తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
ప్రకాశ్రాజ్
చెన్నై, న్యూస్టుడే: ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. రూ.50 కోట్ల వసూళ్లను సాధించిన తొలి తమిళ చిత్రం ఘనతనూ దక్కించుకుంది. విడుదలై 20 ఏళ్లు గడిచిన నేపథ్యంలో ఈనెల 20న రీ రిలీజ్ చేశారు. విడుదలైన రెండు రోజుల్లో రూ.10 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇప్పటివరకు రీ రిలీజైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను కురిపించిన సినిమాగా నిలవడం గమనార్హం. ప్రేక్షకాదరణపై నటి త్రిష ఇప్పటికే సామాజిక మాధ్యమ వేదికగా స్పందించారు. ప్రస్తుతం నటుడు ప్రకాశ్రాజ్ కూడా తన ఎక్స్ పేజీలో ఓ పోస్టు చేశారు. అందులో... ‘లవ్ యు ఆల్ చెల్లమ్స్. ముత్తుపాండి క్యారెక్టర్ను ప్రేమించినందుకు మీ ప్రేమలో నేను పరవశించిపోయాను. దర్శకుడు ధరణి, నిర్మాత రత్నం, మై డియర్ విజయ్కు, నా గారాల త్రిషకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని తెలిపారు. ‘గిల్లి’లో ముత్తుపాండి క్యారెక్టర్లో ప్రకాశ్రాజ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మందిరమూర్తి దర్శకత్వంలో మరొక చిత్రం
మందిరమూర్తి
చెన్నై, న్యూస్టుడే: మందిరమూర్తి దర్శకత్వంలో శశికుమార్ నటించిన ‘అయోద్ది’ గతేడాది విడదలైన విషయం తెలిసిందే. మతసామరస్యం సందేశాన్ని ఇచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. సూపర్స్టార్ రజనీకాంత్ సహా పలువురు అగ్రనటులు అభినందిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. విడుదలై ఏడాది గడిచిన నేపథ్యంలో దర్శకుడు మందిరమూర్తి మరొక చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. గోపురం ఫిలిమ్స్ తరఫున సుష్మితా అన్బు చెళియన్ నిర్మించనున్నారు. నటీనటులు, కథా నేపథ్యం తదితర వివరాలు త్వరలో వెల్లడవనున్నాయని కోలీవుడ్ సమాచారం.
నటుల సంఘానికి విరాళం
శివకార్తికేయన్
చెన్నై, న్యూస్టుడే: నడిగర్ సంఘంగా పిలుస్తున్న దక్షిణ భారత నటులసంఘం భవన నిర్మాణ పనులు 2017లో ప్రారంభమై తర్వాత కొన్ని సమస్యలతో ఆగిపోయాయి. పనులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా పలువురు నటులు విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే నటులు కమలహాసన్, విజయ్ రూ.కోటి చొప్పున అందించారు. ఈ నేపథ్యంలో నటుడు శివకార్తికేయన్ రూ.50 లక్షల విరాళాన్ని బ్యాంకు చెక్కు రూపంలో సంఘం అధ్యక్షుడు నాజర్, కోశాధికారి కార్తిలకు అందించారు.
రెట్ట తల ఫస్ట్లుక్ విడుదల
చెన్నై, న్యూస్టుడే: అరుణ్ విజయ్, సిద్ధి ఇద్నాని ముఖ్య తారాగణంగా ఓ చిత్రాన్ని ‘మాన్ కరాతే’ దర్శకుడు తిరుకుమరన్ తెరకెక్కిస్తున్నారు. టైటిల్, పోస్టర్ను దర్శకుడు కార్తిక్ సుబ్బురాజ్ తన ఎక్స్ పేజీలో విడుదల చేశారు. చిత్రానికి ‘రెట్ట తల’ శీర్షిక ఖరారు చేశారు. ఫస్ట్లుక్ పోస్టర్ను చిత్రబృందం మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. అరుణ్ విజయ్ రెండు క్యారెక్టర్లలో కనిపించారు. ‘తడం’ తర్వాత ఆయన రెండు పాత్రలు పోషిస్తున్న చిత్రం ఇది కావడం గమనార్హం.
ఎమక్కు తొళిల్ రొమాన్స్ టీజర్ విడుదల
చెన్నై, న్యూస్టుడే: బాలాజీ కేశవన్ దర్శకత్వంలో అశోక్ సెల్వన్, అవంతిక మిశ్రా జంటగా నటించిన ప్రేమ, హాస్యకథా చిత్రం ‘ఎమక్కు తొళిల్ రొమాన్స్’. ఫస్ట్లుక్ పోస్టర్ను ఇప్పటికే విడుదల చేసిన నేపథ్యంలో టీజర్ను విడుదల చేశారు. విజయ్ ఆంటోని తన ఎక్స్ పేజీలో విడుదల చేశారు. ఊర్వశి, అళగం పెరుమాళ్, ఎం.ఎస్.భాస్కర్, విజయ్ వరదరాజ్ తదితరులు నటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్ట్రాంగ్’గా ఉన్నట్టేనా?
[ 04-05-2024]
తెన్కాశి పార్లమెంటులో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూమ్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. 210 సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తే 90 పనిచేయట్లేదని తేలింది. -
ఆదిశంకరుడికి మహా కుంభాభిషేకం
[ 04-05-2024]
కంచి కామకోటి పీఠం ప్రాంగణంలోని ఆదిశంకరుడు, శ్రీ అనుక్కై గణపతి, సురేశ్వరాచార్యుల సన్నిధులకు ఇటీవల జీర్ణోద్ధరణ చేపట్టారు. -
ఎండ నుంచి ఉపశమనానికి గ్రీన్ నెట్స్
[ 04-05-2024]
ఎండలు భగ్గుమంటుండంతో వాహన చోదకులు సిగ్నళ్ల వద్ద నిలబడేందుకు ఇబ్బంది పడుతున్నారు. వారికి ఉపశమనం కలిగించేందుకు కోవై, తిరుప్పూర్ కార్పొరేషన్ల తరఫున తాత్కాలిక పందిళ్లు ఏర్పాటు చేశారు. -
విజయకాంత్ స్మారక ప్రదేశానికి ప్రపంచ రికార్డులో చోటు
[ 04-05-2024]
నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు దివంగత విజయకాంత్ స్మారక ప్రదేశానికి ప్రపంచ రికార్డులో చోటు దక్కింది. ‘కెప్టెన్’ అనారోగ్యంతో గతేడాది డిసెంబరులో మృతి చెందగా కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే. -
పెరిగిన విమాన సర్వీసులు
[ 04-05-2024]
వేసవి రద్దీతో నగరం నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్య పెరిగింది. పాఠశాలలు, కళాశాలలకు పరీక్షలు ముగిసి సెలవులు ప్రకటించడంతో అనేక మంది కుటుంబాలతో కలిసి సెలవులు గడిపేందుకు వెళ్తున్నారు. -
నీళ్లట్యాంకులో మలం కలిపారని వదంతులు
[ 04-05-2024]
రాణిపేట సమీపం నౌలాక్ పంచాయతీ సిప్కాట్ వద్ద ఉన్న ప్రభుత్వ మహోన్నత పాఠశాల సమీపంలో లక్ష లీటర్ల సామర్థ్యమున్న నీళ్ల ట్యాంకు ఉంది. -
ఎలక్షన్ రెండో సింగిల్ విడుదల
[ 04-05-2024]
‘ఉరియడి’, ‘ఫైట్ క్లబ్’ చిత్రాలతో గుర్తింపు పొందిన నటుడు విజయకుమార్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘ఎలక్షన్’. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ‘ఎలక్షన్’ అనే టైటిల్ చిత్రంపై సినీ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. -
ఊటీలో 10 రోజులపాటు పుష్ప ప్రదర్శన
[ 04-05-2024]
ఊటీలో మొదటిసారిగా ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు పది రోజులపాటు పుష్ప ప్రదర్శన నిర్వహించనున్నట్లు నీలగిరి కలెక్టర్ అరుణ తెలిపారు. -
వీఐటీ ప్రవేశ పరీక్షలో ఏపీ విద్యార్థికి 3వ స్థానం
[ 04-05-2024]
వేలూర్ వీఐటీ విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరానికిగాను ఇంజినీరింగ్లో ప్రవేశాలకు ఇటీవల ప్రవేశ పరీక్షలు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్పై దాడి.. పోలీసుల సమక్షంలోనే వైకాపా అరాచకం