అంధ పాఠకులకు ప్రత్యేక యాప్
సభ్యత్వం ఉన్న వారికి పుస్తకాలను అద్దెకిచ్చే పద్ధతిని ఇటీవల అన్నా సెంటినరీ గ్రంథాలయం ప్రారంభించిన విషయం తెలిసిందే.
అన్నా సెంటినరీ గ్రంథాలయం ఏర్పాటు
న్యూస్టుడే, వడపళని
గ్రంథాలయంలోని రికార్డింగ్ స్టూడియో
సభ్యత్వం ఉన్న వారికి పుస్తకాలను అద్దెకిచ్చే పద్ధతిని ఇటీవల అన్నా సెంటినరీ గ్రంథాలయం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి మంచి ఆదరణ కనిపిస్తోంది. తాజాగా గ్రంథాలయం అంధుల కోసం ‘డీఏఐఎస్వై’, ‘ఈపీయూబీ’ లిపి, ఆడియో విధానంతో వారికి అర్థమయ్యేలా ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
ముందుగా 100 పుస్తకాలు
గ్రంథాలయం త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న కొత్త యాప్లో 100 పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకరాలు డీఏఐఎస్వై, ఈపీయూబీ, ఆడియో ఫార్మేట్లో ఉండనున్నాయి. గ్రంథాలయంలో రికార్డింగు కోసం ఏడాది క్రితమే స్టూడియోను కూడా సిద్ధం చేసింది. గ్రంథాలయంలో పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే యాప్ వెసులుబాటు కలగనుంది. అంధులు, దివ్యాంగులు నేషనల్ ఐడీ కార్డు చూపించి పేర్లు నమోదు చేసుకుని సేవలు వినియోగించుకునే వీలుంటుందని గ్రంథాలయ అధికారులు పేర్కొన్నారు.
ఆర్బిట్ రీడర్తో సేవలు
ఆర్బిట్ రీడర్ అనే పరికరం ద్వారా బ్రెయిలీ లిపిలో మార్చే వీలుంటుంది. అంధులు జనరల్ ఫార్మేట్ లేదా డీఏఐఎస్వై ఫార్మేట్ ద్వారా యాప్ సేవలు పొందే వీలుంటుంది. బ్రెయిలీ లిపి అవసరమున్న వారికి ‘నాన్ విజువల్ డెస్క్టాప్ యాక్సెస్’ (ఎన్వీడీఏ) విధానంతో చూసే వీలుంటుంది. ఆడియో డేటాలు (2 టీబీ వాల్యూమ్తో కూడినవి) గ్రంథాలయ సభ్యులకు వీక్షించే వీలుందని, అన్ని రకాల వాటిని అంధులకు ఉచితంగానే అందివ్వనున్నట్టు గ్రంథాలయం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవాస్తవ ప్రచారం తగదు: ముఖ్యమంత్రి స్టాలిన్
[ 19-05-2024]
విజయబాటలో ఇండియా కూటమి వెళ్తున్నందున ఓటమి భయంతో మోదీ అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు. ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. వెనుకబడిన, అణగారిన, షెడ్యుల్డ్ తెగల జీవితాల్లో వెలుగు నింపేందుకు 50శాతం రిజర్వేషన్ల పరిమితి తొలగించాలని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కోరుతున్నాయన్నారు. -
కోవైలో కుండపోత
[ 19-05-2024]
కోయంబత్తూరులో శనివారం కుండపోత వర్షం కురిసింది. రహదారులు జలమయమవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలైన ఆలందురై, సెమ్మెడు, గౌండంపాళ్యంలో మోకాళ్ల లోతుకు నీరు చేరడంతో ఆ ప్రాంతవాసులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. -
కంచిలో జాతీయ సదస్సు
[ 19-05-2024]
కాంచీపురం సమీప ఏణాత్తూర్లోని పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహా విద్యాలయం ప్రాంగణంలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. -
ప్రధాని మోదీ బయోపిక్లో సత్యరాజ్?
[ 19-05-2024]
ప్రధాని మోదీ బయోపిక్లో ప్రముఖ నటుడు సత్యరాజ్ నటించనున్నట్లు సమాచారం. శుక్రవారం ఆయన నటించిన వెప్పన్ సినిమా ట్రైలర్ విడుదలైంది. -
చిరుధాన్యం.. చక్కటి పోషకం
[ 19-05-2024]
సంప్రదాయ వంటకాల రుచే వేరు. వాటితో కలిగే ఆరోగ్యం.. అమోఘం. ఇప్పటికీ ఈ తరహా ఆహారం ముందంజలో ఉంటూ వస్తోంది. మారుతున్న ఆహార అలవాట్లు, సులువుగా దొరికే ఫాస్ట్ఫుడ్పై మోజు పెరుగుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యాలు పాడవుతున్నాయనేది నిపుణుల అభిప్రాయం. -
రాధికను పరామర్శించిన శివకుమార్
[ 19-05-2024]
కాలుకు దెబ్బతగిలి కోలుకుంటున్న రాధికను సీనియర్ నటుడు శివకుమార్ పరామర్శించారు. పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చేలా ఆయన గీసిన పెయింటింగ్స్ రాధికకు ఇచ్చారు. -
వైభవంగా వాసవి జయంతి మహోత్సవం
[ 19-05-2024]
జార్జిటౌన్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం (ఎస్కేపీడీ)లో శనివారం నిర్వహించిన శ్రీ వాసవి జయంతి (వైశాఖ, శుక్ల, దశమి) మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మూలమూర్తి, ఉత్సవమూర్తులకు త్రికాల అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, ఆరాధనలు నిర్వహించారు. -
పురుషులకు ప్రత్యేక తిరునాల
[ 19-05-2024]
మదురై జిల్లా తిరుమంగళం సమీపం పెరుమాళ్ కోవిల్పట్టి గ్రామంలోని కరుంపారై ముత్తయ్య ఆలయంలో పురుషులు మాత్రమే పాల్గొనే తిరునాల శనివారం వైభవంగా జరిగింది. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
[ 19-05-2024]
శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. -
ఉద్యోగం పేరుతో నగదు మోసం
[ 19-05-2024]
చెన్నై వళసరవాక్కానికి చెందిన శరవణన్ భార్య సెంతమిళ్ అరిసి (31) ఉద్యోగం కోసం ఆన్లైన్లో వెతకసాగింది. ఈ క్రమంలో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం ఉన్నట్లు వచ్చిన ప్రకటనలు చూసి అందులో ఉన్న ఫోన్ నెంబరుకి కాల్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు