logo

Kazipet: కాజీపేట నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు

అయోధ్య రామయ్యను దర్శించుకోవడానికి భక్తులకు కాజీపేట రైల్వే స్టేషన్‌ నుంచి నేరుగా వెళ్లే అవకాశం కలిగింది.  అయోధ్యకు వెళ్లడానికి కాజీపేట, వరంగల్‌ మీదుగా తక్కువగా రైళ్లు ఉన్నాయని ‘అయోధ్య రామా.. నిను చేరేమా’ అనే శీర్షికతో ఈ నెల 8న ఈనాడులో కథనం ప్రచురితమైంది.

Updated : 21 Jan 2024 08:20 IST

కాజీపేట, న్యూస్‌టుడే: అయోధ్య రామయ్యను దర్శించుకోవడానికి భక్తులకు కాజీపేట రైల్వే స్టేషన్‌ నుంచి నేరుగా వెళ్లే అవకాశం కలిగింది.  అయోధ్యకు వెళ్లడానికి కాజీపేట, వరంగల్‌ మీదుగా తక్కువగా రైళ్లు ఉన్నాయని ‘అయోధ్య రామా.. నిను చేరేమా’ అనే శీర్షికతో ఈ నెల 8న ఈనాడులో కథనం ప్రచురితమైంది. దీనికి స్థానిక ఎంపీలు మాలోతు కవిత, పసునూరి దయాకర్‌తో పాటు భాజపా నాయకులు రావు పద్మ, ప్రదీప్‌రావులు దక్షిణ మధ్య రైల్వే జీఎంకు వినతిపత్రాలు అందించారు. కేంద్ర రైల్వే మంత్రికి  మెయిల్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా వినతులు పంపారు. దీనికి స్పందించిన రైల్వే శాఖ కాజీపేట మీదుగా ఈనెల 30 నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.  

అందుబాటులో ఆస్తా..

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఆస్తా రైలును కాజీపేట, సికింద్రాబాద్‌ల నుంచి ప్రవేశ పెట్టింది. కాజీపేట నుంచి 07223 నెంబరుతో జనవరి 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 మొత్తం 15 ట్రిప్పులు నడుపుతుంది. అయోధ్య నుంచి కాజీపేటకు ఫిబ్రవరి 2, 4, 6, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, మార్చి 2 తేదీలలో అందుబాటులో ఉంటుంది.

కాజీపేటలో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి మరునాడు రాత్రి 9.35 గంటలకు అయోధ్య చేరుతుంది. అయోధ్యలో తిరిగి మధ్యాహ్నం 2.20 గంటలకు బయలు దేరి కాజీపేటకు మరునాటి రాత్రి 7.02 గంటలకు చేరుతుంది. ఈ రైలు పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బల్లార్ష, చంద్రాపూర్‌, సేవాగ్రామం, నాగపూర్‌, జుజార్‌పూర్‌, ఇటార్సీ, బోపాల్‌, బినా, విరాంగన, ఝాన్సీ, ఒరాయ్‌, ఖాన్‌పూర్‌, అయోధ్య స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో 20 స్లీపర్‌ కోచ్‌లు 2 జనరల్‌ బోగీలు ఉంటాయి.

సికింద్రాబాద్‌ మీదుగా మరొకటి..

సికింద్రాబాదు నుంచి అయోధ్యకు 07221 నెంబరుతో మరో ప్రత్యేక రైలు కూడా అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాదులో ఈనెల 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 తేదీలలో అందుబాటులో ఉంటుంది. అయోధ్య నుంచి ఇదే నెంబరుతో ఫిబ్రవరి 1, 3, 5, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, మార్చి 1, 3 తేదీలలో ఉంటుంది. సికింద్రాబాదులో సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి మరునాడు రాత్రి 9.30 గంటలకు అయోధ్య చేరుతుంది. అయోధ్యలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు రాత్రి 16.10 గంటలకు చేరుతుంది. ఇది కూడా కాజీపేట నుంచి బయలు దేరు ఆస్తా ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక రైలు ఆగిన అన్ని స్టేషన్లలో ఆగుతుంది.

బల్లార్ష మార్గంలో..

ఉమ్మడి వరంగల్‌, సికింద్రాబాదు ప్రజలకు ఆస్తా అయోధ్య ప్రత్యేక రైలు అందుబాటులోకి రావడం మంచి సౌకర్యం అని చెప్పవచ్చు. ఈ మార్గంలో ఎక్కువ ప్రయాణికులు కాగజ్‌నగర్‌ వరకు ప్రయాణం చేస్తారు కాబట్టి దీనిని రెగ్యులర్‌ రైలుగా మారిస్తే అందరికి సౌకర్యంగా ఉంటుంది. ఇంకా ఉత్తర ప్రదేశ్‌ వెళ్లు కూలీలకు కూడా ఇది మంచి సదుపాయం అని చెప్పొచ్చు.

ఈ నెల 8న ఈనాడులో ప్రచురితమైన కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని