Vizag: రాళ్ల గుట్టల మధ్య మిస్టరీ!!
విశాఖ నగరంలో కాలిన స్థితిలోని ఓ మృతదేహం ఆదివారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎండాడ- రుషికొండ మార్గంలో ఏపీ హౌసింగ్బోర్డు స్థలాలున్న రోడ్డులో రాళ్ల గుట్టల మధ్య దీన్ని గుర్తించి స్థానికులు ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించారు.
కాలిన స్థితిలో మృతదేహం
హత్యా..? ఆత్మహత్యా..? అనే అంశంపై దర్యాప్తు
మృతుడు అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాసి
మోసుగంటి సుబ్రహ్మణ్యం (పాతచిత్రం)
పీఎంపాలెం, ఎండాడ, న్యూస్టుడే: విశాఖ నగరంలో కాలిన స్థితిలోని ఓ మృతదేహం ఆదివారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎండాడ- రుషికొండ మార్గంలో ఏపీ హౌసింగ్బోర్డు స్థలాలున్న రోడ్డులో రాళ్ల గుట్టల మధ్య దీన్ని గుర్తించి స్థానికులు ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన చేరుకుని ఆరా తీశారు. ఈ ఘటనపై నార్త్జోన్ ఏసీపీ రాంబాబు తెలిపిన వివరాలిలా... మృతదేహం ఉన్న చోట కారులో లభ్యమైన వివరాల ఆధారంగా మృతుడు సుబ్రహ్మణ్యం అలియాస్ జాన్గా గుర్తించి బంధువులకు తెలియజేశారు. నగర పరిధిలోని ఆరిలోవలోనే ఉంటున్న మృతుడి అన్నయ్య పాస్టర్ ప్రకాష్ రావడంతో పోలీసులు ఇతర వివరాలు తెలుసుకున్నారు.
ట్యాక్సీ బోర్డుతో ఉన్న మృతుడి కారు
డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు సమీప జగ్గన్నపేట గ్రామానికి చెందిన మోసుగంటి సుబ్రహ్మణ్యం(43) అలియాస్ జాన్ ఎంవీపీ కాలనీలో ఒంటరిగా నివసిస్తున్నారు. 13 ఏళ్ల క్రితం వివాహం జరిగినా భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా మూడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. వీరి కుమారుడు ప్రస్తుతం తల్లితో ఉంటున్నాడు. పెళ్లయ్యాక సుబ్రహ్మణ్యం దుబాయ్ వెళ్లి నాలుగేళ్ల తర్వాత తిరిగొచ్చారు. ప్రస్తుతం సొంతంగా కారు నడుపుతూ జీవిస్తున్నారు. కొంత కాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అతడి చరవాణి వాట్సప్ స్టేటస్లో శనివారం అర్ధరాత్రి 1 నుంచి 2 గంటల మధ్య మనశ్శాంతి లేని వారికి శాంతి చేకూరాలంటే యెహోవా సన్నిధి అవసరమనేలా రెండు స్లోగన్లు; అలాగే ఈనెల 8వ తేదీన చేతి మణికట్టు కోసుకొని ఆత్మహత్యాయత్న చిత్రాలు ఉన్నాయి. వాటి ఆధారంగా ఇది ఆత్మహత్య అయి ఉండొచ్చంటూనే, హత్య కోణంలోనూ పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి సీఐ జి.గోవిందరావు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది. అక్కడే రెండు మద్యం సీసాలు, చెప్పులు ఉన్నాయి.
అనుమానాలు ఎన్నో: మృతదేహం ఉన్న చోట రాళ్ల గుట్టలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఒంటిపై పెట్రోల్ పోసుకుని మంట పెట్టుకుంటే వచ్చే బాధకు అటూ ఇటూ పరుగెత్తిన ఆనవాళ్లు కూడా లేవు. కాలికి చిన్న గాయమేఉంది. ఘటనా స్థలంలోని మృతుడి కారు పోలీసులు వచ్చేసరికే స్టార్ట్ చేసి ఉంది. దీంతో ఇతడ్ని ఎవరైనా చంపేసి మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేశారా..అనే అనుమానాలూ లేకపోలేదు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందిన కొద్ది సేపటికే ఈ కారు నగరంలోని కొన్ని ట్రాఫిక్ కూడళ్లు దాటినట్లు పలు చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో రావడం గమనార్హం. పోలీసులు సంబంధిత ప్రదేశానికి చేరుకునేటప్పటికే ఈ వాహనాన్ని ఎవరైనా నగరంలోకి తీసుకెళ్లారా..లేదా ఆ చిత్రాలు పాతవా.. అనే అంశంపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు.
సంఘటన స్థలంలో పరిశీలిస్తున్న పోలీసులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీ పేరు పెట్టావ్.. ఒట్టు తీసి గట్టున పెట్టావ్
[ 02-05-2024]
తెదేపా హయాంలో ‘బీఆర్ అంబేడ్కర్’ పేరుతో అమలు చేసిన విదేశీ విద్య పథకానికి ముఖ్యమంత్రి జగన్ నీళ్లొదిలారు. ఈ పథకానికి తన పేరు పెట్టుకోవడం తప్ప చేసిందేమీ లేదు. -
పవన్ సభకు.. జన సునామీ!!
[ 02-05-2024]
పెందుర్తిలో ‘వారాహి విజయభేరి’ సభ జన సునామీని తలపించింది. బుధవారం రాత్రి నిర్వహించిన సభకు చిన్నారుల నుంచి పెద్దల వరకు భారీగా తరలివచ్చారు. -
చప్పగా సీఎం ప్రసంగం.. స్పందన అంతంతమాత్రం
[ 02-05-2024]
ఒకవైపు ఎండ.. మరోవైపు అంతంతమాత్రంగా వచ్చిన జనం.. వారిలోనూ కానరాని స్పందన.. మొత్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో కొత్త విషయాలేవీ లేకుండా చప్పగా సాగింది. -
బాలకృష్ణకు ఘన స్వాగతం
[ 02-05-2024]
ఉత్తరాంధ్రలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం మధ్యాహ్నం గన్నవరం నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. -
పాడికుండకు చిల్లు.. జగన్కే చెల్లు!
[ 02-05-2024]
పల్లె జీవనంలో, గ్రామాల అభివృద్ధిలో పాడిది విడదీయరాని పాత్ర. క్షీరధారలు ఎంత పొంగిపొర్లితే పల్లెలు అంత పచ్చగా ఉన్నట్టు, అన్నదాత ఆనందంగా ఉన్నట్టు. ప్రతిపక్షం మీద కక్షతో జగన్ పాడిని పాడు చేశారు. -
మాటలు బడాయి.. పేదల వైద్యానికి బకాయి
[ 02-05-2024]
సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. మెరుగైన వైద్య సేవలందించాలి. కానీ వైకాపా ప్రభుత్వం అవేవీ పట్టవన్నట్లు వ్యవహరిస్తోంది. -
మీ ఓటు ఎక్కడ ఉందో తెలుసా..
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఓటు ఎక్కడ ఉంది? పోలింగ్ కేంద్రం ఎక్కడ? ఎలా చేరుకోవాలి? అనే సందేహాలు ఓటర్లలో తలెత్తుతున్నాయి. -
నేడు ‘దక్షిణం’లో పవన్ సభ
[ 02-05-2024]
దక్షిణ నియోజకవర్గ దుర్గాలమ్మ ఆలయం ప్రాంతంలో గురువారం సాయంత్రం ఆరుగంటలకు జనసేన అధినేత పవన్కల్యాణ్ బహిరంగ సభ జరగనుందని ఆ పార్టీ నగర అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. -
ఫలితాలు తేల్చేది వనితలే!
[ 02-05-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏప్రిల్ 25 నాటికి 12,89,371 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి గత శనివారం రాజకీయ పార్టీల సమావేశంలో ప్రకటించారు. -
కాపులకు మేలు చేసింది తెదేపానే: గంటా
[ 02-05-2024]
రాష్ట్రంలో కాపులకు మేలుచేసిన పార్టీ తెదేపా మాత్రమేనని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. -
ఆరోగ్యశ్రీ పథకానికి అనారోగ్యం
[ 02-05-2024]
జగనన్న పాలనలో ప్రజల ఆరోగ్యం గాల్లో దీపంలా మారింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం మాటలు నీటి మూటలయ్యాయి. -
విదేశీ విద్య.. అంతా మిథ్య
[ 02-05-2024]
విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలన్న పేద విద్యార్థుల కలను జగన్ కల్లగానే మిగిల్చేశారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పేరిట అమలు చేస్తున్న ఈ పథకం లబ్ధిదారులకు కఠిన నిబంధనలు అడ్డుగా మారాయి. -
జనసేనానికి జన నీరాజనం
[ 02-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పెందుర్తిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా జనసేనానికి నీరాజనాలు పలికారు. -
ఎమ్మెల్యే సారూ.. జెట్టీ ఒట్టి మాటేనా..
[ 02-05-2024]
పరవాడ మండలం ముత్యాలమ్మలపాలెం పంచాయతీ పరిధిలోని దిబ్బపాలెం, జాలారిపేట, సమ్మెంగిపాలెంలోని మత్స్యకారులకు చేపల వేటే ప్రధాన ఆధారం. -
నోటా కోసమే ఒక బ్యాలెట్ యూనిట్
[ 02-05-2024]
జిల్లాలో ఇతర నియోజకవర్గాలతో పోల్చితే విశాఖ దక్షిణంలో పోలింగ్ ఈసారి కాస్త భిన్నంగా ఉండనుంది. ఇ -
స్వగ్రామానికి ఆర్మీ ఉద్యోగి మృతదేహం
[ 02-05-2024]
పశ్చిమబెంగాల్లో హఠాన్మరణం చెందిన ఆర్మీ హవల్దార్ చిల్ల త్రినాథరెడ్డి (36) మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన చిట్టివలస సమీప జీరుపేట గ్రామానికి బుధవారం తీసుకువచ్చారు. -
ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్యాయత్నం....
[ 02-05-2024]
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ కుమార్తె మృతి చెందింది. -
బాలికపై అత్యాచార యత్నం
[ 02-05-2024]
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిపై ఎండాడ దిశా పోలీసు స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు భీమిలి సీఐ డి.రమేశ్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్