నమ్మించి.. నట్టేట ముంచారు
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు.
ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయని వైకాపా
సర్కార్ రోడ్డెక్కినా పట్టించుకోని జగన్
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. గద్దె ఎక్కిన తర్వాత ఆ దిశగా ఒక్క అడుగు వేయకపోగా.. కొత్త సమస్యలు సృష్టించారు. పరిష్కరించాలని రోడ్డెక్కిన ఉద్యోగులను అణచివేసే ప్రయత్నం చేశారు.
న్యూస్టుడే, గజపతినగరం, దత్తిరాజేరు, గంట్యాడ గ్రామీణం, బొబ్బిలి, గ్రామీణం, తెర్లాం రాజాం
బకాయిలు రూ.కోట్లలో..
ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీపీఎఫ్ నిధుల బకాయిలు వైకాపా ప్రభుత్వం చెల్లించలేదు. ప్రతి ఏటా అందించాల్సిన డీఏ బకాయిలు రూ.కోట్లలో ఉన్నాయి. ఇతర అలవెన్సులు ఇవ్వలేదు. ఐదేళ్లుగా ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకోలేని పరిస్థితి. పదవీ విరమణ తర్వాత పింఛను సకాలంలో మంజూరు చేయడం లేదు. ఆన్లైన్లో సేవలు పెట్టి, ఒత్తిడికి గురి చేస్తున్నారని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
- బొబ్బిలి నియోజకవర్గంలో అన్ని రకాల ఉద్యోగులు కలిపి 4,000 మంది ఉన్నారు. ఇతర మండలాల్లో పనిచేస్తూ బొబ్బిలిలో నివాసం ఉంటున్న మరో 2,000 మంది ఉన్నారు. గజపతినగరం నియోజకవర్గంలో దాదాపు 6,000, రాజాం నియోజకవర్గంలో 2,000 మందికిపైగా ఉద్యోగ, ఉపాధ్యాయులున్నారు. వీరు జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫీజులు, ఈఎంఐలు కట్టలేకపోయాం
ఐదేళ్లలో మేము ఆర్థికంగా, మానసికంగా చాలా ఇబ్బందులుపడ్డాం. సకాలంలో జీతాలు అందక పిల్లలకు ఫీజులు, ఈఎంఐలు చెల్లించలేకపోయాం. పీఆర్సీ, డీఏలు విడుదల చేయకపోవడంతో చాలా నష్టపోయాం. జగన్ అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి.. మమ్మల్ని మోసం చేశారు. అంతేగాక జీపీఎస్ పేరుతో కొత్త నాటకం ఆడారు. పాఠశాలలకు ఇవ్వాల్సిన ఖర్చులు కూడా విడుదల చేయలేదు.
ఓ ఉపాధ్యాయ సంఘ నాయకుడు, దత్తిరాజేరు మండలం
ఇబ్బందులు పెడుతున్నారు
సీపీఎస్ రద్దు చేయాలని ఐదేళ్లుగా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు ఆందోళనకు దిగినా ఆ దిశగా అడుగులు పడలేదు. దీంతో తీవ్రంగా నష్టపోయాం. విద్యావిధానంలో మార్పులు తీసుకువచ్చి.. 3, 4, 5 తరగతుల విలీనంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అన్యాయం జరిగింది. చిన్న చిన్న సమస్యలు చూపి సస్పెన్షన్లకు గురిచేశారు.
చింత భాస్కరరావు, జిల్లా యూటీఎఫ్ కోశాధికారి, మెంటాడ
బోధనేతర పనులతో ఇక్కట్లు
బోధనేతర పనులు ఎక్కువై, పాఠశాలలో విద్యార్థులకు సరైన బోధన అందించలేకపోతున్నాం. నాడు-నేడు పనుల వల్ల బోధన కుంటుపడింది. 9 యాప్లు నమోదు చేసి అప్లోడ్ చేయడం వల్ల కాలయాపన జరుగుతోంది. చాలా సందర్భాల్లో అంతర్జాలం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ముఖ గుర్తింపు హాజరు పడడంలేదు. సమయం వృథా అవుతోంది.
మునిస్వామి, యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు, తెర్లాం
పింఛనుదారుల వెతలు
వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగులకు అందించాల్సిన సౌకర్యాలు లేవు. పదవీ విరమణ చేసిన వారికి ఇవ్వాల్సి బకాయిలు సక్రమంగా అందడం లేదు. పింఛను నిర్ణయించేందుకు జాప్యం చేస్తున్నారు. సీపీఎఫ్ నిధులు ఇవ్వలేదు. సీపీఎస్ రద్దు చేస్తామని, ఎగ్గొట్టారు.
బూడి సత్యనారాయణ, గంట్యాడ మండల విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యదర్శి
ఇన్ని కష్టాలు ఎప్పుడూ లేవు
డీఏ, పీఎఫ్, ఇతర బకాయిలు రూ.20 వేల కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. సీసీఎస్ ఉద్యోగులకు కరవు భత్యం చెల్లించలేదు. 117 జీవోతో ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిదే. న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే అన్యాయం చేసింది. గత ఏ పాలనలోనూ ఇన్ని కష్టాలు పడలేదు.
జేసీ రాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కన్వీనర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుదాఘాతంతో రెండు గోవులు మృతి
[ 04-05-2024]
మండలంలోని అంపావల్లి గ్రామం రాజు చెరువు పొదల్లో పైలెట్ ప్రాజెక్టుకు విద్యుత్తు సరఫరా చేస్తున్న ఎల్టీ న్యూట్రల్ వైరు తెగి భూమిపై పడింది. -
బ్యాంకులో ఖాతాల సవరింపు
[ 04-05-2024]
సామాజిక పింఛన్ల బట్వాడా ప్రక్రియ బ్యాంకుల ద్వారా చేపట్టడం వృద్ధులకు ప్రాణసంకటంగా మారింది. వేసవి ఎండలను సైతం లెక్క చేయకుండా పింఛన్ల భృతి కోసం వృద్ధులు కాలినడకన బ్యాంకునకు వచ్చి వారి ఖాతాలను సరిచేయించుకునేందుకు వరుస కట్టారు. -
ఈ రహదారిపై ప్రయాణం చేసేదెట్టా?
[ 04-05-2024]
మండలంలోని వంతరాం గ్రామం నుంచి గళావల్లి వరకు వెళ్తున్న రహదారి చాలా చోట్ల గుమ్ములు, గోతులతో నిండి పోయింది. -
నేటికీ తగ్గని పింఛనుదారుల ఆందోళన
[ 04-05-2024]
బలిజిపేటలో అతి పెద్ద బ్యాంకు శాఖగా పేరొందిన యూనియన్ బ్యాంకునకు పింఛనుదారుల తాకిడి ఇంకా తగ్గలేదు. -
కార్యకర్తల భుజాలపై విజయచంద్ర ప్రచారం
[ 04-05-2024]
బలిజిపేట మండలంలోని తుమరాడ గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రచారానికి వచ్చిన తెదేపా అభ్యర్థి బోనెల విజయచంద్రను అక్కడి కార్యకర్తలు, వీరాభిమానులు భుజాలపై కూర్చొనబెట్టుకొని పురవీధుల్లో ఊరేగింపు చేశారు. -
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
[ 04-05-2024]
ఎందరో అభాగ్యులకు పింఛనే ఆధారం. ఆ డబ్బులు వస్తేనే పూట గడిచేది. అనారోగ్యంతో బాధపడుతున్న వారు మరెందరో.. ఆ సొమ్ములతోనే మందులు కొనుక్కొని ప్రాణాలు నిలబెట్టుకునేది.. -
గద్దెనెక్కావ్.. చెరబట్టావ్
[ 04-05-2024]
ఆయనో పెద్దన్న.. అధికారం.. అహంకారం.. ఆక్రమణలు.. ఒక్కటేమిటి.. అతడు చేయని దౌర్జన్యం లేదు.. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా.. అతడి హయాంలో అనుచరులు.. ఆ పార్టీ నాయకులదీ అదే తీరు.. ఈ ఐదేళ్లలో పాలనను.. ప్రజా సమస్యలను పక్కనెట్టి.. తవ్వకాలు, ఆక్రమణలపైనే దృష్టి పెట్టారు. -
జగన్మోసం ఇంటింత కాదయా!
[ 04-05-2024]
పదేళ్ల కిందట సంభవించిన హుద్హుద్ తుపాను జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. తీరంతో పాటు వందలాది గ్రామాల్లో బీభత్సం సృష్టించి తీవ్ర నష్టం మిగిల్చింది. -
తరుణీ.. ఛీకొట్టాల్సిన తరుణమిదే!
[ 04-05-2024]
మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు అభ్యర్థులు ప్రచారాలకు పదును పెడుతున్నారు. అధికార పార్టీ మహిళా ఓట్లపై దృష్టి పెట్టి తాయిలాల పంపిణీకి పథకాలు రూపొందిస్తోంది. నోటిఫికేషన్ రాక ముందే ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక అభ్యర్థి మహిళలకు చీర, రూ.500 నోటు పంపిణీ చేస్తున్న వీడియో ఇటీవల చక్కర్లు కొట్టింది. -
ఆమె నేత్రాలు సజీవం
[ 04-05-2024]
మనిషి మరణించాక.. దేహంతో పాటు నేత్రాలను మట్టిలో కలిపేయడం కంటే వాటిని దానం చేస్తే మరో ఇద్దరికి కంటిచూపును ప్రసాదించొచ్చు. రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన బండి సత్యవతి (73) వయోభారంతో గురువారం మృతి చెందగా కుటుంబ సభ్యులు ఆమె నేత్రాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. -
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య
[ 04-05-2024]
అప్పుల బాధ తాళలేక చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన చందులూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపిన వివరాల ప్రకారం.. చందులూరు గ్రామానికి చెందిన వాడబోయిన అప్పలరాజు (36) అప్పులు చేసి తీర్చలేక అవస్థలు పడుతున్నాడు. -
కూటమితోనే రాష్ట్రానికి భవిష్యత్తు
[ 04-05-2024]
కూటమి విజయంతోనే రాష్ట్రానికి భవిష్యత్తు అని జిల్లాలోని సాలూరు, పాలకొండ, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల కూటమి అభ్యర్థులు గుమ్మిడి సంధ్యారాణి, నిమ్మక జయకృష్ణ, బోనెల విజయచంద్ర, తోయక జగదీశ్వరి అన్నారు. -
దళితవాడలని వదిలేశారా?
[ 04-05-2024]
పురపాలక పరిధిలోని ఎక్కువ జనాభా ఉన్న దళితవాడ నందమూరి కాలనీ సమస్యలు నెలవుగా మారింది. ఇక్కడి నివాసితులు శిథిÅల గృహాల్లో భయంతో జీవనం సాగిస్తున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దళితులకు 150 గృహాలతో నందమూరి కాలనీ నిర్మించారు. -
పాలకా.. ఇది మీ పాపమే
[ 04-05-2024]
భామిని మండలంలోని అంపోలు-బత్తిలి మార్గంలో కొరమ నుంచి బత్తిలి వరకు వెళ్లాలంటే నరకయాతన పడాల్సి వస్తోంది. ఆరు నెలల కిందట రోడ్డును పూర్తిగా తవ్వేశారు. తారురోడ్డు వేయకుండా అలాగే వదిలేయడంతో దుమ్ము రేగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు