logo

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలనకు ఇవే చివరి ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో తుగ్లక్‌ పరిపాలనకు ఇవే చివరి ఎన్నికలు అని సినీనటుడు, జనసేన ప్రచారకుడు పృథ్విరాజ్‌ అన్నారు. ఎంవీపీకాలనీ విశాఖ పార్లమెంటు కూటమి అభ్యర్థి శ్రీభరత్‌ ఎన్నికల కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 01 May 2024 03:25 IST

సినీ నటుడు పృథ్విరాజ్‌

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్‌లో తుగ్లక్‌ పరిపాలనకు ఇవే చివరి ఎన్నికలు అని సినీనటుడు, జనసేన ప్రచారకుడు పృథ్విరాజ్‌ అన్నారు. ఎంవీపీకాలనీ విశాఖ పార్లమెంటు కూటమి అభ్యర్థి శ్రీభరత్‌ ఎన్నికల కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు తాను నిర్వహించిన ప్రచారంలో తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థులకు అపురూప ఆదరణ లభిస్తోందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కుతున్నా, కొందరి ఖాతాలకే నిధులు చేరుతున్నాయన్నారు. సరైన రహదారులు, నీటి పారుదల ప్రాజెక్టులు లేక వైకాపా ఎమ్మెల్యేలపై ప్రజలు తిరగబడుతున్నారన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు బూతులు మాట్లాడటాన్ని ప్రజలు గమనించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విధానాలను మరింత సమర్థంగా అమలు చేస్తుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు