వైకాపా పాలన అంతమే కూటమి లక్ష్యం
రాష్ట్రంలో అయిదేళ్లగా సాగుతున్న వైకాపా రాక్షస పాలన అంతమే లక్ష్యంగా ప్రజల కోసం కూటమి ఏర్పడిందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు.
నక్కపల్లి, న్యూస్టుడే: రాష్ట్రంలో అయిదేళ్లగా సాగుతున్న వైకాపా రాక్షస పాలన అంతమే లక్ష్యంగా ప్రజల కోసం కూటమి ఏర్పడిందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. జానకయ్యపేటలో మంగళవారం రాత్రి నియోజకవర్గస్థాయిలో యాదవుల సమావేశం నిర్వహించగా రమేశ్, ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రమేశ్ మాట్లాడుతూ దేశంలో యాదవులకు ప్రత్యేక స్థానం ఉందని, కేంద్రంలోనూ వీరు పలు కీలక పదవుల్లో ఉన్నారన్నారు. తెదేపా హయాంలో యాదవులకు తితిదే ఛైర్మన్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఈనెల 6న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాళ్లపాలెంలో బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. అనిత మాట్లాడుతూ బీసీలకు తెదేపా హయాంలో మాత్రమే మేలు జరిగిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తారని వివరించారు. కురందాసు నూకరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గింజాల లక్ష్మణరావు, దేవర సత్యనారాయణ, కురందాసు సింహాచలం, అల్లు నరసింహమూర్తి, వైబోయిన రమణ, గొనగాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సొంత చెల్లినే గౌరవించలేని సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఎలా గౌరవిస్తారని, రాష్ట్రానికి ఏం మంచి చేయగలరని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత విమర్శించారు. ఉపమాక పంచాయతీ పరిధిలోని మనబాలవానిపాలెం, కొర్రవానిపాలెం గ్రామాల్లో మంగళవారం ఆమె తెదేపా, జనసేన, భాజపా నాయకులతో కలిసి ప్రచారం చేపట్టారు. జగన్ బహిరంగ సభల్లో తన చెల్లిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడుతున్నారంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో గుర్తించాలన్నారు.
వైకాపా నుంచి తెదేపాలో చేరిక
ఉద్ధండపురానికి చెందిన వైకాపా నాయకులు పలువురు తెదేపాలోకి చేరారు. సారిపల్లిపాలెం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనిత వీరికి కండువాలు వేసి తెదేపాలోకి ఆహ్వానించారు. కొప్పిశెట్టి వెంకటేష్, కొప్పిశెట్టి కొండబాబు, పాకలపాటి రవిరాజు, గుద్దాటి సత్యనారాయణ, పాము గణేష్, పోలినాటి నానాజీ, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ తోట నగేష్, పొడగట్ల రమణ, తుమ్మల వెంకటకమణ తదితరులు పాల్గొన్నారు.
బుచ్చెయ్యపేట, న్యూస్టుడే: ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమని తెదేపా జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు అన్నారు. తురకలపూడిలో మంగళవారం కూటమి నాయకులతో కలిసి గ్రామీణ ఉపాధి పథకంలో పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా అరాచక పాలనలో రాష్ట్రం అన్ని విధాలా దివాలా తీసిందని విమర్శించారు. తెదేపా హయాంలో అమలు చేసిన ఎన్నో పథకాలను రద్దు చేశారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సంక్షేమంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జనసేన ఇన్ఛార్జి పీవీఎస్ఎన్ రాజు, భాజపా నాయకుడు నాగరాజు, ఎం.వి.వి.సత్యనారాయణ, కోరుకొండ రవికుమార్, గేదెల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీటి సరఫరాలో గోల్‘మాల్’..!
[ 22-05-2024]
మండు వేసవిలో ప్రజలు తాగునీటికి అల్లాడుతుంటే అధికారులు మాత్రం ఓ భారీ మాల్కు నిత్యం లక్షల లీటర్ల నీటిని అనధికారికంగా తరలిస్తున్నారు. దీని కోసం కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా సమయాన్ని తగ్గించేశారనే విమర్శలొస్తున్నాయి. -
భారీ గోతులు.. నిత్య వెతలు!!
[ 22-05-2024]
విశాఖ మహానగరంలో అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో గాజువాకలోని ఆటోనగర్ పారిశ్రామికవాడ మార్గమొకటి. ఆటోనగర్ ప్రవేశ ద్వారం వద్ద రహదారిని చూస్తే ఎంత బాగుందో అనిపిస్తుంది. -
తొలుత బ్యాలట్.. తర్వాత ఈవీఎం ఓట్లు..!
[ 22-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలకు పోలైన ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈనెల 13న జరిగిన పోలింగ్లో జిల్లా వ్యాప్తంగా 70.02శాతం చొప్పున 14,09,118 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
మానవ అక్రమ రవాణా మూలాల ఛేదనకు ప్రత్యేక బృందాలు: సీపీ
[ 22-05-2024]
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కాంబోడియాలోని ఏజెన్సీలకు నిరుద్యోగులను విక్రయిస్తున్న అంశంపై మరింత లోతైన దర్యాప్తు చేపడుతున్నట్లు నగర పోలీసు కమిషనర్ రవిశంకర్ తెలిపారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద..భద్రత పరిశీలన
[ 22-05-2024]
ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ మల్లికార్జున మంగళవారం పరిశీలించారు. -
దువ్వాడ పూర్వ సీఐపై కేసు నమోదు
[ 22-05-2024]
దువ్వాడ పోలీస్స్టేషన్లో గతంలో పని చేసిన సీఐ బి.శ్రీనివాసరావుపై ఫోర్జరీ కేసు నమోదైంది. మంగళవారం దువ్వాడ ప్రస్తుత సీఐ ఎర్రన్నాయుడు తెలిపిన వివరాలివి. -
అప్పన్న ఆలయంలో నేడు నృసింహ జయంతి
[ 22-05-2024]
వైశాఖ శుద్ధ చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో శ్రీనృసింహ జయంతి వైభవోపేతంగా జరగనుంది. -
చంద్రబాబే ముఖ్యమంత్రి!
[ 22-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబునాయుడే కాబోయే ముఖ్యమంత్రి అని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. -
త్వరలో రైతులకు గుర్తింపు కార్డుల జారీ
[ 22-05-2024]
జనవరి నెలలో ఎంపిక చేసిన రైతులకు త్వరలో గుర్తింపుకార్డులు జారీ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగ్ అధికారి యాసిన్ ఒక ప్రకటనలో తెలిపారు. -
స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై అనుమానాలు: కేఏ పాల్
[ 22-05-2024]
ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై అనుమానాలు ఉన్నాయని ప్రజాశాంతి పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి కేఏ పాల్ అన్నారు. -
ఉక్కు కార్మికులకు సగం వేతనాలు చెల్లింపు
[ 22-05-2024]
ఉక్కు కార్మికులకు ఏప్రిల్ నెలకు సంబంధించి సగం వేతనాలను మంగళవారం చెల్లించారు. ఆ వివరాలు... మే నెల 21 రోజులు గడిచిపోయినా వేతనాల చెల్లింపులు లేకపోవడంతోఆగ్రహించిన కార్మికులు మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. -
చెరువు మట్టి.. తవ్వుకుంటే అడిగేదెవరేటి?
[ 22-05-2024]
చెరువులు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో మట్టి అమ్మకాల ద్వారా సొమ్ములు వెనకేసుకుంటున్నారు. -
బైకును ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 22-05-2024]
జాతీయ రహదారిపై ఉద్దండపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. -
రికార్డుల్లేని వాహనాల స్వాధీనం
[ 22-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అల్లర్లు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..