కార్మికులపై కరకు మనసు!!
‘మాట్లాడితే చాలు పేదలకు, పెత్తందారులకు మధ్య పోటీ’ అని చెబుతుంటారు సీఎం జగన్. మరి అదే పేదలు కంపెనీల్లో ఒళ్లు గుల్ల చేసుకుని పని చేస్తూ అనారోగ్యాల బారిన పడుతున్నా వారిపై కనీస కనికరం కూడా చూపడం లేదు ఆయన.
కబుర్లతో కష్టజీవులకు ఒనగూరిందేంటి?
ప్రాణాలకు విలువివ్వని జగన్ సర్కార్
ఈనాడు, అనకాపల్లి - న్యూస్టుడే, అచ్యుతాపురం, అనకాపల్లి పట్టణం
‘మాట్లాడితే చాలు పేదలకు, పెత్తందారులకు మధ్య పోటీ’ అని చెబుతుంటారు సీఎం జగన్. మరి అదే పేదలు కంపెనీల్లో ఒళ్లు గుల్ల చేసుకుని పని చేస్తూ అనారోగ్యాల బారిన పడుతున్నా వారిపై కనీస కనికరం కూడా చూపడం లేదు ఆయన. కార్మికుల ఆరోగ్యాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. వారికి హక్కుగా కల్పించాల్సిన సదుపాయాలను దూరం చేశారు. అచ్యుతాపురం పరిసరాల్లో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించి కార్మికుల ఆరోగ్యానికి భరోసా ఇస్తామన్న హామీలు గాలిలో కలిపేశారు.
అచ్యుతాపురం, పరవాడ ఫార్మా సెజ్లలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఏటా పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. వందల సంఖ్యలో అస్వస్థతకు గురవుతున్నారు. అయినా వారికి స్థానికంగా కనీస వైద్య సేవలు అందించే పరిస్థితి లేకుండా పోయింది. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు చిన్న సుస్తీ చేసినా అనకాపల్లి, విశాఖ జిల్లా కేంద్రాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. వీరికి చేరువలో వైద్యసేవలు అందించేందుకు ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరు చేసి మూడేళ్లయినా నిర్మాణం ప్రహరీ గోడ స్థాయి దాటలేదు.
ప్రమాదాల సమయంలోనే హడావుడి
పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడల్లా ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మిస్తామని హడావుడి చేయడం.. తర్వాత ఆ ఊసే ఎత్తకపోవడం అధికార పార్టీ నేతలకు పరిపాటిగా మారింది. ప్రత్యేక ఆర్థిక మండలిలో 208 రసాయన, ఫార్మా కంపెనీలతోపాటు ఇతర భారీ పరిశ్రమలున్నాయి. వీటిలో పనిచేసే కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని పలుమార్లు కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఆసుపత్రి నిర్మాణానికి అచ్యుతాపురం సెజ్లో 2 ఎకరాల స్థలాన్ని ఏపీఐఐసీ కేటాయించింది. ఈఎస్ఐ కార్పొరేషన్ పేరిట రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఆ తర్వాత నిర్మాణ పనులు ముందుకు కదల్లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1.48 లక్షలమంది కార్మికులుంటే అందులో 78 వేల మంది ఈఎస్ఐ పరిధిలో ఉన్నారు. కార్మికుల ఆరోగ్యం కంటే కంపెనీల నుంచి ముడుపుల వసూళ్లపైనే అధికార పార్టీ నేతలు దృష్టి పెట్టడంతోనే ఈఎస్ఐ ఆసుపత్రి సాకారం కావడం లేదని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
నిర్మాణ కార్మికుల్లో నిస్తేజం: వైకాపా పాలనలో భవన నిర్మాణ కార్మికుల బ్రతుకులు దుర్భరంగా మారాయి. గతంలో కూలీల కోసం యజమానులు వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఎప్పడు పని దొరుకుతుందా అని కూలీలు పనుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. పెరిగిన ఇసుక ధర, సిమెంట్, ఇనుము ధరలు ఆకాశాన్ని అంటడంతో ఇంటి నిర్మాణాలపై యజమానులు ఆసక్తి చూపడం లేదు. దీంతో కూలీలకు పనులు దొరకడం లేదు. ముఖ్యంగా ఇసుక ధర పెరగడం డబ్బులు పెట్టి కొందామన్న అందుబాటులో లేకపోవడంతో చాలామంది నిర్మాణాలు ఆపేశారు. దీని ప్రభావం భవన నిర్మాణ కార్మికులపై పడింది. జిల్లాలోని అనకాపల్లి, చోడవరం, ఎలమంచిలి కార్మికశాఖ కార్యాలయాల పరిధిలో 1,10,069 మంది భవన నిర్మాణ కార్మికులు రిజిస్టర్ అయ్యారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డ్లో ఉన్న నిధులను జగన్ సర్కారు ఇతర అవసరాలకు వాడుకోవడంతో వీరి గోడు వినే నాథుడే లేకుండా పోయాడు.
అచ్యుతాపురం పరిసర ప్రాంతాల్లో 55 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరు ప్రతి వైద్య అవసరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనకాపల్లి కానీ, 45 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం కానీ వెళ్లాల్సి వస్తోంది. అనకాపల్లి దూరం తక్కువే అయినా అధ్వాన రోడ్డు కారణంగా ప్రయాణ సమయం గంట పడుతోంది. అత్యవసర సమయంలో ఇంత జాప్యం ప్రాణాంతకంగా మారుతోంది.
ఇవీ ప్రమాదాలు..
- 2022 డిసెంబర్లో పరవాడ ఫార్మాసిటీలోని లారస్ ల్యాబ్స్లో ప్రమాదం జరిగి అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు.
- పరవాడ ఫార్మాసిటీలోనే సాయినర్, మరికొన్ని రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు చోటుచేసుకుని కార్మికులు గాయపడ్డారు.
- సాహితి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ఆరుగురు చనిపోగా, మరో నలుగురు గాయపడ్డారు. ఇలా తరచూ ప్రమాదాలు చోటు చేసుకునేచోట ఆసుపత్రి సేవలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.. అధికారులు, పాలకపక్ష నేతలు ఆ దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నించక పోవడంతో కార్మికుల ప్రాణాలకు భద్రత లేకుండాపోతోంది.
- గతేడాది సీడ్స్ దుస్తుల తయారీ పరిశ్రమలోవిషవాయువు పీల్చి 539 మంది మహిళలు అస్వస్థతకు లోనయి అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందారు.
- ఎంఎఫ్జీ ఎఫ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు.
అక్కడ బతుకుతెరువు లేక.. ఇక్కడ బతకలేక!: బతుకుతెరువు కోసం వచ్చిన కూలీల బతుకులు దుర్భరంగా మారాయి. అచ్యుతాపురం పరిసర పరిశ్రమల్లో 10 వేలమంది వరకు ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు పనిచేస్తున్నారు. వీరంతా కోళ్లఫారాలను మరిపించే గుడారాల్లో దయనీయంగా జీవిస్తున్నారు. గతేడాది దుప్పితూరులో గుడారాల్లో నివాసం ఉంటున్న ఒడిశాకు చెందిన ముగ్గురు కార్మికులు డయేరియా లక్షణాలతో మృతిచెందారు.
వలస కార్మికులు వారి కుటుంబాలతో ఎక్కడ నివాసం ఉంటున్నారో అనే వివరాలేవీ జిల్లా యంత్రాంగం వద్ద లేకపోవడం... వీరి భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీటి సరఫరాలో గోల్‘మాల్’..!
[ 22-05-2024]
మండు వేసవిలో ప్రజలు తాగునీటికి అల్లాడుతుంటే అధికారులు మాత్రం ఓ భారీ మాల్కు నిత్యం లక్షల లీటర్ల నీటిని అనధికారికంగా తరలిస్తున్నారు. దీని కోసం కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా సమయాన్ని తగ్గించేశారనే విమర్శలొస్తున్నాయి. -
భారీ గోతులు.. నిత్య వెతలు!!
[ 22-05-2024]
విశాఖ మహానగరంలో అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో గాజువాకలోని ఆటోనగర్ పారిశ్రామికవాడ మార్గమొకటి. ఆటోనగర్ ప్రవేశ ద్వారం వద్ద రహదారిని చూస్తే ఎంత బాగుందో అనిపిస్తుంది. -
తొలుత బ్యాలట్.. తర్వాత ఈవీఎం ఓట్లు..!
[ 22-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలకు పోలైన ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈనెల 13న జరిగిన పోలింగ్లో జిల్లా వ్యాప్తంగా 70.02శాతం చొప్పున 14,09,118 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
మానవ అక్రమ రవాణా మూలాల ఛేదనకు ప్రత్యేక బృందాలు: సీపీ
[ 22-05-2024]
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కాంబోడియాలోని ఏజెన్సీలకు నిరుద్యోగులను విక్రయిస్తున్న అంశంపై మరింత లోతైన దర్యాప్తు చేపడుతున్నట్లు నగర పోలీసు కమిషనర్ రవిశంకర్ తెలిపారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద..భద్రత పరిశీలన
[ 22-05-2024]
ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ మల్లికార్జున మంగళవారం పరిశీలించారు. -
దువ్వాడ పూర్వ సీఐపై కేసు నమోదు
[ 22-05-2024]
దువ్వాడ పోలీస్స్టేషన్లో గతంలో పని చేసిన సీఐ బి.శ్రీనివాసరావుపై ఫోర్జరీ కేసు నమోదైంది. మంగళవారం దువ్వాడ ప్రస్తుత సీఐ ఎర్రన్నాయుడు తెలిపిన వివరాలివి. -
అప్పన్న ఆలయంలో నేడు నృసింహ జయంతి
[ 22-05-2024]
వైశాఖ శుద్ధ చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో శ్రీనృసింహ జయంతి వైభవోపేతంగా జరగనుంది. -
చంద్రబాబే ముఖ్యమంత్రి!
[ 22-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబునాయుడే కాబోయే ముఖ్యమంత్రి అని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. -
త్వరలో రైతులకు గుర్తింపు కార్డుల జారీ
[ 22-05-2024]
జనవరి నెలలో ఎంపిక చేసిన రైతులకు త్వరలో గుర్తింపుకార్డులు జారీ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగ్ అధికారి యాసిన్ ఒక ప్రకటనలో తెలిపారు. -
స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై అనుమానాలు: కేఏ పాల్
[ 22-05-2024]
ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై అనుమానాలు ఉన్నాయని ప్రజాశాంతి పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి కేఏ పాల్ అన్నారు. -
ఉక్కు కార్మికులకు సగం వేతనాలు చెల్లింపు
[ 22-05-2024]
ఉక్కు కార్మికులకు ఏప్రిల్ నెలకు సంబంధించి సగం వేతనాలను మంగళవారం చెల్లించారు. ఆ వివరాలు... మే నెల 21 రోజులు గడిచిపోయినా వేతనాల చెల్లింపులు లేకపోవడంతోఆగ్రహించిన కార్మికులు మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. -
చెరువు మట్టి.. తవ్వుకుంటే అడిగేదెవరేటి?
[ 22-05-2024]
చెరువులు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో మట్టి అమ్మకాల ద్వారా సొమ్ములు వెనకేసుకుంటున్నారు. -
బైకును ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 22-05-2024]
జాతీయ రహదారిపై ఉద్దండపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. -
రికార్డుల్లేని వాహనాల స్వాధీనం
[ 22-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అల్లర్లు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..