logo

నా జీవితంలో మరిచిపోలేని రోజు..: గంటా

క్రమశిక్షణ, అకుంఠిత దీక్ష దక్షతలతో తెలుగు నేలను సుసంపన్నం చేసిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి, ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కొనియాడారు.

Published : 29 May 2023 06:23 IST

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును శాలువతో సత్కరించి ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహాన్ని బహూకరిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడ్ఠు

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: క్రమశిక్షణ, అకుంఠిత దీక్ష దక్షతలతో తెలుగు నేలను సుసంపన్నం చేసిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి, ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కొనియాడారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా.. ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన మహానేత నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహాన్ని అందుకోవడం గర్వంగా ఉందన్నారు. ఇది తన జీవితంలో మరిచిపోలేని రోజు అంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మహానాడు కార్యక్రమంలో భాగంగా రాజమండ్రిలో జరుగుతున్న ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో గంటా ఈ జ్ఞాపికను అందుకున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని