రసవాతి ఫస్ట్ సింగిల్ విడుదల
శాంతకుమార్ దర్శకత్వంలో అర్జున్దాస్, తన్యా రవిచంద్రన్ జంటగా రూపొందిన చిత్రం ‘రసవాతి’. రమ్యా సుబ్రమణియన్, జి.ఎం.సుందర్, సుజిత్ శంకర్, రేష్మా వెంకటేశ్, సుజాత, రిషికాంత్ తదితరులు ఇతర తారాగణం.
చెన్నై, న్యూస్టుడే: శాంతకుమార్ దర్శకత్వంలో అర్జున్దాస్, తన్యా రవిచంద్రన్ జంటగా రూపొందిన చిత్రం ‘రసవాతి’. రమ్యా సుబ్రమణియన్, జి.ఎం.సుందర్, సుజిత్ శంకర్, రేష్మా వెంకటేశ్, సుజాత, రిషికాంత్ తదితరులు ఇతర తారాగణం. చిత్రీకరణ ముగిసింది. 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ సింగిల్ ‘సారల్ సారల్’ పాట వీడియోను చిత్రబృందం యూట్యూబ్లో విడుదల చేసింది. నాయకానాయిక మధ్య చోటుచేసుకున్న మధుర సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
విమల్ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్...
‘పోగుమిడం వెగుదూరమిల్లై’ ఫస్ట్లుక్
చెన్నై: మైఖేల్ కె.రాజా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పోగుమిడం వెగుదూరమిల్లై’. ఇందులో విమల్, కరుణాస్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. విమల్ నటించిన పలు చిత్రాలు జాతీయ పురస్కారాలు దక్కించుకోగా మూడేళ్లుగా ఆయనకు అవకాశాలు లేకపోవడం గమనార్హం. ఆ సమయంలో వెబ్ సీరిస్లో నటించారు. తర్వాత బోస్ వెంకట్ దర్శకత్వంలోని ‘మా.పొ.సి’ చిత్రంలో నటించారు.
కవిన్ చిత్రానికి బ్లడీ బెగ్గర్ టైటిల్
చిత్రంలో కవిన్
చెన్నై, న్యూస్టుడే: కోలీవుడ్లోని ముఖ్యమైన దర్శకుల్లో ఒకరైన నెల్సన్ దిలీప్కుమార్ ‘ఫిలమెంట్ పిక్చర్స్’ పేరిట నిర్మాణ సంస్థనూ ప్రారంభించారు. ఆ సంస్థ తరఫున తొలి సినిమా నిర్మిస్తున్నట్లు నెల్సన్ ప్రకటించారు. తన వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన శివబాలన్ ముత్తుకుమార్కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. కవిన్ కథానాయకుడిగా నటించనున్నారు. ‘బ్లడి బెగ్గర్’ టైటిల్ ఖరారు చేశారు. నెల్సన్, కవిన్, శివబాలన్ నటించిన టైటిల్ రివీలింగ్ వీడియోను విడుదల చేశారు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.
త్రిషకు జన్మదిన శుభాకాంక్షలు
లైకా పోస్టు చేసిన త్రిష ఫొటో
చెన్నై, న్యూస్టుడే: చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 25 ఏళ్లయినా నేటి యువ కథానాయికలకు పోటీగా నటిస్తున్న నటి త్రిష. శనివారం తన 41వ పుట్టినరోజు సంబరాలు చేసుకున్నారు. ఆమెకు అభిమానులు, సినీ రంగ ప్రముఖులు సామాజిక మాధ్యమాలు వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాణ సంస్థలైన లైకా, స్టూడియో గ్రీన్, సన్ టీవీ, సన్ పిక్చర్స్ సంస్థలూ శుభాకాంక్షల సందేశాన్ని పోస్టు చేశాయి.
ముంబయి నుంచి తిరిగొచ్చిన రజనీ
విలేకరులతో మాట్లాడుతున్న రజనీకాంత్
చెన్నై, న్యూస్టుడే: ‘వేట్టైయన్’ చిత్రీకరణ కోసం ముంబయి వెళ్లిన రజనీకాంత్ శనివారం చెన్నై తిరిగొచ్చారు. విమానాశ్రయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘కూలీ’ చిత్రం టీజర్కు అభిమానుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషమన్నారు. ఇళయరాజా దాఖలు చేసిన కాపీ రైట్స్ కేసు గురించి ప్రశ్నించగా.. ‘అది సంగీత దర్శకుడు, నిర్మాతలకు మధ్య ఉన్న సమస్య’ అన్నారు. ‘వేట్టైయన్’ చిత్రీకరణ 80 శాతం ముగిసిందని తెలిపారు.
నటుడు రామరాజన్ సోదరి కన్నుమూత
పుష్పవతి
సైదాపేట, న్యూస్టుడే: ప్రముఖ సినీ నటుడు రామరాజన్ సోదరి శనివారం కన్నుమూశారు. ‘కరక్కాట్టక్కారన్’, ‘ఎంగ ఊరు పాట్టుక్కారన్’ తదితర పలు సినిమాల్లో నటించి ఎనభైల్లో ప్రముఖ హీరోగా వెలుగొందిన నటుడు రామరాజన్. ప్రస్తుతం ‘సామానియన్ (సామాన్యుడు)’ అనే చిత్రం ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అక్క పుష్పవతి (75) శనివారం సాయంత్రం మదురై మేలూరులోని ఆమె నివాసంలో కన్నుమూశారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రామరాజన్ మదురై వెళ్లారు. ఆదివారం మేలూరులో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మృతికి సినీ ప్రముఖలు, రామరాజన్ అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
400 స్థానాలకు పైగా సాధిస్తాం: తమిళిసై
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాలకు పైగా కైవసం చేసుకుని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని మాజీ గవర్నరు తమిళిసై సౌందరరాజన్ ధీమా వ్యక్తం చేశారు. -
‘విడుదలై-2’లో అతిథిగా ఎస్జే సూర్య
[ 18-05-2024]
గత ఏడాది ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో ‘విడుదలై’ చిత్రం విడుదలై భారీ విజయం సాధించింది. -
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి
[ 18-05-2024]
తమ విడాకుల వ్యవహారంలో ఎవరి జోక్యం లేదని గాయని సైంధవి అన్నారు. -
బస్సులకేమైంది...?
[ 18-05-2024]
ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణమంటే పలు ప్రాంతాల్లో జనం భయపడే పరిస్థితులున్నాయి. కారణం.. కాలం చెల్లినవాటిని వివిధ రూట్లలో తిప్పుతుండటం, అవి ప్రమాదాలకు గురవుతుండటం. రెండు, మూడేళ్లుగా ఇవి మరిన్ని పెరిగాయి. -
3 రోజులు నీలగిరికి రాకండి: కలెక్టర్
[ 18-05-2024]
రాష్ట్రంలో పలు జిల్లాల్లో కొద్దిరోజులుగా వేసవి వర్షాలు కురుస్తున్నాయి -
మూడోదశ ఎన్నికల తర్వాత 400 సీట్లపై మాట్లాడటం మానేసిన మోదీ
[ 18-05-2024]
దేశంలో మూడోదశ ఎన్నికల తర్వాత 400 సీట్ల గురించి మోదీ మాట్లాడటం మానేశారని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై అన్నారు. -
ప్రాంగణ నియామకాల్లో ఐఐటీఎం సత్తా
[ 18-05-2024]
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటుతోంది. -
జపాన్లో భారత రాయబారిగా విళుపురంవాసి
[ 18-05-2024]
జపాన్లో భారత్ రాయబారిగా తమిళనాడుకు చెందిన వ్యక్తి నియమితులయ్యారు. -
వ్యర్థాలను తొలగించండి: జలవనరుల శాఖ
[ 18-05-2024]
కూవం నదిలో నీటి మార్గాలను అడ్డుకునేలా జాతీయ రహదారుల శాఖ ఒప్పంద సంస్థ పోసిన మట్టి, భవన శిథిలాల తొలగింపునకు జలవనరుల శాఖ రూ.50 కోట్లు అడిగింది. -
ఇతరులను గమనించడం నా పనికాదు
[ 18-05-2024]
ఇతరులను గమనించడం తన పనికాదని, తన పనిపై తాను చాలా నిబద్ధతతో ఉన్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన