‘నాడు.. నేడు’..పడని అడుగు!
న్యూస్టుడే, వన్టౌన్ కింగ్ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్)తో పాటు వీజీహెచ్ (ఘోషాసుపత్రి), విమ్స్ (విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ)లో ప్రతిపాదిత ‘నాడు-నేడు’ పథకం పనుల్లో కదలిక లేదు.
రెండేళ్లయినా విడుదలవని నిధులు
న్యూస్టుడే, వన్టౌన్ కింగ్ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్)తో పాటు వీజీహెచ్ (ఘోషాసుపత్రి), విమ్స్ (విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ)లో ప్రతిపాదిత ‘నాడు-నేడు’ పథకం పనుల్లో కదలిక లేదు.
ప్రసూతి విభాగం
రెండేళ్ల క్రితం రూ.950 కోట్లతో ఆయా పనులు చేపట్టేందుకు వీలుగా టెండర్లు ఖరారు చేశారు. గుత్తేదారుని ఎంపిక కూడా పూర్తయింది. అయితే నిధులు లభ్యత లేకపోవడంతో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. వివిధ బ్యాంకుల నుంచి రుణాలను సమీకరించాలని ప్రభుత్వ వర్గాలు భావించినా సాధ్య పడలేదు. దీని ప్రభావం కేజీహెచ్, వీజీహెచ్లపై గణనీయంగా చూపుతోంది.
అధ్వానంగా భవనాల నిర్వహణ: ప్రతిపాదిత నిధుల్లో కేజీహెచ్కు రూ.600 కోట్ల వరకు కేటాయించారు. ఈ నిధులతో ఏడేసి అంతస్తుల చొప్పున నాలుగు బహుళ అంతస్తుల భవనాలు, ఎ.ఎం.సి.(ఆంధ్రవైద్య కళాశాల) పరిధిలో ఒక భవనం, పీజీ, యూజీ వైద్యవిద్యార్థుల కోసం రెండు వసతి గృహాలు నిర్మించాలని ప్రతిపాదించారు. ‘నాడు-నేడు’ అమలవుతుందని చెబుతూ రెండేళ్ల నుంచి కొన్ని భవనాల నిర్వహణను గాలికి వదిలేశారు.
* కేజీహెచ్ ఆవరణలోని ప్రసూతి విభాగం, కార్డియాలజీ, ఎముకలు, సర్జికల్ విభాగాలతో పాటు ఓపీ బ్లాకు, ఎ.ఎం.సి. పరిధిలోని పరిపాలన బ్లాక్, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ తదితర విభాగాలను ‘నాడు-నేడు’ కింద అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఆయా భవనాలు 60-70ఏళ్ల క్రితం నిర్మించారు. వాటి నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ తరుణంలో ‘నాడు-నేడు’ పథకం ఆశాకిరణంలా కనిపించింది. తీరా ఊరించి.. ఉసూరుమనిపించడంతో ప్రస్తుతం భవనాల నిర్వహణ దారుణంగా ఉంది. వర్షం పడితే కేజీహెచ్ కార్డియాలజీ బ్లాక్ కారిపోతోంది.
అలా...పనులు ప్రారంభం : ఏఎంసీలో పీజీ సీట్ల పెంపు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు పీజీ వసతిగృహాలను మంజూరు చేసింది. 600 మంది విద్యార్థులు ఉండేలా ఎ.ఎం.సి. ఆవరణలో ఒకటి, పందిమెట్ట ప్రాంతంలోని పురుషుల వసతిగృహం ఆవరణలో మరొకటి నిర్మించడానికి ప్రతిపాదించారు. వాటితోపాటు వైద్య పరికరాల కొనుగోలుకు రూ.150 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. ఈ నిధుల్లో 60శాతం కేంద్రం, మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. కేంద్రం వాటాగా రూ.25 కోట్లు మంజూరు అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇంకా విడుదల కాలేదు. అయినప్పటికీ గత నెల 6న రెండు వసతిగృహాల నిర్మాణానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని శంకుస్థాపన చేయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాదాలు.. విశాఖ నిండా దందాలు!!
[ 04-05-2024]
అధికారంలోకి రాగానే విశాఖలో జగన్ రుషికొండపై విధ్వంసం చేస్తే.. వైకాపా కార్పొరేటర్లు ఊరికే ఉంటారా? విలువైన ప్రాజెక్టులు..భూములు ముఖ్య నేతలు కొల్లగొడుతుంటే కార్పొరేటర్లు కళ్లు మూసుకుంటారా? అన్నకు మించిన దందాలకు తెగబడ్డారు. -
జననేతనన్నావు.. జలమేదీ జగన్?
[ 04-05-2024]
బటన్లు నొక్కే జగన్కు జనాల బాధలు పట్టడం లేదు. ఈ అయిదేళ్లలో తాగునీటి పథకాలకు పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకోవాలని చూశారు తప్ప ప్రజల గొంతు తడిపే ప్రయత్నమే చేయలేదు. వైకాపా పాలనలో గ్రామాల్లో కొత్తగా నీళ్ల కుండీలను నిర్మించిందీ లేదు. -
పేదల పొట్టకొట్టిన జగమొండి
[ 04-05-2024]
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు. -
అభివృద్ధా.. విధ్వంసమా!!
[ 04-05-2024]
స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా శుక్రవారం నగరంలో బాలకృష్ణ రోడ్షో నిర్వహించారు. జాలారిపేట నుంచి మొదలైన రోడ్డు షో వెంకోజిపాలెం, డెయిరీ ఫాం కూడలి, రవీంద్రనగర్, చినగదిలి మీదుగా సాగింది. -
జగన్ సమర్పించు క్లాప్ దోపిడీ..!
[ 04-05-2024]
జగన్ ప్రభుత్వంలో దోపిడీ విధానాలు కోకొల్లలు. ఇంటింటి నుంచి చెత్తను సేకరించే క్లాప్ వాహనాల్లో కూడా వైకాపా కీలక నేతలు దండుకుంటున్నారు. -
సామాన్య భక్తులే లక్ష్యంగా..
[ 04-05-2024]
గత చందనోత్సవ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి సామాన్య భక్తులందరికీ సులువుగా అప్పన్న నిజరూప దర్శనం కలిగేలా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. -
ఎంవీవీ కార్యాలయంలో తనిఖీల కలకలం
[ 04-05-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంలో ఎన్నికల కమిషన్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. -
‘సీబీసీఎన్సీ’ ధూళి ప్రమాదకరం..!
[ 04-05-2024]
నగరం నడిబొడ్డున ఉన్న సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్)లో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపడుతున్న భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టులో గృహాలు, ఇతర ఆస్తులను కొనుగోలు చేసి మోసపోవద్దని సీబీసీఎన్సీ ప్రతినిధి దాసరి యాకోబ్ తాడేపల్లి పత్రికా ప్రకటన ఇచ్చారు. -
చందనోత్సవ టికెట్ల విక్రయాలకు శ్రీకారం
[ 04-05-2024]
ఈనెల 10వ తేదీన చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజరూప దర్శన టికెట్ల విక్రయం శుక్రవారం నుంచి ప్రారంభించారు. సింహగిరిపై జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి, ఆర్జేసీ సుబ్బారావు సంబంధిత వెబ్సైట్ను ప్రారంభించారు. -
ప్రజా సహకారంతో కూటమి గెలుపు : శ్రీభరత్
[ 04-05-2024]
తెదేపా కూటమి గెలుపునకు అన్ని వర్గాలు సహకరించాలని విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ , గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కోరారు. -
కూటమితో మెరుగైన పాలన : గణబాబు
[ 04-05-2024]
తెదేపా కూటమితో మెరుగైన పాలన అందుతుందని పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు అన్నారు. శుక్రవారం ఆయన 92వ వార్డు ఇందిరానగర్, గణేశ్నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పేదలను వేధిస్తున్న సైకో జగన్
[ 04-05-2024]
పింఛన్ల కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాసే వారి చిత్రాలను టీవీల్లో చూసి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆరోపించారు. -
కూటమి ప్రభుత్వం రావడం ఖాయం
[ 04-05-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని పేట కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. జల్లూరు, సుంకపూరు, బాపిరాజు కొత్తపల్లి, రామచంద్రపాలెం, సన్యాసిరాజుపాలెం, పాములవాక, బోడపాలెం తదితర గ్రామాల్లో శుక్రవారం కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న జాగాలు.. జోరుగా బేరాలు
[ 04-05-2024]
వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు, జగనన్న కాలనీల్లో పక్కా ఇళ్ల క్రయవిక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. -
పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటాం
[ 04-05-2024]
మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తూ వారిని చదివించే బాధ్యత తీసుకుంటామని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, తెదేపా జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పేర్కొన్నారు. -
అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
[ 04-05-2024]
విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అదనంగా వినియోగించనున్న ఈవీఎంల (సప్లిమెంటరీ) ర్యాండమైజేషన్ను శుక్రవారం పూర్తి చేశారు. -
సర్వీసు ఓటర్లకు ఆన్లైన్లో పోస్టల్ బ్యాలెట్
[ 04-05-2024]
విశాఖ జిల్లాకు చెందిన సర్వీసు ఓటర్లకు ఆన్లైన్లో పోస్టల్ బ్యాలెట్లను పంపారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తేలింది. -
పోస్టల్ బ్యాలెట్ కోసం ఆరు కేంద్రాలు
[ 04-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాలో ఆరు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారిణి రోజారాణి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్