కనుల ముందుకు కలల లోకం
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
రామోజీ ఫిల్మ్సిటీలో సందడి షురూ
హాలిడే కార్నివాల్లో కోలాహలం
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే
యురేకా వేదిక వద్ద కళాకారుల నృత్య ప్రదర్శన
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. సెలవు రోజుల్లో ప్రకృతి రమణీయ అందాల ఫిల్మ్సిటీలో సరదా సరదాగా గడిపేందుకు తరలివచ్చిన పర్యాటకులతో కోలాహలం గురువారం ప్రారంభమైంది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఫిల్మ్సిటీకి తరలివచ్చిన సందర్శకులు వినోదాలను ఆస్వాదిస్తూ ఆనందతీరాలను చవిచూస్తున్నారు. సంభ్రమాశ్చర్యానికి గురిచేసేలా తొలిసారి వర్చువల్ షూట్ అనుభూతిని పర్యాటకులకు అందుబాటులో ఉంచడంతో ఆబాలగోపాలం ఆ అనుభూతిని ప్రత్యక్షంగా వీక్షించి ఆనందిస్తున్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు రోజంతా మైమరపించే ఫిల్మ్సిటీ అందాల మధ్య ఆనందడోలికల్లో తేలియాడుతూ వినోదం, విహారం కలగలిసిన హాలిడే కార్నివాల్లో పర్యాటకులు ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు.
ప్రత్యేకతలెన్నో
రామోజీ ఫిల్మ్సిటీలో హాలిడే కార్నివాల్లో ప్రత్యేకతలెన్నో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సినీ ప్రేక్షకుల మదినిదోచే ఆధునిక సాంకేతికత.. మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్ను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఫిల్మ్సిటీలోని వర్చువల్ ప్రొడక్షన్ సెట్లోకి అడుగుపెట్టి ఆ క్షణాలను ప్రతి ఒక్కరూ మధుర జ్ఞాపకాలుగా మలుచుకుంటున్నారు. అంతేకాదండోయ్ రెయిన్ డ్యాన్స్ ఫ్లోర్పై వేసవితాపం దరిచేరకుండా జల్లుల్లో తడిసిముద్దవుతూ సందర్శకులు ఆనందతీరాలను చేరుతున్నారు. ఉత్సాహం, ఉత్తేజం నింపే సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ సరికొత్త ఆనందాల్లో మునిగితేలుతున్నారు. యురేకా వేదికపై కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. ఫిల్మ్సిటీలో మునుపెన్నడూ చూడని మ్యాజికల్ గ్లో గార్డెన్ అందాలను కళ్లారా వీక్షిస్తూ కలల లోకంలోకి వచ్చిన అనుభూతిని పొందుతున్నారు. మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుత్తు దీపకాంతుల్లో మెరిసే గార్డెన్లో శిల్పాలు, వివిధ జంతు ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. కనువిందుగా సాగే కార్నివాల్ పరేడ్లో డీజే బీట్లకు ఆడుతూ సంతోషాల్లో తేలియాడుతున్నారు.
కార్నివాల్ పరేడ్
ప్రత్యేక ప్యాకేజీలు
హాలిడే కార్నివాల్లో పాలుపంచుకోవాలనుకునే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ ప్యాకేజీలున్నాయి. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు వేడుకలను ఆస్వాదించేందుకు వచ్చే పర్యాటకులు స్టూడియో టూర్ను నాన్ ఏసీ బస్సులో తిరిగి వీక్షించవచ్చు. ప్రీమియం ప్యాకేజీని ఎంచుకొనే పర్యాటకులకు ఏసీ బస్సులో స్టూడియో టూర్, ప్రత్యేక షోలకు ఎక్స్ప్రెస్ ఎంట్రీ అవకాశం, బఫెట్ లంచ్ అందిస్తారు. మరో ప్యాకేజీలో స్టూడియో టూర్తో పాటు పరిమితమైన కాంబో డిన్నర్ అందిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్యాకేజీని ఎంచుకుంటే స్టూడియో టూర్, పరిమితమైన కాంబో డిన్నర్ అందిస్తారు. ప్రీమియం ఈవినింగ్ ప్యాకేజీని ఎంచుకొనే వారికి ఏసీ బస్సులో స్టూడియో టూర్, ప్రత్యేక షోలకు ఎక్స్ప్రెస్ ఎంట్రీ అవకాశం ఉంటుంది. బఫే డిన్నర్ అందిస్తారు. చిన్నారులకు స్పెషల్ సమ్మర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని వివరాలకు..: www.ramojifilmcity.com కు లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు ఫోన్ చేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జననేతనన్నావు.. జలమేదీ జగన్?
[ 04-05-2024]
బటన్లు నొక్కే జగన్కు జనాల బాధలు పట్టడం లేదు. ఈ అయిదేళ్లలో తాగునీటి పథకాలకు పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకోవాలని చూశారు తప్ప ప్రజల గొంతు తడిపే ప్రయత్నమే చేయలేదు. వైకాపా పాలనలో గ్రామాల్లో కొత్తగా నీళ్ల కుండీలను నిర్మించిందీ లేదు. -
జగన్ను ఇంటికి పంపితేనే మన్యం అభివృద్ధి
[ 04-05-2024]
అధ్వాన పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి ఎద్దేవా చేశారు. -
జగనన్న కక్ష.. అవ్వాతాతలకు శిక్ష
[ 04-05-2024]
పింఛను సొమ్ము సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేసే అవకాశం ఉన్నా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులను బలిపశువులను చేసింది. -
వైకాపా పతనం ఖాయం
[ 04-05-2024]
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు తథ్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి దొన్నుదొర పేర్కొన్నారు. -
వైకాపా వాహనం స్వాధీనం
[ 04-05-2024]
అనుమతులు లేకుండా వైకాపా ప్రచార సామగ్రి తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎంపీడీవో, ఎన్నికల అధికారి వెంకటరావు తెలిపారు. -
తెదేపాలో భారీగా చేరికలు
[ 04-05-2024]
దామనాపల్లి, సంకాడ పంచాయతీల నుంచి వైకాపా, సీపీఎంలకు చెందిన కార్యకర్తలు భారీగా తెదేపాలోకి చేరారు. మాడెం, బంధవీధి, దొడ్డికొండరెల్లివీధి, చిన్నజడుమూరు గ్రామాలనుంచి సుమారు 200 మంది పాడేరు కూటమి అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
ఉద్యోగాలిప్పిస్తామని టోకరా
[ 04-05-2024]
ఉద్యోగాలిప్పిస్తామని గిరిజన యువతను ఇద్దరు మహిళలు మోసం చేశారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. -
పేదల పొట్టకొట్టిన జగమొండి
[ 04-05-2024]
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు. -
‘జగన్కు ఒక్క అవకాశమిచ్చి అందరం మోసపోయాం’
[ 04-05-2024]
‘గత ఎన్నికల్లో జగన్ ఒక్క అవకాశం అని అడిగితే ఇచ్చి అందరం మోసపోయాం. ఈ ఐదేళ్లలో అభివృద్ధి లేదు. సంక్షేమంలో ఆశ్రిత పక్షపాతం పెరిగిపోయింది. -
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
[ 04-05-2024]
ఎలమంచిలిలోని దిమిలిరోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించనున్న నందమూరి బాలకృష్ణ సభకు తెదేపా నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కూడలిని జెండాలతో అందంగా తయారు చేశారు. -
కాంగ్రెస్తోనే ప్రత్యేక హోదా
[ 04-05-2024]
కాంగ్రెస్ గెలుపుతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని ఆ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సతక బుల్లిబాబు అన్నారు. మంప, రేవళ్లు పంచాయతీల్లోని గ్రామాల్లో శుక్రవారం సీపీఐ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. -
జగనన్నా.. ఏమిటీ పింఛన్ వెతలు..
[ 04-05-2024]
పింఛన్లకోసం బ్యాంకులకు వచ్చిన వృద్ధులకు రెండో రోజు కష్టాలు తప్పలేదు. వీఆర్పురం మండలం రేఖపల్లిలో బ్యాంకు వద్ద రేఖపల్లి, జీడిగుప్పల పీహెచ్సీల వైద్యులు శిబిరం ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు