logo

దర్యాప్తునకు నటి గౌతమి హాజరు

స్థల మోసం ఫిర్యాదుపై నటి గౌతమి వద్ద రామనాథపురం పోలీసులు దర్యాప్తు చేశారు.

Published : 08 May 2024 00:13 IST

ఎస్పీ కార్యాలయం నుంచి వెళ్తున్న గౌతమి

ప్యారిస్‌, న్యూస్‌టుడే: స్థల మోసం ఫిర్యాదుపై నటి గౌతమి వద్ద రామనాథపురం పోలీసులు దర్యాప్తు చేశారు. రామనాథపురం జిల్లా ముత్తుకుళత్తూర్‌ వద్ద 64 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసేందుకు గౌతమి నుంచి అళగప్పన్‌ రూ.3 కోట్లు తీసుకున్నారు. స్థలాన్ని కొనుగోలు చేసినట్లు పత్రాలు చూపారు. అది ప్రైవేటు సంస్థకు చెందినదని, అళగప్పన్‌ నకిలీపత్రాలు తయారు చేసి మోసానికి పాల్పడినట్లు గౌతమి రామనాథపురం క్రైం బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారు. కేసు విషయమై గౌతమి సోమవారం రామనాథపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని క్రైం బ్రాంచ్‌లో దర్యాప్తునకు హాజరయ్యారు. సుమారు గంట పాటు ఆమె వద్ద పోలీసులు వివరాలు సేకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు