త్వరలోనే వైకాపా పాలనకు తెర
రాష్ట్రంలో ప్రజలను కష్టాలపాలు చేస్తున్న వైకాపా పాలనకు త్వరలోనే తెర పడుతుందని, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వెల్లడించారు.
కోణార్క్లో అనితకు స్వాగతం పలుకుతున్న మహిళలు
నక్కపల్లి, ఎస్.రాయవరం, పాయకావుపేట, న్యూస్టుడే: రాష్ట్రంలో ప్రజలను కష్టాలపాలు చేస్తున్న వైకాపా పాలనకు త్వరలోనే తెర పడుతుందని, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వెల్లడించారు. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాలకు చెందిన వలస మత్స్యకారులతో గురువారం ఆమె ఒడిశా రాష్ట్రంలోని పూరి, కోణార్క్ తదితర ప్రాంతాల్లో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని మత్స్యకార నాయకులతో అక్కడి వీధుల్లో పర్యటించారు. మత్స్యకార మహిళలు ఆమెకు హారతులిచ్చి స్వాగతం పలికారు. అనంతరం అనిత మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తీరి, మంచి పాలన అందుతుందన్నారు. పేదలకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంతో పాటు, అభివృద్ధి చేస్తారని వివరించారు. మత్స్యకారుల సంక్షేమానికి తెదేపా పెద్దపీట వేస్తుందన్నారు. పార్టీకి అండగా ఉండాలని కోరారు. నేతలు పిక్కి శ్రీనివాసరావు, గోసల చినతాతారావు, గోసల శ్రీకాంత్, రేవుపోలవరం, బంగారమ్మపాలెం మాజీ సర్పంచులు కారే కృష్ణ, బంగారి, వాకపాడు ఎంపీటీసీ సభ్యుడు పెర్ల మాధవ, సిరిపిన సత్యనారాయణ, వంకా హరి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్