ఇంగ నాన్తాన్ కింగు ట్రైలర్ విడుదల
ఆనంద్ నారాయణన్ దర్శకత్వంలో సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. ప్రియాలయ, మనోబాలా, తంబి రామయ్య, మునీశ్కాంత్, బాల శరవణన్ తదితరులు ఇతర తారాగణం.
ట్రైలర్లో ఓ సన్నివేశం
చెన్నై, న్యూస్టుడే: ఆనంద్ నారాయణన్ దర్శకత్వంలో సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. ప్రియాలయ, మనోబాలా, తంబి రామయ్య, మునీశ్కాంత్, బాల శరవణన్ తదితరులు ఇతర తారాగణం. చిత్రాన్ని గోపురం ఫిలిమ్స్ పతాకంపై అన్బు చెళియన్, సుశ్మితా అన్బు చెళియన్ సంయుక్తంగా నిర్మించారు. చిత్రం ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది. చిత్రం మే 10న విడుదల కానుంది.
స్టార్ ట్రైలర్...
ట్రైలర్లో ఓ దృశ్యం
చెన్నై: ఇళన్ దర్శకత్వంలో కవిన్ నటించిన చిత్రం ‘స్టార్’. యువన్ శంకర్రాజా సంగీతం సమకూర్చారు. లాల్, గీతా కైలాసం, ప్రీతి ముకుందన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిత్రం మే 10న విడుదల కానున్న నేపథ్యంలో ట్రైలర్ను చిత్ర బృందం విడుదల చేసింది. వర్థమాన నటుడు పడే కష్టాలు, ఎదుర్కొనే అవమానాలను ట్రైలర్లో చూపించారు.
కురంగు పెడల్ పాట...
సినిమా పోస్టరు
చెన్నై: కమలకన్నన్ దర్శకత్వంలో నటుడు శివకార్తికేయన్కు చెందిన ఎస్కే ప్రొడక్షన్ నిర్మించిన చిత్రం ‘కురంగు పెడల్’. కాళి వెంకట్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం మే 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రంలోని ‘కొణ్డాట్టం’ పాట వీడియోను యూట్యూబ్లో చిత్ర బృందం విడుదల చేసింది.
రాబర్ ఫస్ట్లుక్...
ఫస్ట్లుక్ విడుదల చేస్తున్న శివకార్తికేయన్
చెన్నై: నగరంలో జరిగిన యధార్థ ఘటన ఆధారంగా దర్శకుడు ఎస్.ఎం.పాండి తెరకెక్కించిన చిత్రం ‘రాబర్’. దర్శకుడు ఆనంద కృష్ణన్ స్వీయ రచనలో ఈ చిత్రం రూపొందింది. చిత్రీకరణ చెన్నైలోని త్యాగరాయనగర్, వేళచ్చేరి, నగర పరిసరాల్లోని సెమ్మంజేరి, ఈస్ట్ కోస్ట్ రోడ్డు, ఓల్డ్ మహాబలిపురం వంటి ప్రాంతాల్లో జరిగింది. సత్య హీరోగా నటించగా దీపా శంకర్, జయప్రకాశ్, సెన్రాయన్, డేని పోప్ తదితరులు ఇతర నటీనటులు. చిత్రం టైటిల్ ఫస్ట్లుక్ను నటుడు శివకార్తికేయన్ విడుదల చేశారు. మే నెలాఖరులోపు చిత్రం విడుదల కానున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్పాలతో పరవశం
[ 11-05-2024]
నీలగిరి జిల్లా ఊటీలో 126వ పుష£్ప ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. పుష్పాలతో అలంకరించిన ఏనుగు, ఊటీ మౌంటెయిన్ రైలు, డిస్నీ వరల్డ్, సింహంతో పాటు పలు జంతువుల కళారూపాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
10వ తరగతిలో 91.55 శాతం ఉత్తీర్ణత
[ 11-05-2024]
రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. పరీక్షలు మార్చి 26 నుంచి ఏప్రిల్ 8వరకు జరిగాయి. మొత్తం 8,94,264 మంది రాశారు. ఫలితాలను శుక్రవారం ఉదయం ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సేతువర్మ విడుదల చేశారు. -
ఎన్నికల్లో మోదీపై పోటీకి బయల్దేరిన రైతులు
[ 11-05-2024]
రైల్వే టిక్కెట్ల రిజర్వేషన్ ఖరారైనా నిరీక్షణ జాబితాలో పెట్టారంటూ అన్నదాతలు ఆందోళనకు దిగారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తమిళనాడుకు చెందిన దక్షిణ నదుల భద్రతా రైతుల సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను వారణాసి నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు. -
నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
[ 11-05-2024]
రాష్ట్రంలో నాలుగు రోజుల వరకు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో.. 24 గంటల్లో సాధారణం కన్నా 5 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. -
విద్యార్థులూ.. వినండి
[ 11-05-2024]
ప్లస్ టూ, 10వ తరగతిలో మార్కులు ఘనంగా వచ్చాయని సంబరపడిపోయేవారు ఒకవైపు.. సరిగా రాక కుమిలిపోయే విద్యార్థులు మరోవైపు. రాష్ట్రంలో పరిస్థితి ఇది. ఆశించిన మార్కులు రాకపోవడమో, ఫెయిల్ అయిపోవడమోలాంటి కారణాలతో క్షణికావేశ నిర్ణయాలు తీసుకుంటున్నారు. -
విమానాశ్రయంలో వాకలేటర్ సేవలు
[ 11-05-2024]
డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టెర్మినళ్లను అనుసంధానం చేసేందుకు కొత్తగా వాకలేటర్తో పాటు మల్టీ లెవల్ కారు పార్కింగు సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు నగర విమానాశ్రయ యంత్రాంగం సిద్ధమవుతోంది. -
కబడ్డీలో సత్తా చాటిన హెడ్ కానిస్టేబుల్
[ 11-05-2024]
తేనీ జిల్లా అమైచ్చూర్ కబడ్డీ, చిన్న మరుదు కబడ్డీ ఆర్గనైజేషన్ తరఫున సీనియర్ మాస్టర్ కబడ్డీ పోటీలు ఇటీవల చిన్నమనూర్లో నిర్వహించారు. -
34 ఏళ్ల తర్వాత చేతికొచ్చిన సొంతిల్లు
[ 11-05-2024]
చెన్నై స్టాన్లీ ఆస్పత్రిలో పని చేసి పదవీవిరమణ చేసిన డీన్ విక్టర్కు షెనాయ్నగర్ ప్రాంతంలో సొంతిల్లు ఉంది. 2 గ్రౌండ్ల స్థలంలోని ఇంటిని వేరొకరిని చూసుకోమని చెప్పి 34 ఏళ్ల కిందట ఆయన అమెరికా వెళ్లి పోయాడు. -
అలవోకగా శాస్త్రీయనామాలు చెప్తున్న బాలుడు
[ 11-05-2024]
కూరగాయలు, పండ్ల శాస్త్రీయ నామాలు సెకన్లలో చెప్తూ ఓ బాలుడు అబ్బురపరుస్తున్నాడు. దిండుక్కల్ జిల్లా పళని నెయిక్కారపట్టికి చెందిన మహ్మద్ హిసామ్ ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. -
కంచి పట్టుచీరకు కష్టకాలం!
[ 11-05-2024]
పట్టు చీరలకు ప్రసిద్ధిగాంచిన కాంచీపురం నగరంలోని చేనేత పట్టు వస్త్రాల ఉత్పత్తి, విక్రయ సహకార సంఘాల్లో నిల్వ ఉన్న రూ.110 కోట్ల విలువైన 70 వేల పట్టు చీరలను 65 శాతం రిబెట్తో విక్రయించే పరిస్థితి నెలకొంది. -
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
[ 11-05-2024]
తన ప్రియుడు వేరొకరికి దక్కకూడదని ప్రియురాలు ఘాతుకానికి పాల్పడింది. పెట్రోల్పోసి నిప్పంటించింది. ఆమె కూడా నిప్పంటించుకోవడంతో ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
పదో తరగతి ఫెయిల్ కావడంతో విద్యార్థిని ఆత్మహత్య
[ 11-05-2024]
పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పళ్లిపట్టు తాలూకా మేల్పొదటూర్ ప్రాంతానికి చెందిన మురళి, నదియ భార్యభర్తలు. కుమారి(15) అనే కుమార్తె ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు