logo

తెదేపాతోనే రాష్ట్ర అభివృద్ధి

అనకాపల్లిలో తెదేపా 41వ ఆవిర్భావ దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా తెదేపా కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్‌ నారాయణరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో

Published : 30 Mar 2023 04:33 IST

అనకాపల్లి జిల్లా తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న తెదేపా నాయకులు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లిలో తెదేపా 41వ ఆవిర్భావ దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా తెదేపా కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్‌ నారాయణరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పార్టీ సీనియర్‌ కార్యకర్తలను సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ నారాయణరావు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ పేదల కోసం తెదేపా స్థాపించి సంక్షేమ పథకాలు అమలుచేసి ఆదుకున్నారని గుర్తుచేశారు.  రాష్ట్రాభివృద్ధికి తెదేపా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని దీనికోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని సూచించారు. ప్రధాన రహదారిలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మాదంశెట్టి నీలబాబు, సబ్బవరపు గణేష్‌. కొణతాల రత్నకుమారి పాల్గొన్నారు.

చంద్రబాబునాయుడుకు పుష్ఫగుచ్చం అందజేస్తున్న బుద్ద నాగజగదీశ్వరరావు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: తెదేపా ఆవిర్భావ వేడుకల్లో అనకాపల్లి జిల్లాకు చెందిన తెదేపా నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి మైదానంలో బుధవారం నిర్వహించిన వేడుకలో తెదేపా అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు చంద్రబాబునాయుడుకు పుష్ఫగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, గవిరెడ్డి రామానాయుడు, గండి బాజ్జి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని