logo

కనువిందు చేస్తున్న బొమ్మల కొలువు

దిండిగల్లు జిల్లా కొడైక్కానల్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన నవరాత్రి బొమ్మల కొలువు కనువిందు చేస్తోంది. పర్యాటకులు ఉత్సాహంగా సెల్ఫీలు తీసుకుని ఆనందిస్తున్నారు.

Published : 01 Oct 2022 01:04 IST

విల్లివాక్కం, న్యూస్‌టుడే: దిండిగల్లు జిల్లా కొడైక్కానల్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన నవరాత్రి బొమ్మల కొలువు కనువిందు చేస్తోంది. పర్యాటకులు ఉత్సాహంగా సెల్ఫీలు తీసుకుని ఆనందిస్తున్నారు. ఇందులో అన్ని మతాలకు సంబంధించి దేవతల విగ్రహాలు, స్వాతంత్య్ర సమరయోధుల బొమ్మలు కొలువు దీర్చారు. అంతేకాకుండా టీ-20 ప్రపంచ కప్‌ను గుర్తుచేసే విధంగా క్రీడాకారులు మైదానంలో ఆడుతున్నట్లు బొమ్మలను ఏర్పాటు చేశారు. తిరుమల గరుడ వాహన సేవ జరుగుతున్నట్లు ఏర్పాటు చేసిన  నమూనా పర్యాటకులను ఆకట్టుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని