Srirangam Temple: శ్రీరంగం ఆలయంలో ఆంధ్రా భక్తులపై దాడి
తిరుచ్చి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంలో ఆంధ్ర భక్తులపై దాడి జరిగింది. ఏపీలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన 30మందికి పైగా అయ్యప్ప భక్తులు, కర్ణాటకకు చెందిన అయ్యప్ప భక్తులు మంగళవారం ఉదయం స్వామి దర్శనానికి క్యూలో నిల్చున్నారు.
ఆర్కేనగర్, న్యూస్టుడే: తిరుచ్చి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంలో (Srirangam temple) ఆంధ్ర భక్తులపై దాడి జరిగింది. ఏపీలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన 30మందికి పైగా అయ్యప్ప భక్తులు, కర్ణాటకకు చెందిన అయ్యప్ప భక్తులు మంగళవారం ఉదయం స్వామి దర్శనానికి క్యూలో నిల్చున్నారు. వారిలో కొందరు వరుసలో నిల్చోకుండా మధ్యమధ్యన దూరినట్లు సమాచారం. దీనిపై మిగిలిన భక్తులు ఆలయ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అనంతరం గర్భగుడి ముందున్న గాయత్రి మండపంలో ఆంధ్రా భక్తులు నిల్చుని ఉండగా రద్దీ ఏర్పడింది. ఆలయ తాత్కాలిక సిబ్బంది సర్ది చెబుతుండగా ఆంధ్రా భక్తులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆంధ్రాకు చెందిన చెన్నారావు అనే భక్తుడిని ముక్కు పగిలేలా సిబ్బంది కొట్టడంతో గాయమైంది. ఆయన అక్కడే కూర్చొని ధర్నా చేశారు. మిగిలిన భక్తులు పెద్దగా కేకలు వేశారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న నగర సహాయ పోలీసు కమిషనర్ నివేదలక్ష్మి, ఇన్స్పెక్టర్ అరంగునాథన్ ఆందోళన చేస్తున్న భక్తులను వెంట తీసుకెళ్లారు. ఆలయం సిబ్బంది భరత్ సహా ముగ్గురిపై శ్రీరంగం ఆలయ పోలీసుస్టేషన్లో భక్తులు ఫిర్యాదు చేశారు. ఆలయ సిబ్బంది కూడా భక్తులపై ఫిర్యాదు చేశారు. ఆలయంలో భక్తుల రక్తం చిందడంతో కాసేపు తలుపులు మూసేసి పరిహార పూజ చేసిన తర్వాత అనుమతించారు.
ఖండించిన భాజపా
అయ్యప్ప భక్తులపై దాడిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఖండించారు. తన ఎక్స్ పేజీలో... అయ్యప్పమాలధారులు శబరిమలై నుంచి తిరిగొచ్చి రంగనాథుడిని దర్శించుకునేందుకు చాలాసేపు నిరీక్షించిన తర్వాత ఆలస్యంపై ప్రశ్నించారు. గొడవ జరిగి రక్తమయంగా మారింది. డీఎంకే ప్రభుత్వానికి హిందూధర్మంపై నమ్మకం లేదు. ఆలయ పవిత్రతను కించపరిచే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుచ్చి జిల్లా పార్టీ యూనిట్ నిరసనకు దిగనుందని తెలిపారు.
వడపళని: ఆంధ్ర భక్తులపై దాడిని మాజీ ఎమ్మెల్సీ, భాజపా జాతీయ సహ ఇంఛార్జి పొంగులేటి సుధాకర్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఖండించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం హిందూ ధర్మానికి, సనాతనానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం, దేవాదాయశాఖ క్షమాపణ చెప్పాలని, నిందితులపై తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రకటనలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్ట్రాంగ్’గా ఉన్నట్టేనా?
[ 04-05-2024]
తెన్కాశి పార్లమెంటులో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూమ్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. 210 సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తే 90 పనిచేయట్లేదని తేలింది. -
ఆదిశంకరుడికి మహా కుంభాభిషేకం
[ 04-05-2024]
కంచి కామకోటి పీఠం ప్రాంగణంలోని ఆదిశంకరుడు, శ్రీ అనుక్కై గణపతి, సురేశ్వరాచార్యుల సన్నిధులకు ఇటీవల జీర్ణోద్ధరణ చేపట్టారు. -
ఎండ నుంచి ఉపశమనానికి గ్రీన్ నెట్స్
[ 04-05-2024]
ఎండలు భగ్గుమంటుండంతో వాహన చోదకులు సిగ్నళ్ల వద్ద నిలబడేందుకు ఇబ్బంది పడుతున్నారు. వారికి ఉపశమనం కలిగించేందుకు కోవై, తిరుప్పూర్ కార్పొరేషన్ల తరఫున తాత్కాలిక పందిళ్లు ఏర్పాటు చేశారు. -
విజయకాంత్ స్మారక ప్రదేశానికి ప్రపంచ రికార్డులో చోటు
[ 04-05-2024]
నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు దివంగత విజయకాంత్ స్మారక ప్రదేశానికి ప్రపంచ రికార్డులో చోటు దక్కింది. ‘కెప్టెన్’ అనారోగ్యంతో గతేడాది డిసెంబరులో మృతి చెందగా కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే. -
పెరిగిన విమాన సర్వీసులు
[ 04-05-2024]
వేసవి రద్దీతో నగరం నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్య పెరిగింది. పాఠశాలలు, కళాశాలలకు పరీక్షలు ముగిసి సెలవులు ప్రకటించడంతో అనేక మంది కుటుంబాలతో కలిసి సెలవులు గడిపేందుకు వెళ్తున్నారు. -
నీళ్లట్యాంకులో మలం కలిపారని వదంతులు
[ 04-05-2024]
రాణిపేట సమీపం నౌలాక్ పంచాయతీ సిప్కాట్ వద్ద ఉన్న ప్రభుత్వ మహోన్నత పాఠశాల సమీపంలో లక్ష లీటర్ల సామర్థ్యమున్న నీళ్ల ట్యాంకు ఉంది. -
ఎలక్షన్ రెండో సింగిల్ విడుదల
[ 04-05-2024]
‘ఉరియడి’, ‘ఫైట్ క్లబ్’ చిత్రాలతో గుర్తింపు పొందిన నటుడు విజయకుమార్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘ఎలక్షన్’. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ‘ఎలక్షన్’ అనే టైటిల్ చిత్రంపై సినీ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. -
ఊటీలో 10 రోజులపాటు పుష్ప ప్రదర్శన
[ 04-05-2024]
ఊటీలో మొదటిసారిగా ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు పది రోజులపాటు పుష్ప ప్రదర్శన నిర్వహించనున్నట్లు నీలగిరి కలెక్టర్ అరుణ తెలిపారు. -
వీఐటీ ప్రవేశ పరీక్షలో ఏపీ విద్యార్థికి 3వ స్థానం
[ 04-05-2024]
వేలూర్ వీఐటీ విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరానికిగాను ఇంజినీరింగ్లో ప్రవేశాలకు ఇటీవల ప్రవేశ పరీక్షలు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి