) ఆధ్వర్యంలో జరిగిన హ్యాకథాన్లో రాష్ట్రంలోని 400 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 82,688 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
హోసూర్లో నీటి ఎద్దడి
[ 27-04-2024]
హోసూర్లో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం 5 వేల లీటర్ల ట్రాక్టర్ ట్యాంకర్ నీరు రూ.1200 పలుకుతోంది. కొద్దిరోజుల కిందట రూ.600గా ఉండేది. -
తాగునీటి ట్యాంకులో ఆవు పేడ
[ 27-04-2024]
తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో తాగునీటి ట్యాంకులో ఆవు పేడ కలిపిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. -
ఓట్ల లెక్కింపు ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష
[ 27-04-2024]
ఓట్ల లెక్కింపు ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు సమీక్ష నిర్వహించారు. -
చెన్నై - తడ జాతీయ రహదారి పనులు వేగవంతం
[ 27-04-2024]
చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిలా తడ వరకు ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మితమవుతోంది. పనులు 95.75 శాతం మేరకు పూర్తయ్యాయి. ఇంకా 1.4 కిలోమీటర్ల దూరానికి జరగాల్సిన పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. -
స్మోక్ బిస్కెట్ల తయారీపై నిషేధం
[ 27-04-2024]
చెన్నైలో లిక్విడ్ నైట్రోజన్ ఉపయోగించి తయారు చేసే స్మోక్ బిస్కెట్లపై నిషేధం విధించినట్లు రాష్ట్ర ఆహార భద్రతాశాఖ పేర్కొంది. -
చెన్నైలో ట్రాఫిక్ ఆంక్షలు
[ 27-04-2024]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్వే వద్ద మూడు నెలల పాటు ట్రాఫిక్లో మార్పులు చేసినట్టు ఆ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. -
శివకార్తికేయన్ విడుదల చేసిన ఫొటో
[ 27-04-2024]
రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన చిత్రం ‘అమరన్’. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాష్ట్రానికి చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ కథా నేపథ్యంతో రూపొందింది. -
నిర్మాత జ్ఞానవేల్రాజా దంపతులపై ఫిర్యాదు
[ 27-04-2024]
సినీ నిర్మాత జ్ఞానవేల్రాజా, అతని భార్య నేహాపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటి పని మనిషి లక్ష్మిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న ఎన్నికల అధికారులు
[ 27-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోసం నియమితులైన ఎన్నికల అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని తిరుప్పూర్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి మురుగానందం ఆరోపించారు. -
బెదిరింపు రాజకీయాలకు భయపడం
[ 27-04-2024]
బెదిరింపు రాకీయాలకు భయపడబోమని మాజీ గవర్నర్ తమిళిసై తెలిపారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఆళ్వార్పేటలోని పోలింగ్బూత్లో ఏజెంట్గా ఉన్న భాజపా నిర్వాహకుడు గౌతమన్పై డీఎంకే వారు దాడి చేశారని తమిళిసై ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!