నకిలీ నోట్ల చెలామణి
నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న దంపతులను పార్వతీపురం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ప్రయోగమూర్తి సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన సత్యనాగమల్లేశ్వరరెడ్డి, వనజ దంపతులకు ఈనెల 11న రాజమహేంద్రవరానికి చెందిన
దంపతుల అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న ఎస్సై ప్రయోగమూర్తి
పార్వతీపురం పురపాలక, న్యూస్టుడే: నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న దంపతులను పార్వతీపురం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ప్రయోగమూర్తి సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన సత్యనాగమల్లేశ్వరరెడ్డి, వనజ దంపతులకు ఈనెల 11న రాజమహేంద్రవరానికి చెందిన అనిల్రెడ్డి అనే వ్యక్తితో అనపర్తిలో జరిగిన ఓ వివాహ వేడుకలో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో ఆయన నకిలీ నోట్ల గురించి వీరికి వివరించి, రూ.10 వేలు తీసుకుని రూ.20 వేల నకిలీ నోట్లు ఇచ్చాడు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత వీరు బొబ్బిలిలోని దాడితల్లి పండగకు వెళ్లి కొన్ని నోట్లు మార్చారు. అనంతరం ద్విచక్రవాహనంపై జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు రాయగడలో తిరిగి వివిధ రకాల వస్తువుల కొనుగోళ్లకు చెల్లని నోట్లిచ్చారు. మూడురోజుల క్రితం కొమరాడ మండలం కోటిపాంలోని ఓ దుకాణం వద్ద ఇలాగే కొనుగోలు చేస్తూ దుకాణదారుడికి దొరికిపోయారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం పార్వతీపురంలోని పాతబస్టాండు వద్ద ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కొన్ని దొంగనోట్లు, ద్విచక్ర వాహనం, సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. అనిల్రెడ్డిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసేందుకు బృందాలను పంపిస్తున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్