logo

డీఎంకేను ఎదురించేందుకు ఏకమై పనిచేద్దాం: టీటీవీ దినకరన్‌

దుష్టశక్తి అయిన డీఎంకేని ఓడించేందుకు ఏకమై పనిచేద్దామని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ అన్నారు. తంజావూర్‌లో ఓపీఎస్‌ మద్దతుదారుడు వైద్యలింగం ఇంటి వివాహ వేడుకలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, దినకరన్‌ పాల్గొన్నారు.

Published : 08 Jun 2023 00:10 IST

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఓపీఎస్‌ 

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: దుష్టశక్తి అయిన డీఎంకేని ఓడించేందుకు ఏకమై పనిచేద్దామని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ అన్నారు. తంజావూర్‌లో ఓపీఎస్‌ మద్దతుదారుడు వైద్యలింగం ఇంటి వివాహ వేడుకలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, దినకరన్‌ పాల్గొన్నారు. ఈ సంందర్భంగా  దినకరన్‌ మాట్లాడుతూ... ఆరేళ్ల క్రితం కొందరి స్వార్థం వల్ల తాము జయలలిత పార్టీ నుంచి బయటకు వచ్చి ఏఎంఎంకే ప్రారంభించాల్సి వచ్చిందన్నారు. ఆరేళ్ల తర్వాత ఈ వేదికపై ఏఎంఎంకే- అన్నాడీఎంకే కార్యకర్తలను కలిసి చూడడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన వైద్యలింగానికి కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ రాష్ట్రంలో జయలలిత పార్ట్టీ పాలన, లక్ష్యాలను నెరవేర్చేందుకు ఓపీఎస్‌, వైద్యలింగం, తాను ఉన్నామని తెలిపారు. అందరం ఏకమై పనిచేయాలని పేర్కొన్నారు. అనంతరం ఓపీఎస్‌ మాట్లాడుతూ... ఎంజీఆర్‌, జయలలిత లక్ష్యాలను నెరవేర్చేందుకు నమ్మకమైన కార్యకర్తలందరం ఏకమవ్వాలని తెలిపారు. జయలలిత పాలనను రాష్ట్రంలో తీసుకొచ్చేందుకు పాటుపడాలని కోరారు.

టీటీవీ దినకరన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని