పోలీసుల అదుపులో ఎర్రచందనం కూలీ
తమిళనాడు రాష్ట్రం నుంచి అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించిన ఆరుగురు ఎర్రచందనం కూలీల్లో ఒకరు కలికిరి పోలీసులకు పట్టుబడగా మరో అయిదుగురు తప్పించుకుని పారిపోయారు
మరో అయిదుగురు పరారీ
కలికిరిగ్రామీణ, న్యూస్టుడే: తమిళనాడు రాష్ట్రం నుంచి అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించిన ఆరుగురు ఎర్రచందనం కూలీల్లో ఒకరు కలికిరి పోలీసులకు పట్టుబడగా మరో అయిదుగురు తప్పించుకుని పారిపోయారు. సోమవారం రాత్రి తమిళనాడు రాష్ట్రం నుంచి ఓ కారులో చిత్తూరు జిల్లా పలమనేరులోకి ప్రవేశించిన కూలీలు చౌడేపల్లె, సోమల మీదుగా జిల్లాలోని కలికిరికి వస్తున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నం చేయగా రూటు మార్చిన వారు వాల్మీకిపురం మండలంలోని మేకలవారిపల్లె మీదుగా దారి మళ్లించారు. ఈ క్రమంలో మేకలవారిపల్లె సమీపంలో 5 మంది కూలీలు తప్పించుకోగా కూలీని పోలీసులు అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్