కొత్త పంచాయతీలు..కాసులకు కష్టాలు
జిల్లాలో ఎన్నికలకు ముందు 40 పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. తర్వాత జరిగిన ఎన్నికల్లో కొన్నింటిలో పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. రెండు చోట్ల వివాదాల నేపథ్యంలో ఎన్నికలు జరగలేదు. సాధారణంగా ఓ పంచాయతీలో అభివృద్ధి పనులు చేయాలంటే సర్పంచి,
శ్రీరంగరాజపురం పంచాయతీ
న్యూస్టుడే, గజపతినగరం, గరివిడి, సీతానగరం జిల్లాలో ఎన్నికలకు ముందు 40 పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. తర్వాత జరిగిన ఎన్నికల్లో కొన్నింటిలో పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. రెండు చోట్ల వివాదాల నేపథ్యంలో ఎన్నికలు జరగలేదు. సాధారణంగా ఓ పంచాయతీలో అభివృద్ధి పనులు చేయాలంటే సర్పంచి, కార్యదర్శి పొజిషన్ ఐడీ అనుసంధానమైన ఖాతా నుంచి నిధులు ఖర్చు చేయొచ్చు. కొత్తగా ఏర్పడిన పంచాయతీలకు వారం రోజుల కిందట సర్పంచుల పేరుతో ఖాతాలు ఏర్పాటైనా..గ్రామ కార్యదర్శులకు సంబంధించి ఐడీ మాత్రం ఇప్పటికీ వాటికి అనుసంధానించలేదు. దీంతో నిధులు లేక పనులు చేయడం లేదు. పాత పంచాయతీల నుంచి రావాల్సిన వాటా కూడా కొత్తవాటికి బదలాయింపు కాలేదు. వాటిని ఉపఖజానాశాఖ అధికారులు సరిచేయాలి. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రూ.7 లక్షల ప్రోత్సాహక నిధులు కూడా జమ కాలేదు.
* గజపతినగరం మండలంలోని పాత శ్రీరంగరాజపురం పంచాయతీ నుంచి కొత్త శ్రీరంగరాజపురం పంచాయతీ కొత్తగా ఏర్పాటైంది. పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు నగదు లేదు, వీధిదీపాల ఏర్పాటు, కాలువల మరమ్మతులు, తాగునీటి నిర్వహణ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదైనా పంచాయతీకి నిధులు ఖర్చుచేసే అవకాశం లేక సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని సర్పంచి పైడిపునాయుడు వాపోయారు.
* ఇదే మండలం కొత్తవలస పంచాయతీ నుంచి ఏర్పడిన రంగుపురంలో కాలువలు, రహదారి సమస్య పరిష్కారానికి నిధులు లేవని సర్పంచి లక్ష్మణరావు చెబుతున్నారు.
* గరివిడి మండలానికి చెందిన కొండశంభాం పంచాయితీ నుంచి పీజే పాలెం, ఏనుగువలస పంచాయతీ నుంచి బాగువలస కొత్తగా ఏర్పడ్డాయి. రెండు చోట్ల పాలకవర్గాలను ఎన్నుకున్నారు. ఏడాది గడుస్తున్నా కార్యదర్శి పొజిషన్ ఐడీ అనుసంధానం కాక పారిశుద్ధ్య పనులు చేసినా నిధులు తీయలేని పరిస్థితి. కాలువల అనుసంధానం, తాగునీటి నిర్వహణ సమస్యలు వేధిస్తున్నాయి. బాగువలసలో రహదారులకు మరమ్మతులు చేయలేని దుస్థితి.
* సీతానగరం మండలం లక్ష్మీపురం పంచాయతీ నుంచి ఏగోటివలస పంచాయతీ కొత్తగా ఏర్పాటైంది. బ్యాంకు ఖాతాలు తెరిచారు. కార్యదర్శి ఐడీ క్రియేట్ కాక నిధులు జమకాలేదు. గ్రామాన్ని ఆనుకుని తోటపల్లి కుడి కాలువ వెళ్తుండడంతో బురద చేరుతోంది. నిధులు లేక రిటర్నింగు గోడ నిర్మించాలన్న కొత్త పాలకవర్గం ఆలోచన ఆచరణకు నోచుకోవడం లేదు.
చిన్న పనికీ సమస్యే...
వీధి దీపాల నిర్వహణ, మంచినీటి సరఫరా, కాలువల శుభ్రం, చెత్త తరలింపునకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెత్త శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ఏడాదిగా అవకాశం లేకపోయింది. సమస్యల పరిష్కారం, కొత్త పనులకు అవకాశం లేకుండా పోయిందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ నిధులు జమకాలేదు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఇప్పటికీ పడలేదు.
పాత పంచాయతీ నిధులపై...
పాత వాటిలో నిధులుంటే అక్కడి సర్పంచి కొత్త పంచాయతీకి చెందాల్సిన నిధులకు సంబంధించి అనుమతిస్తే వీరి ఖాతాకు బదలాయించొచ్చు. అలా ఇప్పలవలస పంచాయతీ నుంచి చింతాడవలసకు మార్చాం.
- సింహాచలం, ఉపఖజానాధికారి, గజపతినగరం.
సర్పంచి ఐడీతో ఖర్చు చేసుకోవచ్చు
కొత్త పంచాయతీలకు సంబంధించి నిధులను గ్రామ కార్యదర్శుల ప్రమేయం లేకుండా వినియోగించే పూర్తి అధికారం సర్పంచులకు ఉంది. పాతపంచాయతీల నిధులు కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఉంది. 15వ ఆర్థిక సంఘ నిధులు రాలేదు. ఇతర సాధారణ నిధులు జమయ్యేలా చర్యలు తీసుకున్నాం.
- ఎస్.సుభాషిణి, జిల్లా పంచాయతీ అధికారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలుసా జగన్.. ప్రాణాల విలువ
[ 27-04-2024]
జగన్.. నా గిరిజనులు అన్నావ్.. అన్నగా అండగా ఉంటానన్నావ్.. మరి ఎందుకు కొండ శిఖర గ్రామాలను వదిలేశావ్.. -
116 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎంపీ, నియోజకవర్గ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. సక్రమంగా లేని 116 నామపత్రాలను అధికారులు తిరస్కరించారు. -
ఓటింగ్ శాతం పెంపునకు కృషి
[ 27-04-2024]
జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా, తలాత్ పర్వేజ్ కోరారు. -
వైకాపాతో యువతకు నష్టం: కిమిడి
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, యువతకు ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్లిపోయారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు -
ఇంజినీరింగ్ విద్య.. ఓ జగన్మాయ
[ 27-04-2024]
నా ఎస్సీలు.. నా ఎస్టీలంటూనే వారిపై కపట ప్రేమ చూపించి ఆయా వర్గాల వారికి తీవ్ర అన్యాయం చేశారు సీఎం జగన్మోహన్రెడ్డి. తన సొంత కుటుంబంగా భావించి గిరిజనులకు మంచి చేస్తానని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతానంటూ ప్రేమ ఒలకబోసి దెబ్బ కొట్టారు. -
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలోని 31 కేంద్రాల్లో శనివారం పాలీసెట్ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఈమేరకు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల సమన్వయాధికారులు ఆశా రమణి, -
తెదేపాలోకి ముద్దాడ
[ 27-04-2024]
వైకాపా నేత, ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముద్దాడ మధు యాదవ్ శుక్రవారం తెదేపాలో చేరారు. -
ప్రజల వద్దకే సేవలంటే ఇలాగేనేమో..
[ 27-04-2024]
గ్రామీణ ప్రజలకు సేవలు మరింత చేరువ చేస్తాం.. ప్రభుత్వ కార్యకలాపాలు అందుబాటులో ఉంచుతాం.. అందుకే గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.. -
రూ.6.47 కోట్ల బంగారం, వెండి వస్తువుల స్వాధీనం
[ 27-04-2024]
వ్యానులో తరలిస్తున్న రూ.6.47 కోట్ల విలువజేసే బంగారం, వెండి వస్తువులను విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలస చెక్పోస్టు వద్ద పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. -
వీటిని చూస్తే.. పేకమేడలే సిగ్గు పడవా!!
[ 27-04-2024]
పేదలకు అన్ని వసతులతో కూడిన ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి.. రేపోమాపో కూలిపోయే పేకమేడలు నిర్మిస్తున్నారు. -
అభివృద్ధిపైనా అక్కసేనా?
[ 27-04-2024]
ప్రభుత్వాలు మారినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.. ఇందుకు విరుద్ధంగా ఉంది వైకాపా ప్రభుత్వం తీరు.. ప్రజల అవసరాలతో పని లేదన్నట్లు గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు నిలిపేసి అక్కసు ప్రదర్శించింది.