logo

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 11మంది నిరుపేదలకు ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆదివారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను..

Updated : 05 Dec 2021 19:05 IST

బలిజిపేట: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 11మంది నిరుపేదలకు ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆదివారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో శస్ర్తచికిత్సలు చేయించుకున్న వీరికి సీఎం సహాయనిధి నుంచి రూ.5.65లక్షలు మంజూరైంది. ఈ కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయం అందించిందని ఎమ్మెల్యే అన్నారు. బలిజిపేట, నారాయణపురం, తుమరాడ, వంతరాం తదితర గ్రామాలకు చెందిన నిరుపేదల ఇంటికి వెళ్లి ఈ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు సాయికృష్ణ, తమ్మినాయుడు, వెంకటరమణ, లక్ష్మణ్‌రావు, శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని