ఐఐటీఎంలో సదస్సు
‘శాస్త్ర 2023’లో భాగంగా ఈ ఏడాది అంతరిక్ష సాంకేతిక సదస్సును ఐఐటీఎం నిర్వహిస్తోంది. దీనివల్ల పరిశోధకులతో పరిచయాలు బాగా పెరుగుతాయన్నారు.
ప్రసంగిస్తున్న వి.కామకోటి
వడపళని, న్యూస్టుడే: ‘శాస్త్ర 2023’లో భాగంగా ఈ ఏడాది అంతరిక్ష సాంకేతిక సదస్సును ఐఐటీఎం నిర్వహిస్తోంది. దీనివల్ల పరిశోధకులతో పరిచయాలు బాగా పెరుగుతాయన్నారు. రెండు సంవత్సరాల విరామానంతరం 26 - 29వ తేదీ వరకు దేశంలోనే అతి పెద్ద ‘టెక్నికల్ ఫెస్టివల్’గా శాస్త్ర ఉండనుందని ఐఐటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇస్రోతో ఐఐటీ విద్యార్థులు దేశంలోని గెలాక్స్ ఐ స్పేస్, అగ్నికుల్ కాస్మోస్ వంటి సంస్థలతో కలిసి ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సులో భాగంగా మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఆస్ట్రోనమీ, వెబ్ 3.0 వంటి సాంకేతిక అంశాలతోపాటు మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్స్ వంటి వాటిపై కార్యశాలలు కూడా జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటైన పాత్రికేయుల సమావేశంలో ఐఐటీ డైరెక్టర్ వి.కామకోటి మాట్లాడుతూ ఐఐటీ పరిశోధించిన 5జీ, హైపర్లూప్ వంటి సాంకేతికతలతో పాటు ఓపెన్ హౌజ్ కార్యశాలలు కూడా ఉంటాయన్నారు. రాకెట్, ఉపగ్రహ అభివృద్ధిపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారని పేర్కొన్నారు. స్టార్టప్లకు ఉపయోగకరంగా ఉండేందుకు భవిష్యత్తులో ఏ అవసరాలుంటాయో చర్చించనున్నారని అన్నారు. విద్యార్థి విభాగ డీన్ నిలేష్ జె.వాస, కోకరికులర్ అడ్వైజర్ రత్నకుమార్ అన్నాబత్తుల, కో కరికులర్ అఫైర్స్ కార్యదర్శి, బాయ్భాబి పట్నాయక్ తదితరులు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్ట్రాంగ్’గా ఉన్నట్టేనా?
[ 04-05-2024]
తెన్కాశి పార్లమెంటులో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూమ్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. 210 సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తే 90 పనిచేయట్లేదని తేలింది. -
ఆదిశంకరుడికి మహా కుంభాభిషేకం
[ 04-05-2024]
కంచి కామకోటి పీఠం ప్రాంగణంలోని ఆదిశంకరుడు, శ్రీ అనుక్కై గణపతి, సురేశ్వరాచార్యుల సన్నిధులకు ఇటీవల జీర్ణోద్ధరణ చేపట్టారు. -
ఎండ నుంచి ఉపశమనానికి గ్రీన్ నెట్స్
[ 04-05-2024]
ఎండలు భగ్గుమంటుండంతో వాహన చోదకులు సిగ్నళ్ల వద్ద నిలబడేందుకు ఇబ్బంది పడుతున్నారు. వారికి ఉపశమనం కలిగించేందుకు కోవై, తిరుప్పూర్ కార్పొరేషన్ల తరఫున తాత్కాలిక పందిళ్లు ఏర్పాటు చేశారు. -
విజయకాంత్ స్మారక ప్రదేశానికి ప్రపంచ రికార్డులో చోటు
[ 04-05-2024]
నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు దివంగత విజయకాంత్ స్మారక ప్రదేశానికి ప్రపంచ రికార్డులో చోటు దక్కింది. ‘కెప్టెన్’ అనారోగ్యంతో గతేడాది డిసెంబరులో మృతి చెందగా కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే. -
పెరిగిన విమాన సర్వీసులు
[ 04-05-2024]
వేసవి రద్దీతో నగరం నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్య పెరిగింది. పాఠశాలలు, కళాశాలలకు పరీక్షలు ముగిసి సెలవులు ప్రకటించడంతో అనేక మంది కుటుంబాలతో కలిసి సెలవులు గడిపేందుకు వెళ్తున్నారు. -
నీళ్లట్యాంకులో మలం కలిపారని వదంతులు
[ 04-05-2024]
రాణిపేట సమీపం నౌలాక్ పంచాయతీ సిప్కాట్ వద్ద ఉన్న ప్రభుత్వ మహోన్నత పాఠశాల సమీపంలో లక్ష లీటర్ల సామర్థ్యమున్న నీళ్ల ట్యాంకు ఉంది. -
ఎలక్షన్ రెండో సింగిల్ విడుదల
[ 04-05-2024]
‘ఉరియడి’, ‘ఫైట్ క్లబ్’ చిత్రాలతో గుర్తింపు పొందిన నటుడు విజయకుమార్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘ఎలక్షన్’. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ‘ఎలక్షన్’ అనే టైటిల్ చిత్రంపై సినీ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. -
ఊటీలో 10 రోజులపాటు పుష్ప ప్రదర్శన
[ 04-05-2024]
ఊటీలో మొదటిసారిగా ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు పది రోజులపాటు పుష్ప ప్రదర్శన నిర్వహించనున్నట్లు నీలగిరి కలెక్టర్ అరుణ తెలిపారు. -
వీఐటీ ప్రవేశ పరీక్షలో ఏపీ విద్యార్థికి 3వ స్థానం
[ 04-05-2024]
వేలూర్ వీఐటీ విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరానికిగాను ఇంజినీరింగ్లో ప్రవేశాలకు ఇటీవల ప్రవేశ పరీక్షలు నిర్వహించారు.