బొబ్బిలిలో మార్పు మొదలైంది
బొబ్బిలి నియోజకవర్గంలో తెదేపాలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. వైకాపా నుంచి తెదేపాలోకి పలువురు వాలంటీర్లు, ముఖ్య నేతలు చేరారు. శుక్రవారం ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు స్వగ్రామం పక్కి నుంచి పలువురు వైకాపా నాయకులు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.
తెదేపాలోకి భారీగా వలసలు
ఎమ్మెల్యే సొంత మండలం నుంచి వాలంటీర్లు, నాయకుల చేరికలు
ఎమ్మెల్యే స్వగ్రామం పక్కి నాయకులతో బేబినాయన
బొబ్బిలి, న్యూస్టుడే: బొబ్బిలి నియోజకవర్గంలో తెదేపాలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. వైకాపా నుంచి తెదేపాలోకి పలువురు వాలంటీర్లు, ముఖ్య నేతలు చేరారు. శుక్రవారం ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు స్వగ్రామం పక్కి నుంచి పలువురు వైకాపా నాయకులు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు బొబ్బిలి, రామభద్రపురం మండలాలకు చెందిన పలువురు సైకిలెక్కారు. కూటమి అభ్యర్థి బేబినాయన వీరికి కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు.
బొబ్బిలి మండలం పక్కి గ్రామానికి చెందిన బంకురు బాబూరావు, నీటి సంఘ మాజీ ఉపాధ్యక్షుడు తెంటు అప్పలనాయుడు, సీర శంకరరావు, శంబంగి గురువుగారి అప్పలనాయుడు, రాయిపల్లి సత్యనారాయణ, పక్కి గ్రామ కమిటీ అధ్యక్షురాలు బంకురు లక్ష్మీనారాయణమ్మ, మూడో వార్డు మెంబరు బంకురు అప్పలనాయుడులతోపాటు పలు కుటుంబాలు తెదేపాలో చేరాయి. చింతాడ గ్రామానికి చెందిన వార్డు సభ్యులు చింతాడ జ్యోతి, కర్రి తిరుపతిరావు, యామలాపల్లి సత్యనారాయణ, వాలంటీరు కర్రి అనిల్, అల్లు గీతారాణి, మాజీ ఉప సర్పంచి కర్రి సత్యనారాయణ, రెడ్డి వెంకటనాయుడు, తోడిబండి పోలినాయుడు, రాము, సిరికి రామకృష్ణ, అల్లు పోలినాయుడుతోపాటు 50 కుటుంబాలు పార్టీలో చేరాయి. ఎస్.సీతారాంపురం గ్రామానికి చెందిన ముదిలి గిరిబాబు, పాలవలస సత్యనారాయణ, తుట్ట అప్పారావు, కర్రోతు అప్పలనాయుడు, కర్రోతు తిరుపతిరావు ఆధ్వర్యంలో పలు కుటుంబాలు తెదేపాలో చేరాయి. పట్టణంలోని సాయినగర్ కాలనీ వినియోగదారుల సంఘ అధ్యక్షుడు ముప్పాల నరసింగరావు, రెడ్డి రవీంద్ర, పెంట జగన్నాథం, పెంట లక్ష్మణరావు, మడక శ్రీనివాసరావు, దుర్గాసి సత్యారావు, ఎం.సత్యనారాయణ, బొత్స సన్యాసమ్మ, గొండ సాయికుమార్, ఎస్.సింహాచలంతో పాటు 30 కుటుంబాలు పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. ఇటీవల గిరిజన గ్రామాల్లోనూ బేబినాయనకు బ్రహ్మరథం పట్టారు. మీకే తమ మద్దతని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో భారీగా చేరికలు
[ 02-05-2024]
విజయనగరం పట్టణం 3వ డివిజన్కి చెందిన వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. -
రక్కసుడక్కడ.. ఇసుకాసురులిక్కడ!!
[ 02-05-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఇసుక తోడేళ్లు నదులపై పడ్డాయి.. ఈ ఐదేళ్లూ వాటిని గుల్ల చేసేశాయి.. నిత్యం టన్నుల మేర తవ్వేస్తూ తరలించుకుపోయాయి.. రూ.కోట్లలో లాభాలు ఆర్జించాయి.. -
మన్యంలో ‘దారి’ద్య్రమిది..
[ 02-05-2024]
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్, మంత్రులు చెబుతున్నా మన్యంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఐదేళ్లలో గిరిశిఖర గ్రామాల రోడ్లపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో దారులు అధ్వానంగా మారాయి. -
అంతా ఓకేనా.. ఓ సెల్ఫీ తీసుకుందాం
[ 02-05-2024]
సాలూరు మండలం కురుకుట్టి, సారిక పంచాయతీల్లో బుధవారం ప్రచారం చేసిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణితో పలువురు యువతులు స్వీయ చిత్రాలు తీసుకొని సందడి చేశారు. -
నీకు తప్ప.. రైతుకు ఏదీ భరోసా
[ 02-05-2024]
‘ఈ కేంద్రాల నుంచే వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవలు అందుతాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు ప్రభుత్వమే గ్యారెంటీ ఉంటుంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాయి. -
ఒకటి పోయె.. రెండు వచ్చె
[ 02-05-2024]
సామాజిక భద్రత పింఛన్ల లబ్ధిదారులకు ఈ నెల నగదు బ్యాంకు ఖాతాల్లో వేసేందుకే ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటింటికీ పంపిణీ చేసే అవకాశం ఉందని, పరిశీలించాలని పండుటాకులు మొరపెట్టుకున్నా చెవికెక్కించుకోలేదు. -
జగన్ పాలనలో.. ఫెర్రో.. మొర్రో..
[ 02-05-2024]
దేశంలోనే తొలి ఫెర్రో అల్లాయీస్గా 68 ఏళ్ల క్రితం గరివిడి ఫేకర్ పరిశ్రమ వెలిసింది. గత ఏప్రిల్లో ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ధరల భారంతో లేఆఫ్ ప్రకటించింది. ఇప్పటికీ పూర్తిగా తెరుచుకోలేదు. -
జగనొచ్చె.. జనాన్ని ఎండలో మాడ్చె
[ 02-05-2024]
బొబ్బిలిలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభ జనానికి ముచ్చెమటలు పట్టించింది. ఉదయం 9.30 గంటలకు సీఎం రావాల్సి ఉండగా రెండు గంటలు ఆలస్యంగా రావడంతో అప్పటి వరకు మండుటెండలో మాడిపోయారు. -
నియోజకవర్గాలకు ఈవీఎంల కేటాయింపు
[ 02-05-2024]
కలెక్టరేట్లోని ఎన్ఐసీ కేంద్రంలో బుధవారం ర్యాండమైజేషన్ రెండో విడతలో భాగంగా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను కేటాయించారు. -
ఐదేళ్లుగా ఇసుక దోచేసి.. దాచేసి..!!
[ 02-05-2024]
ఇసుక అక్రమార్కుల ధన దాహానికి గత ఐదేళ్లుగా నదులు, వాగులు గుల్ల అవుతున్నాయి. వైకాపా నేతల అండదండలతో ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్కడ ఇసుక కనపడితే అక్కడ రాత్రీపగలూ తేడా లేకుండా తోడేస్తున్నారు. -
సీఎం వచ్చారు.. బోలెడు అవస్థలు తెచ్చారు
[ 02-05-2024]
బొబ్బిలిలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభ నేపథ్యంలో బుధవారం పలు ఆర్టీసీ బస్సులను రోజూ వచ్చే మార్గాల్లో కాకుండా వేరువేరు దారుల్లో మళ్లించారు. అన్నీ స్టాపులకు బస్సులు వెళ్లలేదు. -
‘వైకాపాకు రోజులు దగ్గరపడ్డాయ్’
[ 02-05-2024]
వైకాపాకు రోజులు దగ్గరపడ్డాయని కూటమి అభ్యర్థి కళా వెంకటరావు అన్నారు. చీపురుపల్లి మండలం గొల్లలములగాం, గొల్లలపాలెం, పెదనడిపల్లి, పుర్రేయవలస గ్రామాల్లో నాయకులతో కలిసి ప్రచారం చేశారు. -
కాలగర్భంలో కలిపేసిన ‘జగన్’!
[ 02-05-2024]
వైకాపా ప్రభుత్వం అభివృద్ధి పనులపైనా అక్కసు చూపిస్తోంది. జంట పట్టణాలైన చీపురుపల్లి, గరివిడిలో భూగర్భ మురుగు పారుదల వ్యవస్థ ఏర్పాటుతో ప్రజారోగ్యం మెరుగ్గా ఉంటుందని ఆశించి గత తెదేపా ప్రభుత్వం పనులు మంజూరు చేయగా వైకాపా అధికారంలోకి వచ్చాక నిలిపివేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ
-
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
-
డీఎస్పీ టెక్నాలజీతో బౌల్ట్ సౌండ్బార్.. ధర, ఫీచర్లివే..!
-
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్సిరీస్ ఎలా ఉంది?
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు