చల్లచల్లగా.. పైకప్పు విధానం!
గతంలో ఇళ్ల పైకప్పులపై చల్లదనం కోసం చెట్ల కొమ్మలు, కొబ్బరి మట్టలు, తాటికమ్మలు, మట్టిగూన పెంకులు వేసుకునేవారు.
జనగామలో ఓ భవనం పైకప్పు మీద పెయింట్ వేస్తున్న కార్మికుడు
జనగామ, న్యూస్టుడే: గతంలో ఇళ్ల పైకప్పులపై చల్లదనం కోసం చెట్ల కొమ్మలు, కొబ్బరి మట్టలు, తాటికమ్మలు, మట్టిగూన పెంకులు వేసుకునేవారు. ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో చల్లదనం కోసం కొత్త సాంకేతిక రీతులను అనుసరిస్తున్నారు.
దేశంలోనే తొలిసారిగా..
ఈ పరిస్థితుల్లో.. ఇంధన పొదుపుతో పాటు, ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ‘చల్లని పైకప్పు (2023-2028) విధానాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 300 చ.కి.మీ చలువ పైకప్పు ఏర్పాటే లక్ష్యం.
వీటికి తప్పనిసరి: 600 చదరపు గజాలు, అంతకు మించి విస్తీర్ణం కలిగిన స్థలంలో నిర్మించే నివాస భవనాలు, ప్రభుత్వ భవనాలు, స్థల విస్తీర్ణం, నిర్మిత పరిమాణం(బిల్టప్ ఏరియా)తో సంబంధం లేకుండా అన్ని నివాసేతర, వ్యాపార, వాణిజ్య భవనాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలయ్యే అన్ని గృహనిర్మాణ పథకాలకు ఈ విధానం వర్తిస్తుంది.
ఎవరికి ఐచ్ఛికం?: సౌర విద్యుత్తు ఉత్పత్తి వ్యవస్థ ఉన్న భవనాల్లో చలువ కప్పు విధానాన్ని అనుసరించవచ్చు. రానున్న మూడేళ్లలో అన్ని నివాసేతర భవనాలకు వర్తింపజేస్తారు. ప్రస్తుతం ఈ విధాన పరిధిలోకి భవనాల యజమానులు చలువ పైకప్పుతో ఒనగూరే ప్రయోజనాలు పొందేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు.
టీఎస్బీపాస్ సాఫ్ట్వేర్లో మార్పులు
నిర్మాణ అనుమతులు పొందేందుకు అమలవుతున్న టీఎస్బీపాస్ సాఫ్ట్వేర్లోనూ మార్పులు ఉంటాయి. నిర్దేశిత విస్తీర్ణంలో నిర్మించే వారు చలువ పైకప్పు విధానాన్ని అనుసరించినట్లు రుజువులు చూపిన తరువాతే, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేసేలా నిబంధనలు రూపొందించారు. ఈ నెల ఒకటి నుంచి ఈ విధానం అమలులోకి వచ్చినట్లు పురపాలక శాఖ ప్రకటించింది. 2023-24కు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలికలు, నగర పాలికలకు లక్ష్యాన్ని నిర్దేశించారు. సిమెంటు కాంక్రీటుతో నిర్మించే భవనాల పైకప్పులు త్వరగా వేడెక్కుతాయి. దీంతో ఇంటిలోపల వేడి ప్రభావం ఉంటుంది. దీన్ని తట్టుకునేందుకు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం పెరుగుతోంది. చలువ పైకప్పు విధానంలో స్లాబుపైన తెల్లని రంగు వేస్తారు. ప్రస్తుతం లైమ్వాష్/ఆక్రిలిక్ పాలిమర్/ప్లాస్టిక్ సాంకేతికతతో కూడిన తెల్ల రంగు(పెయింట్)ను పూస్తున్నారు. పాలీవినైల్క్లోరైడ్ విధానం అందుబాటులో ఉందని, సిరామిక్ మొజాయిక్, ఆల్బిడో టైల్స్ను పరిచే విధానం నగరాల్లో ఉందని భవన నిర్మాణదారులు చెబుతున్నారు. చలువ పైకప్పులు వేడిమిని తక్కువగా గ్రహిస్తాయని, సాధారణ పైకప్పుల కంటే, ఇవి 80 శాతం మేర సూర్యకిరణాలను పరావర్తనం చెందిస్తాయని పేర్కొన్నారు.
అమలుకు చర్యలు
-ఆర్.వీరస్వామి, టీపీవో, డీటీసీపీవో, జనగామ
చలువ పైకప్పు విధానానికి సంబంధించి ప్రాథమిక ఆదేశాలు జారీ అయ్యాయి. పూర్తి స్థాయి ఆదేశాలు రావాల్సి ఉంది. ప్రభుత్వ భవనాలు, వ్యాపార సముదాయాలకు కూల్రూఫ్ నిబంధన వర్తిస్తుంది. చలువ పైకప్పునకు ఎలాంటి సాంకేతికత అనుసరించాలి.. తదితర అంశాలకు సంబంధించి త్వరలో పూర్తి సమాచారం అందుతుందని భావిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హుషారుగా.. చుట్టొద్దామా...!
[ 17-05-2024]
ఉమ్మడి వరంగల్.. సాంస్కృతిక రాజధాని. ఇక్కడ ఎన్నో పర్యాటక ఆకర్షణలు యాత్రికులను ఆకట్టుకుంటాయి. అందుకే ఈసారి వేసవిలో ఎండలు మండుతున్నా పర్యాటకులు ఓరుగల్లుకు వరుస కడుతున్నారు. -
ఎన్నికల పుణ్యం.. బడి బాగుకు మార్గం
[ 17-05-2024]
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల వల్ల ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులొచ్చాయి. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటులో భాగంగా వాటిలో మౌలిక వసతులు కల్పించారు.. తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపుల నిర్మాణాలు, విద్యుత్తు కల్పన పనులు చేపట్టారు. -
ఓరుగల్లు.. జలమయం!
[ 17-05-2024]
భారీ వర్షంతో వరంగల్ నగరం తడిసి ముద్దయింది. గురువారం సాయంత్రం నుంచి అనేక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో రహదారులపై వరద పోటెత్తింది. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సన్నాహాలు
[ 17-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు జనగామ జిల్లా ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేయగా గెలుపొందారు. -
యాదాద్రీశుడి సేవలో మాజీ మంత్రి హరీశ్రావు
[ 17-05-2024]
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట భారాస ఎమ్మెల్యే హరీశ్రావు గురువారం ఉదయం సందర్శించారు. -
వార్షిక లాభాల ప్రకటన ఎప్పుడో..?
[ 17-05-2024]
సింగరేణి సంస్థ గడిచిన ఏడాది సాధించిన లాభాల ప్రకటనపై ఆసక్తి నెలకొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,222 కోట్ల లాభాలను సాధించిన సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగా బొగ్గు ఉత్పత్తి చేసింది. -
ములుగు, భూపాలపల్లి జిల్లాలకు.. ‘ఎల్లో అలర్ట్’
[ 17-05-2024]
ఇటీవల కురిసిన వర్షాలకే రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల విరామం ఇచ్చిన వాన మళ్లీ గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో విస్తారంగా కురిసింది. -
‘రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం’
[ 17-05-2024]
ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం భారాస ఆధ్వర్యంలో కేసముద్రం మార్కెట్ కూడలిలో భారాస నేతలు రాస్తారోకో నిర్వహించారు. -
ముంపు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాల ఏర్పాటు
[ 17-05-2024]
గోదావరి వరదతో ముంపునకు గురయ్యే ప్రదేశాల్లో విద్యుత్తు స్తంభాల ఏర్పాటు పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ‘ప్రమాదం పొంచి ఉంది.. -
రైతులను మోసం చేస్తే సహించం
[ 17-05-2024]
రైతులను మోసం చేస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో విత్తనాలు, ఎరువులు, -
విధుల్లో నిర్లక్ష్యం సరికాదు..
[ 17-05-2024]
ఈ నెల 20 నాటికి అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మతులన్నింటిని పూర్తి చేయాలని డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య పేర్కొన్నారు. -
రక్తపోటు గుండెకు చేటు..!
[ 17-05-2024]
ఏ చిన్న సమస్యతో వైద్యుడి దగ్గరకెళ్లినా.. అడిగే మొదటి ప్రశ్న మీకు బీపీ (రక్తపోటు) ఉందా? కొంచెం కోపంగా మాట్లాడినా అతనికి బీపీ ఉంది అంటారు.. ఇలా అన్ని అనర్థాలకు రక్తపోటు కారణమవుతుంది. -
9,99,501 మంది ఓటుకు దూరం..
[ 17-05-2024]
గత సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్, మహబూబాబాద్ స్థానాలకు కలిపి 9,99,501 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. అంటే 29.78 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకోలేదు. -
కమీషన్ల కక్కుర్తి..!
[ 17-05-2024]
గ్రేటర్ వరంగల్ అక్రమాలకు అడ్డాగా మారింది. కమీషన్లు, పర్సంటేజీల కోసం ఉన్నత పదవిలో ఉన్నవారు సైతం ఎంతకైనా తెగిస్తున్నారు. -
పోలీసుల అదుపులో నిందితులు?
[ 17-05-2024]
ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం సమీప అడవిలో మంగళవారం హత్యకు గురైన అంగన్వాడీ టీచర్ సుజాత కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొన్నట్లు తెలిసింది.
తాజా వార్తలు (Latest News)
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!