logo

త్వరలోనే వైకాపా పాలనకు తెర

రాష్ట్రంలో ప్రజలను కష్టాలపాలు చేస్తున్న వైకాపా పాలనకు త్వరలోనే తెర పడుతుందని,  తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వెల్లడించారు.

Published : 29 Mar 2024 04:17 IST

కోణార్క్‌లో అనితకు స్వాగతం పలుకుతున్న మహిళలు

నక్కపల్లి, ఎస్‌.రాయవరం, పాయకావుపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రజలను కష్టాలపాలు చేస్తున్న వైకాపా పాలనకు త్వరలోనే తెర పడుతుందని,  తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వెల్లడించారు. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాలకు చెందిన వలస మత్స్యకారులతో గురువారం ఆమె ఒడిశా రాష్ట్రంలోని పూరి, కోణార్క్‌ తదితర ప్రాంతాల్లో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని మత్స్యకార నాయకులతో అక్కడి వీధుల్లో పర్యటించారు. మత్స్యకార మహిళలు ఆమెకు హారతులిచ్చి స్వాగతం పలికారు. అనంతరం అనిత మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తీరి, మంచి పాలన అందుతుందన్నారు. పేదలకు సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయడంతో పాటు, అభివృద్ధి చేస్తారని వివరించారు. మత్స్యకారుల సంక్షేమానికి తెదేపా పెద్దపీట వేస్తుందన్నారు. పార్టీకి అండగా ఉండాలని కోరారు. నేతలు పిక్కి శ్రీనివాసరావు, గోసల చినతాతారావు,  గోసల శ్రీకాంత్‌, రేవుపోలవరం, బంగారమ్మపాలెం మాజీ సర్పంచులు కారే కృష్ణ, బంగారి, వాకపాడు ఎంపీటీసీ సభ్యుడు పెర్ల మాధవ, సిరిపిన సత్యనారాయణ, వంకా హరి తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని