logo

తెదేపాలో చేరిన వైకాపా కార్యకర్తలు

ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయానికి, మాజీ ముఖ్యమంత్రిగా జగన్‌ ఇంటికి వెళ్లడం ఖాయమని తెదేపా విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ గండి బాబ్జీ అన్నారు.

Published : 20 Apr 2024 03:37 IST

కార్పొరేషన్‌, వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయానికి, మాజీ ముఖ్యమంత్రిగా జగన్‌ ఇంటికి వెళ్లడం ఖాయమని తెదేపా విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ గండి బాబ్జీ అన్నారు. ఇటీవల వైకాపా నుంచి తెదేపాలోకి వచ్చిన సీతంరాజు సుధాకర్‌ ఆధ్వర్యంలో వందలాది మంది వైకాపా కార్యకర్తలు శుక్రవారం తెదేపాలో చేరారు. పార్టీ కార్యాలయంలో గండి బాబ్జీ వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. పార్టీలో చేరినవారంతా తెదేపా, జనసేన, భాజపా కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని