రెచ్చిపోయిన కిరాయి మూక
ఆనందపురం మండలం నారాయణగజపతిరాజు రెవెన్యూ పరిధిలో ఓ భూ తగాదా నేపథ్యంలో రంగంలోకి దిగిన కిరాయి మూక ఆదివారం అర్ధరాత్రి శొంఠ్యాంలో బీభత్సం సృష్టించింది.
శొంఠ్యాంలో అర్ధరాత్రి దాడి
దాడి చేసేందుకు గుంపుగా వచ్చిన దృశ్యం
ఆనందపురం, న్యూస్టుడే: ఆనందపురం మండలం నారాయణగజపతిరాజు రెవెన్యూ పరిధిలో ఓ భూ తగాదా నేపథ్యంలో రంగంలోకి దిగిన కిరాయి మూక ఆదివారం అర్ధరాత్రి శొంఠ్యాంలో బీభత్సం సృష్టించింది. వద్దని వేడుకుంటున్నా...కాపాడాలని ప్రాథేయపడినా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు, పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాలివి. శొంఠ్యాం పంచాయతీ ప్రసాదరావు పాలెం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు స్థానిక పెట్రోల్ బంకు సమీప స్థలంలో కొద్ది రోజులుగా ఉంటున్నారు. ఇది తమ భూమి అని, దీనికి సంబంధించి కోర్డులో కేసు ఉందంటూ అక్కడే రేయింబవళ్లు ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రసాద కన్నమ్మ(60), ప్రసాద రాము(31), ప్రసాద నాయుడు, సారిపల్లి అప్పలరాజు, సారిపల్లి నూకాలమ్మ కుటుంబీకులు ఆదివారం వివాదాస్పద భూమిలో నిద్రించారు. అర్ధరాత్రి వేళ పెద్ద సంఖ్యలో వచ్చిన కిరాయి మూకలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రసాద రాము(31), ప్రసాద కన్నమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. కిరాయి మూక వెళ్లిపోయాక 108 వాహనంలో గాయపడిన ఇద్దరినీ కేజీహెచ్లో చేర్పించారు. * జరిగిన ఘటనపై ఆనందపురం పోలీసులకు సోమవారం ప్రసాద నాయుడు ఫిర్యాదు చేయగా ఎస్ఐ నర్సింహమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి వివరాలు సేకరించారు. రాత్రి వేళ కావడం, కిరాయి మూకలోని వ్యక్తులు స్థానికులు కాకపోవడంతో ఎవరినీ పోల్చుకోలేని పరిస్థితి నెలకొందని బాధితులు పేర్కొన్నారు. బంకుకు సంబంధించిన మనుషులు కొందరు ఈ మూకతో ఉన్నారని విలేకరులతో ప్రసాద్ నాయుడు పేర్కొన్నారు. బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల్లో ప్రసాద రాము సీఐఎస్ఎఫ్ ఉద్యోగి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సుప్రభాత సేవ టికెట్ల పునః ప్రారంభం
[ 27-04-2024]
శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. -
డీఎల్ఈడీలో ప్రవేశాలకు ఆహ్వానం
[ 27-04-2024]
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ)లో ప్రవేశాల కోసం మే 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్