BCCI: హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. జట్టు సభ్యుల ఎంపికపై వస్తోన్న విమర్శలు, సందేహాలపై వివరణ ఇచ్చారు.
ముంబయి: త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్ మెగా టోర్నీ కోసం ఇటీవల బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. జట్టు సభ్యుల ఎంపికపై వస్తున్న విమర్శలు, సందేహాలపై వివరణ ఇచ్చారు. ఐపీఎల్ కంటే ముందే జట్టు ఎంపికపై చర్చలు జరిగాయని అజిత్ తెలిపారు.
జట్టులో టాప్ ఆర్డర్ బలంగానే ఉందని, మిడిల్ ఆర్డర్లో స్వేచ్ఛగా ఆడగలిగే క్రికెటర్ ఉండాలని శివమ్ దూబెను ఎంచుకున్నామని అజిత్ చెప్పారు. ఐపీఎల్ రికార్డు ఆధారంగానే అతడిని ఎంపిక చేశామన్నారు. కానీ, తుది జట్టులో ఉంటాడో లేదో గ్యారంటీ లేదన్నారు. హార్దిక్పాండ్య ఫిట్గా, అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలని భావిస్తున్నామని, అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. రింకు సింగ్ను ఎంపిక చేయకపోవడంపై మాట్లాడుతూ.. ‘‘అందులో అతడి తప్పేం లేదు. అయినా అతడు ట్రావెలింగ్ సబ్స్లో ఉన్నాడు. ఇది కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ, జట్టును సమతుల్యంగా ఉంచే క్రమంలో ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవు. మేం ఒక అదనపు స్పిన్నర్ ఉండాలనుకున్నాం. అందుకే ఇలా జరిగింది’’ అని చెప్పుకొచ్చారు.
జట్టులో నలుగురు స్పిన్నర్లకు అవకాశం కల్పించడంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ‘‘నలుగురిని ఎందుకు ఎంపిక చేశామనేది ఇప్పుడు కాదు.. వెస్టిండీస్లో వెల్లడిస్తా. వ్యక్తిగతంగా నా జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉండాలని కోరుకుంటున్నా. హార్దిక్ సీమ్ ఆల్రౌండర్గా వ్యవహరిస్తున్నాడు. అక్షర్, జడేజా బ్యాట్తోనూ అదరగొడుతున్నారు. కుల్దీప్, చాహల్ స్పిన్నర్లుగా జట్టును బ్యాలెన్స్ చేస్తారు’’ అని తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
రిటైరైతే కనపడను..
క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేశాడు. -
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు. -
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
ఐపీఎల్ 17 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్ ఉంది.