logo

‘తెదేపాతోనే రాష్ట్రానికి పూర్వవైభవం’

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్‌ భార్య, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని అన్నారు.

Published : 28 Apr 2024 04:10 IST

ఏకేసీకాలనీ ప్రచార ర్యాలీలో తేజస్విని, నిహారిక తదితరులు

మల్కాపురం, న్యూస్‌టుడే : తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్‌ భార్య, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని అన్నారు. శనివారం రాత్రి ఆమె  పశ్చిమ తెదేపా అభ్యర్థి గణబాబు కోడలు నిహారికతో కలిసి 40వ వార్డు ఏకేసీకాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెదేపా సూపర్‌సిక్స్‌ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. స్థానిక మహిళలు, యువతులు అధిక సంఖ్యలో హాజరై వారికి ఘనస్వాగతం పలికారు. కూటమి నాయకులు దుర్గాప్రశాంతి, రత్నం, రమణ, ఆర్‌ఆర్‌.రాజు, చిన్నా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని