విపక్షాలపై పగ.. పండుటాకులకు సెగ
సామాజిక పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఉన్నతాధికారుల తీరు అంతా జగన్నాటకంగానే కనిపిస్తోంది. గత నెలలో మండుటెండలో పింఛన్లు అందుకోవడానికి సచివాలయానికి వెళ్లి పదుల సంఖ్యలో వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు.
ఇంటింటా పింఛన్ల పంపిణీకి సర్కారు మోకాలడ్డు
అవ్వాతాతలు బ్యాంకుల్లో బాధలు పడేలా చేయాలనే!
ఈనాడు, అనకాపల్లి, న్యూస్టుడే, పాడేరు పట్టణం
సామాజిక పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఉన్నతాధికారుల తీరు అంతా జగన్నాటకంగానే కనిపిస్తోంది. గత నెలలో మండుటెండలో పింఛన్లు అందుకోవడానికి సచివాలయానికి వెళ్లి పదుల సంఖ్యలో వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఆ అనుభవం నుంచి గుణపాఠం నేర్వాల్సింది పోయి అంతకు మించి అవ్వాతాతలను ఇబ్బందులకు గురిచేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఇంటికి ఒకటి, రెండు కి.మీ దూరంలో ఉన్న సచివాలయానికే వెళ్లలేకపోతున్నాం బాబోయ్ అంటే ఊరికి 10 నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న బ్యాంకులకు వెళ్లేలా చేసి మరింత ఇక్కట్లుపడేలా చేస్తున్నారు పాలకపక్షానికి కొమ్ముకాసే ఉన్నతాధికారులు. ఈ పింఛన్ల పంపిణీ విధానం వెనుక వైకాపా కుట్రలు, కుతంత్రాలు బాహాటంగానే కనిపిస్తున్నా.. వాటిని విపక్షాలపైనే రుద్దుతూ రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారు.
ఇవిగో ఇక్కట్లు..
అల్లూరి జిల్లాలో ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట మండలాల్లో బ్యాంకులు లేవు. వారంతా పాడేరులో ఉన్న యూబీఐ, ఎస్బీఐల్లో ఖాతాలు తెరిచారు. తర్వాత మండల కేంద్రాలకు బ్యాంకులు విస్తరించినా బ్యాంకు ఖాతాలు సమీప మండలాలకు బదలాయింపు కాలేదు. ఇప్పుడు వీరంతా బ్యాంకు లావాదేవీల కోసం పాడేరు వచ్చి పడిగాపులు కాయాల్సి వస్తుంది. వాటి పరిధిలోని పింఛన్దారులకు ఈ తిప్పలు తప్పేటట్లు లేవు.
నక్కపల్లి మండలం రాజయ్యపేట నుంచి నక్కపల్లిలో బ్యాంకు రావాలంటే ఏడు కి.మీ దూరం ప్రయాణించాలి. రోజువారీ వ్యవహారాలతో బిజీగా ఉండే బ్యాంకులు పింఛనుదారులకు వెంటనే నగదు ఇచ్చి పంపడం కల్లే అవుతుందని స్థానికులంటున్నారు.
హుకుంపేట, అనంతగిరి మండల సరిహద్దు ప్రాంతాలైన జర్రకొండ, కనిక, గేదెలపాడు, పట్టణం, ఉప్ప, రాప, నిమ్మలపాడు, మెరకచింత వంటి ప్రాంతాల్లో అప్పట్లో బాకూరు ఎస్బీఐ దగ్గరగా ఉండడంతో బ్యాంకుఖాతా తెరుచుకున్నారు. ఆ తర్వాత ఈ బ్యాంకును పాడేరు పట్టణానికి మార్పు చేశారు. ఆయా ప్రాంతాలు పాడేరుకు 35 నుంచి 40 కిలో మీటర్లు దూరంలో ఉండడమే కాకుండా సరైన రోడ్డు సదుపాయం కూడా లేదు.
నర్సీపట్నం మండలం గబ్బాడలో వందకు పైగా పింఛన్దారులున్నారు. వారి ఖాతాల్లో పింఛను సొమ్ములు జమచేయడం వల్ల వారు ఏడు కి.మీ దూరంలో ఉన్న నర్సీపట్నం బ్యాంకుకు వెళ్లాల్సిందే.
దేవరాపల్లి మండలం బోడిగరవు, నేరళ్లపూడి గ్రామాలకు చెందిన లబ్ధిదారులు 10 కి.మీ ప్రయాణిస్తేగాని బ్యాంకులకు చేరే పరిస్థితి లేదు.
సాంకేతిక చిక్కులు అదనం..
బ్యాంకుల్లో ఖాతాలున్నా చాలా కాలంగా లావాదేవీలు నిర్వహించకపోవడంతో వాటిలో నగదు జమ అవుతుందాలేదోనని లబ్ధిదారులు భయపడుతున్నారు. ఆధార్తో అనుసంధానం చేయని ఖాతాలు చాలావరకు ఉన్నాయి. అవ్వాతాతల దగ్గర ఏటీఎం కార్డులు ఎక్కువ మంది దగ్గర ఉండడం లేదు. వీరంతా బ్యాంకు వెళ్లి విత్డ్రా ఫారం నింపే తీసుకోవాల్సి ఉంటుంది. ఏజెన్సీలో ఒకరోజుంతా బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తేగాని సొమ్ము చేతికి అందే పరిస్థితి లేదు. మండుటెండల్లో ఇలా ఇబ్బందులకు గురిచేయడం తగదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారితోషికం మరిచిపోయారా సారూ..!
[ 21-05-2024]
ఎన్నికల విధుల్లో చాకిరి చేయించుకుని, పారితోషికంగా చిల్లిగవ్వ ఇవ్వలేదని ఆశా కార్యకర్తలు వాపోతున్నారు. -
అప్రకటిత కోతలు.. అదనపు వాతలు
[ 21-05-2024]
ఎండలు మండిపోతే లోడ్ రిలీఫ్ పేరుతో కరెంటు సరఫరా నిలిపేస్తున్నారు.. వర్షం కురిసినా.. గాలి వీచినా అంతకంటే వేగంగా విద్యుత్తు సరఫరా ఆపేస్తున్నారు. -
పేదల ప్రాణాలతో చెలగాటం
[ 21-05-2024]
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి బకాయిలు భారీగా పేరుకుపోయాయి. వైకాపా ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించలేదు. -
గౌరవ భృతికి ఎదరుచూపులు
[ 21-05-2024]
ఎన్నికల ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తున్న బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) గౌరవ భృతి కోసం ఎదురుచూస్తున్నారు. -
119 పోలింగ్ కేంద్రాల్లో వెయ్యికిపైగా ఓట్లు
[ 21-05-2024]
విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అత్యల్ప పోలింగ్ శాతం విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో నమోదైతే, అత్యధిక పోలింగ్ శాతం భీమిలి నియోజకవర్గం పరిధిలో నమోదైంది. -
బాధితులకు అండగా నిలిస్తే కేసులా.. : పల్లా
[ 21-05-2024]
ఓటమి భయంతోనే తెదేపా సానుభూతిపరులపై వైకాపా నాయకులు దాడులకు పాల్పడుతున్నారని తెదేపా గాజువాక అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విమర్శించారు -
డిసెంబరు 15న నేవీమారథాన్
[ 21-05-2024]
భారత నౌకాదళానికి చెందిన తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖపట్నం సాగరతీరంలో ఈఏడాది డిసెంబరు 15న నేవీ మారథాన్ నిర్వహించనున్నట్టు సోమవారం నేవీ వర్గాలు ప్రకటించాయి. -
కూండ్రంలో 24వ అగ్ని ప్రమాదం
[ 21-05-2024]
కూండ్రం గ్రామంలో వరుస అగ్ని ప్రమాదాలు కలవరపరుస్తున్నాయి. -
అప్పన్న సేవకు తరలివచ్చిన దాసుడు
[ 21-05-2024]
ఒడిశా రాష్ట్రం బ్రహ్మపుర ప్రాంతానికి చెందిన అప్పన్న భక్తుడు లక్ష్మీకాంత నాయకో దాసుడు సోమవారం సాయంత్రం భక్త బృందంతో కలిసి సింహగిరికి తరలివచ్చారు. -
విజేతల ఊరేగింపులపై ఆంక్షలు
[ 21-05-2024]
ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు విశాఖ రేంజ్ డీఐజీ విశాల్గున్నీ వివరించారు. -
గుర్తింపు కార్డు లేకున్నా అనుమతి
[ 21-05-2024]
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే గుర్తింపుకార్డులు లేకున్నా కొత్త రైతులను బజార్లకు అనుమతిచ్చేలా జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు అత్యుత్సాహం చూపటం విమర్శలకు దారితీస్తోంది. -
‘తెలంగాణ ఈసెట్’లో విద్యార్థి సత్తా
[ 21-05-2024]
పరవాడ మండలం వాడచీపురుపల్లి పంచాయతీ పరిధి దళాయిపాలెం గ్రామానికి చెందిన ఆలవెల్లి ఖ్యాతీశ్వర్ సోమవారం విడుదలైన తెలంగాణ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష (టీఎస్ ఈసెట్) మెటలర్జికల్ విభాగంలో మొదటి ర్యాంకు సాధించాడు. -
కళ్లెదుటే కుమారుడి మృత్యువాత
[ 21-05-2024]
ఇంటికి పెద్ద దిక్కు అయిన కుమారుడు కళ్లెదుటే రక్తపు మడుగులో ఉండటాన్ని చూసి ఆ తల్లి గుండె తల్లడిల్లింది. -
ఎన్నికలనాటి ప్రేమ ఇప్పుడేమైంది..!
[ 21-05-2024]
వైకాపా సర్కారు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అభివృద్ధి పనుల జోలికే పోని నేతలు ఎన్నికల ముందు హడావిడి పనులకు శ్రీకారం చుట్టారు. రోడ్లపై గుంతలు పూడ్చేస్తామని, రహదారులను బాగుచేస్తామని, పట్టణాలను సుందరీకరిస్తామని, సెంట్రల్ లైటింగ్తో వెలుగులు నింపుతామని ఎక్కడలేని ప్రేమను ఒలకబోసి ఓటర్లకు గాలం వేశారు. -
కరకలో తవ్వకాలపై కన్నెర్ర
[ 21-05-2024]
అత్యంత విలువైన వైఢూర్యాలు (అలెక్స్ రకం రంగురాళ్లు) లభించే గొలుగొండ మండలం కరక రంగురాళ్ల క్వారీ చుట్టూరా గస్తీ పటిష్ఠం చేశారు. -
మూడు రోజులు.. 112 కిలోల చందనం
[ 21-05-2024]
సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో సోమవారం మూడవ రోజు చందనం అరగదీత కార్యక్రమం కొనసాగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ ఎన్నికల్లో హింస.. 85 మంది నిందితులపై హిస్టరీ షీట్: డీజీపీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఆ ఒక్క సీటు మినహా యూపీలో భాజపాకు ఓటమే: అఖిలేశ్
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సినీనటుడు మిథున్ చక్రవర్తి రోడ్ షోపై రాళ్ల దాడి!