పదిలో 13వ స్థానం
రాష్ట్ర విద్యా శాఖ మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాకు 13వ స్థానం దక్కింది. 94.45 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత నమోదైంది.
94.45 శాతం ఉత్తీర్ణత
వెంకటాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివి 9.8 జీపీఏ సాధించి మండల టాపర్గా నిలిచిన అక్షితను అభినందిస్తున్న మంత్రి సీతక్క
ములుగు, న్యూస్టుడే: రాష్ట్ర విద్యా శాఖ మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాకు 13వ స్థానం దక్కింది. 94.45 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత నమోదైంది. జిల్లా పరిధిలో మొత్తం 3,081 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా, 2,910 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 1,494 మంది బాలురు, 1,416 బాలికలు ఉన్నారు. ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలురు 92.52 శాతం, బాలికలు 96.52 శాతాన్ని నమోదు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 16 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించగా, ప్రైవేటులో కేవలం ఐదుగురు మాత్రమే 10/10 జీపీఏ సాధించారు.
31 పాఠశాలల్లో వందశాతం
- జిల్లా పరిధిలో జడ్పీ పరిధిలోని 13 ఉన్నత పాఠశాలలు, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని 13 ఆశ్రమ పాఠశాలలు, రెండు కస్తూర్బా బాలికల విద్యాలయాలు, రెండు ఎంజేపీ గురుకులాలు, తెలంగాణ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల వందశాతం ఉత్తీర్ణత సాధించాయి.
- బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని అన్ని పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి.
- జిల్లా పరిధిలోని తొమ్మిది మండలాల్లో వివిధ రకాల ప్రభుత్వ యాజమాన్యంలో కొనసాగుతున్న 31 పాఠశాలల్లో వందశాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం విశేషం.
- ములుగు మండలం బండారుపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బాలుర గురుకుల పాఠశాలకు చెందిన దోపతి యశ్వంత్, కొత్తకొండ వరుణ్తేజ, చిందం రోహిత్, సాధు హర్షిత, కొలిపాక రాంచరణ్ విద్యార్థులు ఒకే పాఠశాల నుంచి 10/10 జీపీఏ సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు.
- ఏటూరునాగారంలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు సీరం బింధు సాయిలత, కన్నాయిగూడెం కేజీబీవీ ఉన్నత పాఠశాలకు చెందిన కుందారపు శివాని, గోవిందరావుపేట మండలం చల్వాయి మోడల్ స్కూలుకు చెందిన గండ్రకోట అను, సుధిని అశ్మిత, ములుగు మండలం బండారుపల్లి మోడల్ స్కూలుకు చెందిన ఆంగోతు సాయి చందన, నూనె శ్రీచందన, 10/10 జీపీఏ సాధించారు.
సమన్వయంతో ఉత్తమ ఫలితాలు
- జి.పాణిని, డీఈవో, ములుగు
రాష్ట్రంలో 13వ స్థానంలో ములుగు జిల్లా నిలిచింది. ప్రభుత్వ యాజమాన్యం పరిధిలోని పాఠశాలల్లో చదివిన 16 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. పాఠశాలల్లో ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాం. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేశాం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయంతో మంచి ఫలితాలు సాధించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యం
[ 22-05-2024]
2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు చేసుకోవాలని సింగరేణి సంచాలకులు వెల్లడించారు. -
గుట్టల్లో తోడేస్తున్నారు !
[ 22-05-2024]
సహజ సంపద కళ్ల ముందే కనుమరుగవుతోంది.. స్వార్థపరుల చేతుల్లో పడి ఎక్కడ చూసినా కొండలు కరిగిపోతున్నాయి. -
బాణాపురంలో ప్లాటు కనిపిస్తే కబ్జానే..!!
[ 22-05-2024]
జనగామ పట్టణంలోని ఎల్లంల రోడ్డు వైపు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్లాట్లు కేటాయించింది. -
రాకేశ్రెడ్డికి సహకారం అందించండి
[ 22-05-2024]
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిగా సహకరించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారని రాష్ట్ర వికలాంగుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వాసుదేవరెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం