వివాహేతరబంధానికి అడ్డుగా ఉందని.. చిన్నారిని చంపేసిన కన్నతల్లి!
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కుమార్తెను తల్లే చంపేసింది... పైగా నిద్రలోనే కన్నుమూసిందని బుకాయించింది. ఆమె ప్రవర్తనలో తేడాను గమనించిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరాన్ని అంగీకరించింది.
చిన్నారి తన్విత హత్యకేసును ఛేదించిన పోలీసులు
తన్వితతో తల్లి కల్యాణి (పాతచిత్రం)
కాప్రా, న్యూస్టుడే: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కుమార్తెను తల్లే చంపేసింది... పైగా నిద్రలోనే కన్నుమూసిందని బుకాయించింది. ఆమె ప్రవర్తనలో తేడాను గమనించిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరాన్ని అంగీకరించింది. కుషాయిగూడ ఠాణా పరిధిలో ఈ నెల 2న మృతి చెందిన నాలుగున్నరేళ్ల చిన్నారి తన్విత కేసును పోలీసులు ఛేదించారు. కన్నతల్లే హత్యచేసినట్లు తేల్చారు. ఠాణాలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ బి.ప్రవీణ్కుమార్, ఎస్ఐ షేక్ షఫీ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..
కుషాయిగూడ మార్కెట్ వద్ద నివాసం ఉండే నాయక్వాడి రమేష్కుమార్ ఆటో డ్రైవర్. అదే ప్రాంతానికి చెందిన రాజబోయిన కల్యాణి (22)ని ప్రేమించి 2018లో వివాహం చేసుకున్నాడు. జనగామ జిల్లా నర్మెట్ట ఆమె స్వగ్రామం. ఏడాదికే దంపతులకు కుమార్తె తన్విత (నాలుగున్నరేళ్లు) కలిగింది. తర్వాత కల్యాణి ప్రవర్తనలో మార్పు వచ్చింది. భర్తతో తరచూ గొడవ పడుతూ ఉండేది. 2021 ఫిబ్రవరి నుంచి దంపతులు వేరుగా ఉంటున్నారు. కల్యాణి కూతురు తన్వితతో కలిసి కుషాయిగూడలోని పుట్టింట్లో ఉంటోంది. కూరగాయల మార్కెట్లో పనిచేస్తూ కూతురిని స్థానిక ప్రైవేటు స్కూల్లో చదివిస్తోంది. దూరపు చుట్టమైన జనగామ జిల్లా బచ్చనపేట మండలం నారాయణపూర్కు చెందిన ఇండ్ల నవీన్ (19)తో ఉన్న పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారింది.
భర్తకు విడాకులు ఇచ్చాక వివాహం చేసుకోవాలనున్నారు. తన్వితను అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ పథకం వేశారు. అందులో భాగంగా నెల 1న శనివారం మధ్నాహ్నం స్కూల్ నుంచి వచ్చి భోజనం చేసిన చిన్నారిని తల్లి కల్యాణి మంచంపై పడుకోబెడుతున్నట్లు నటిస్తూ దిండును ముఖంపై అదిమిపట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది. ఈసీఐఎల్లో స్వీపర్గా పనిచేస్తున్న ఆమె తల్లి రేణుక సాయంత్రం వచ్చిచూసే సరికి మనుమరాలిలో కదలిక లేకపోవడం గమనించగా.. పడుకుందంటూ తల్లితో బుకాయించింది. తరవాత కూతురికి ఆరోగ్యం బాగోలేదని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. ఆస్పత్రికి తీసుకెళ్లి నిద్రపోయిన తన కూతురు లేవడం లేదని, బతికించాలని వైద్యులను బతిమాలుతూ నటించింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కూతురి మృతికి తన భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ ఈ నెల 2న రమేష్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ చేపట్టి సాంకేతిక ఆధారాలను సేకరించారు. కల్యాణిని విచారించగా నేరం అంగీకరించింది. హత్యకు ఉపయోగించిన దిండుతో పాటు రెండు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. ఆమెతోపాటు ప్రియుడు నవీన్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హుషారుగా.. చుట్టొద్దామా...!
[ 17-05-2024]
ఉమ్మడి వరంగల్.. సాంస్కృతిక రాజధాని. ఇక్కడ ఎన్నో పర్యాటక ఆకర్షణలు యాత్రికులను ఆకట్టుకుంటాయి. అందుకే ఈసారి వేసవిలో ఎండలు మండుతున్నా పర్యాటకులు ఓరుగల్లుకు వరుస కడుతున్నారు. -
ఎన్నికల పుణ్యం.. బడి బాగుకు మార్గం
[ 17-05-2024]
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల వల్ల ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులొచ్చాయి. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటులో భాగంగా వాటిలో మౌలిక వసతులు కల్పించారు.. తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపుల నిర్మాణాలు, విద్యుత్తు కల్పన పనులు చేపట్టారు. -
ఓరుగల్లు.. జలమయం!
[ 17-05-2024]
భారీ వర్షంతో వరంగల్ నగరం తడిసి ముద్దయింది. గురువారం సాయంత్రం నుంచి అనేక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో రహదారులపై వరద పోటెత్తింది. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సన్నాహాలు
[ 17-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు జనగామ జిల్లా ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేయగా గెలుపొందారు. -
యాదాద్రీశుడి సేవలో మాజీ మంత్రి హరీశ్రావు
[ 17-05-2024]
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట భారాస ఎమ్మెల్యే హరీశ్రావు గురువారం ఉదయం సందర్శించారు. -
వార్షిక లాభాల ప్రకటన ఎప్పుడో..?
[ 17-05-2024]
సింగరేణి సంస్థ గడిచిన ఏడాది సాధించిన లాభాల ప్రకటనపై ఆసక్తి నెలకొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,222 కోట్ల లాభాలను సాధించిన సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగా బొగ్గు ఉత్పత్తి చేసింది. -
ములుగు, భూపాలపల్లి జిల్లాలకు.. ‘ఎల్లో అలర్ట్’
[ 17-05-2024]
ఇటీవల కురిసిన వర్షాలకే రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల విరామం ఇచ్చిన వాన మళ్లీ గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో విస్తారంగా కురిసింది. -
‘రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం’
[ 17-05-2024]
ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం భారాస ఆధ్వర్యంలో కేసముద్రం మార్కెట్ కూడలిలో భారాస నేతలు రాస్తారోకో నిర్వహించారు. -
ముంపు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాల ఏర్పాటు
[ 17-05-2024]
గోదావరి వరదతో ముంపునకు గురయ్యే ప్రదేశాల్లో విద్యుత్తు స్తంభాల ఏర్పాటు పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ‘ప్రమాదం పొంచి ఉంది.. -
రైతులను మోసం చేస్తే సహించం
[ 17-05-2024]
రైతులను మోసం చేస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో విత్తనాలు, ఎరువులు, -
విధుల్లో నిర్లక్ష్యం సరికాదు..
[ 17-05-2024]
ఈ నెల 20 నాటికి అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మతులన్నింటిని పూర్తి చేయాలని డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య పేర్కొన్నారు. -
రక్తపోటు గుండెకు చేటు..!
[ 17-05-2024]
ఏ చిన్న సమస్యతో వైద్యుడి దగ్గరకెళ్లినా.. అడిగే మొదటి ప్రశ్న మీకు బీపీ (రక్తపోటు) ఉందా? కొంచెం కోపంగా మాట్లాడినా అతనికి బీపీ ఉంది అంటారు.. ఇలా అన్ని అనర్థాలకు రక్తపోటు కారణమవుతుంది. -
9,99,501 మంది ఓటుకు దూరం..
[ 17-05-2024]
గత సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్, మహబూబాబాద్ స్థానాలకు కలిపి 9,99,501 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. అంటే 29.78 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకోలేదు. -
కమీషన్ల కక్కుర్తి..!
[ 17-05-2024]
గ్రేటర్ వరంగల్ అక్రమాలకు అడ్డాగా మారింది. కమీషన్లు, పర్సంటేజీల కోసం ఉన్నత పదవిలో ఉన్నవారు సైతం ఎంతకైనా తెగిస్తున్నారు. -
పోలీసుల అదుపులో నిందితులు?
[ 17-05-2024]
ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం సమీప అడవిలో మంగళవారం హత్యకు గురైన అంగన్వాడీ టీచర్ సుజాత కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొన్నట్లు తెలిసింది.
తాజా వార్తలు (Latest News)
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత