ఎంజీఎం ఆసుపత్రి ఏడీ సరెండర్
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ) లక్ష్మిరాజంను మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు.
ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్టుడే: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ) లక్ష్మిరాజంను మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియామకం చేసిన నర్సింగ్ ఆఫీసర్స్ 120 మందికి విధుల్లో చేరిన 15రోజుల్లో ఉద్యోగ గుర్తింపు పత్రాలతో పాటు జిల్లా ఖజానా నుంచి వేతనం అందించేలా ఏడీ అవసరమైన దస్త్రాలను సిద్ధం చేయాల్సి ఉంది. అయితే వారు విధుల్లో చేరి రెండునెలలు గడిచినా ఎలాంటి ముందడుగు పడలేదు. పైగా డబ్బులిస్తేనే దస్త్రం కదులుతుందని మధ్యవర్తుల ద్వారా సెక్షన్ ఉద్యోగులు వసూళ్లకు పాల్పడ్డారు. ఈ విషయంపై గత నెల 14న ఈనాడులో ‘అందని వేతనాలు.. అడిగితే వసూళ్లు’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. కొత్త ప్రభుత్వం వచ్చాక నియామకం చేసిన ఉద్యోగుల నుంచి మామూళ్ల వసూలును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. తక్షణమే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ఆర్ఎంఓ డాక్టర్ అంబి శ్రీనివాస్ విచారణ చేశారు. జిల్లా ట్రేజరీ అధికారులతో మాట్లాడి నర్సింగ్ ఆఫీసర్లకు ఈ నెల 25న ఉద్యోగ గుర్తింపు పత్రాలు అందజేశారు. సీపీఎస్ నంబరు కోసం జిల్లా ఖజానా అధికారికి వివరాలు పంపించి, వేతనాలు త్వరగా వచ్చేలా చూడాలని మాట్లాడారు. అదే సమయంలో నర్సింగ్ ఆఫీసర్లకు వేతనాలు ఆలస్యం కావడానికి కారకులైన ఏడీ, ఇతర సెక్షన్ ఉద్యోగులపై అధికారులు విచారణ చేశారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించినందుకు ఏడీ లక్ష్మిరాజంను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీళ్లు మారరు వసూళ్ల పర్వం ఆపరు!
[ 21-05-2024]
ఉమ్మడి వరంగల్లోని అనేక మండలాల పరిధిలో రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది వసూళ్ల పర్వంలో మునిగితేలుతున్నారు. ప్రజలు వీరికి ఆమ్యామ్యాలు చెల్లించలేక చివరకు అవినీతి నిరోధక శాఖ (అనిశా)ను ఆశ్రయిస్తున్నారు. -
ఆరోపణలు.. విచారణలు!
[ 21-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం 14వ ఉప కులపతిగా మూడేళ్లపాటు విధులు నిర్వహించిన సామాజిక శాస్త్రం సీనియర్ ఆచార్యులు తాటికొండ రమేశ్ పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. -
స్థిరాస్తి వ్యాపారానికి ఛార్జీల పెంపు గుబులు
[ 21-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిజిస్ట్రేషను ఛార్జీల పెంపుపై కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో భూమి విలువ పెంచితే అది ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. -
సోదరులను బలిగొన్న రోడ్డు ప్రమాదం
[ 21-05-2024]
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. -
900 గ్రాముల మత్తు మందు పట్టివేత
[ 21-05-2024]
హశిష్ (గంజాయి ఆకులతో తయారు చేసినది) మత్తుమందు తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ను వరంగల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
పనులు త్వరగా పూర్తి చేయండి
[ 21-05-2024]
నగరానికి ముంపు తప్పాలంటే వరదనీరు సాఫీగా వెళ్లేలా చూడాలని, నాలాల్లో పూడికతీత పనులు తొందరగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులు, గుత్తేదారులకు సూచించారు. -
విద్యావంతున్ని గెలిపించండి
[ 21-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతుడు భారాస వైపు, నయవంచకుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని ప్రభుత్వ ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్ అన్నారు. -
జాడలేని వేసవి క్రీడా శిబిరాలు..!
[ 21-05-2024]
సెలవుల్లో చిన్నారులను క్రీడల వైపు మళ్లించడానికి తల్లిదండ్రులు తొలి ప్రయత్నంగా వేసవి శిబిరాలను ఎంచుకుంటారు. సంవత్సరం పొడవునా తరగతి గదులకు పరిమితమైన విద్యార్థుల్లో క్రీడాశిబిరాలు నూతన ఉత్సాహాన్ని నింపుతాయి. -
ఆటోడ్రైవర్లకు సీఎన్జీ కష్టాలు
[ 21-05-2024]
పెట్రోలు, డీజిల్ వాడకం తగ్గించి పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో సీఎన్జీ, విద్యుత్తు వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సీఎన్జీ కిలో ధర.. లీటరు పెట్రోల్ ధరకంటే రూ.17 తక్కువగా ఉండటం, మైలేజీ ఎక్కువగా రావడం వల్ల ఆటోడ్రైవర్లు ఈ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. -
ఖాళీ స్థలాలు.. సమస్యలకు నిలయాలు
[ 21-05-2024]
జనావాసాల్లో ఖాళీ స్థలాలు మురికి నీటితో కుంటలుగా మారి, కంపు కొడుతున్నాయి. యజమానుల నిర్లక్ష్యం అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలకు పాట్లు తప్పడం లేదు. -
నిధులున్నా.. నీరుగారిన నిర్వహణ
[ 21-05-2024]
జిల్లాకు సాగునీరందే ఏకైక సాగునీటి కాలువ ఎస్సారెస్పీ డీబీఎం 38.. రేగొండ, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, గణపురం మండలాల మీదుగా ఉప కాల్వలు ఉన్నాయి. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సన్నద్ధం
[ 21-05-2024]
జిల్లాలో ఇంకా ఎన్నికల వాతావరణం కొనసాగుతూనే ఉంది. వారం రోజుల కిందట లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఈనెల 27వ తేదీన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నిక నిర్వహణకు సందడి ప్రారంభమైంది. -
ఉపాధి కూలీలకు సౌకర్యాలు తప్పనిసరి
[ 21-05-2024]
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచే విధంగా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీజ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానం ఢీకొని.. ఫ్లెమింగోలు మృతి
-
రాయదుర్గంలో ‘ఉగ్ర’ కలకలం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
బికినీలో రకుల్ప్రీత్ సింగ్.. అనన్య ఫొటోషూట్
-
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి 6 కొత్త పాలసీలు: సీఎం రేవంత్రెడ్డి
-
శత్రువు ప్రశంసించిన నేతకు అధికారమా..: రాజ్నాథ్ సింగ్
-
అమెజాన్-ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ రివార్డులు ఉండవిక..