పదిలో 16వ స్థానం
రాష్ట్ర విద్యా శాఖ అధికారులు మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 16వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది రాష్ట్ర స్థాయిలో ఐదో స్థానం కైవసం చేసుకోగా ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది..
పడిపోయిన ఉత్తీర్ణత శాతం
పరీక్షకు హాజరైన పదో తరగతి విద్యార్థులు(పాత చిత్రం)
భూపాలపల్లి, న్యూస్టుడే: రాష్ట్ర విద్యా శాఖ అధికారులు మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 16వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది రాష్ట్ర స్థాయిలో ఐదో స్థానం కైవసం చేసుకోగా ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది.. 2022-23లో ఉత్తీర్ణత శాతం 94.63 శాతం నమోదు కాగా.. ఈ సారి 92.31 శాతానికి తగ్గింది.. ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో గందరగోళం నెలకొంది. గణపురం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల పరీక్ష కేంద్రంలో ముగ్గురు విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడితే.. వారిని అధికారులు డిబార్ చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై ముగ్గురు ఇన్విజిలేటర్లు సస్పెన్షన్కు గురికాగా, ఆ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారిపై చర్యల నిమిత్తం జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్జేడీకి నివేదిక పంపించారు. ఈ విద్యా సంవత్సరం(2023-24)లో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను సీసీ కెమెరాల నీడలో చాలా పకడ్బందీగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 69, కేజీబీవీలు 11, ఆదర్శ పాఠశాలలు 6, ప్రభుత్వ ఆశ్రమ, గురుకుల పాఠశాలలు 10, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు 27 వరకు.. మొత్తం 123 వరకు పాఠశాలలున్నాయి. గత మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా బాలురు 1,782, బాలికలు 1,755 మంది, మొత్తం విద్యార్థులు 3,537 మంది పరీక్ష రాయగా, ఇందులో బాలురు 1,645, బాలికలు 1,643 మంది పాస్ అయ్యారు. జిల్లాలో మొత్తం 3,288 మంది ఉత్తీర్ణులయ్యారు.
బాలురదే పైచేయి
ఈ ఏడాదిలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారిలో బాలికల కంటే బాలురు ఇద్దరు ఎక్కువగా ఉన్నారు. గణపురం మండలం గాంధీనగర్ మహాత్మా జ్యోతిబా ఫులే(లింగాల క్రాస్) విద్యాలయంలో మొత్తం 76 మంది బాలికలు పరీక్ష రాయగా, వంద శాతం పాసయ్యారు. ఇందులో ఇద్దరు బాలికలు 10 జీపీఏ సాధించారు. అదేవిధంగా పెద్దాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒకరు, కేజీబీవీ చిట్యాలలో ఒకరు, మొత్తం నలుగురు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. పలు ప్రైవేటు పాఠశాలల్లో 42 మంది విద్యార్థులు 10 జీపీఏలతో మెరిశారు.
మండలాల వారీగా..: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం చిట్యాల మండలం విద్యార్థులు సాధించారు. 97.63 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అతి తక్కువగా మహదేవపూర్ మండలం 83.64 ఉత్తీర్ణత శాతం సాధించింది. మండలాల వారీగా వివరాలు ఇలా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంజీఎంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం.. ఊపిరాడక ఇబ్బంది పడ్డ రోగులు
[ 21-05-2024]
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం సుమారు అయిదుగంటల పాటు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది. దీంతో ఆసుపత్రిలోని అత్యవసర వైద్యవిభాగం ఏఎంసీ వార్డు, ఆర్ఐసీయూ వార్డు, నవజాత శిశువుల వార్డులో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న రోగులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
వీళ్లు మారరు వసూళ్ల పర్వం ఆపరు!
[ 21-05-2024]
ఉమ్మడి వరంగల్లోని అనేక మండలాల పరిధిలో రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది వసూళ్ల పర్వంలో మునిగితేలుతున్నారు. ప్రజలు వీరికి ఆమ్యామ్యాలు చెల్లించలేక చివరకు అవినీతి నిరోధక శాఖ (అనిశా)ను ఆశ్రయిస్తున్నారు. -
ఆరోపణలు.. విచారణలు!
[ 21-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం 14వ ఉప కులపతిగా మూడేళ్లపాటు విధులు నిర్వహించిన సామాజిక శాస్త్రం సీనియర్ ఆచార్యులు తాటికొండ రమేశ్ పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. -
స్థిరాస్తి వ్యాపారానికి ఛార్జీల పెంపు గుబులు
[ 21-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిజిస్ట్రేషను ఛార్జీల పెంపుపై కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో భూమి విలువ పెంచితే అది ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. -
సోదరులను బలిగొన్న రోడ్డు ప్రమాదం
[ 21-05-2024]
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. -
900 గ్రాముల మత్తు మందు పట్టివేత
[ 21-05-2024]
హశిష్ (గంజాయి ఆకులతో తయారు చేసినది) మత్తుమందు తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ను వరంగల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
పనులు త్వరగా పూర్తి చేయండి
[ 21-05-2024]
నగరానికి ముంపు తప్పాలంటే వరదనీరు సాఫీగా వెళ్లేలా చూడాలని, నాలాల్లో పూడికతీత పనులు తొందరగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులు, గుత్తేదారులకు సూచించారు. -
విద్యావంతున్ని గెలిపించండి
[ 21-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతుడు భారాస వైపు, నయవంచకుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని ప్రభుత్వ ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్ అన్నారు. -
జాడలేని వేసవి క్రీడా శిబిరాలు..!
[ 21-05-2024]
సెలవుల్లో చిన్నారులను క్రీడల వైపు మళ్లించడానికి తల్లిదండ్రులు తొలి ప్రయత్నంగా వేసవి శిబిరాలను ఎంచుకుంటారు. సంవత్సరం పొడవునా తరగతి గదులకు పరిమితమైన విద్యార్థుల్లో క్రీడాశిబిరాలు నూతన ఉత్సాహాన్ని నింపుతాయి. -
ఆటోడ్రైవర్లకు సీఎన్జీ కష్టాలు
[ 21-05-2024]
పెట్రోలు, డీజిల్ వాడకం తగ్గించి పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో సీఎన్జీ, విద్యుత్తు వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సీఎన్జీ కిలో ధర.. లీటరు పెట్రోల్ ధరకంటే రూ.17 తక్కువగా ఉండటం, మైలేజీ ఎక్కువగా రావడం వల్ల ఆటోడ్రైవర్లు ఈ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. -
ఖాళీ స్థలాలు.. సమస్యలకు నిలయాలు
[ 21-05-2024]
జనావాసాల్లో ఖాళీ స్థలాలు మురికి నీటితో కుంటలుగా మారి, కంపు కొడుతున్నాయి. యజమానుల నిర్లక్ష్యం అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలకు పాట్లు తప్పడం లేదు. -
నిధులున్నా.. నీరుగారిన నిర్వహణ
[ 21-05-2024]
జిల్లాకు సాగునీరందే ఏకైక సాగునీటి కాలువ ఎస్సారెస్పీ డీబీఎం 38.. రేగొండ, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, గణపురం మండలాల మీదుగా ఉప కాల్వలు ఉన్నాయి. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సన్నద్ధం
[ 21-05-2024]
జిల్లాలో ఇంకా ఎన్నికల వాతావరణం కొనసాగుతూనే ఉంది. వారం రోజుల కిందట లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఈనెల 27వ తేదీన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నిక నిర్వహణకు సందడి ప్రారంభమైంది. -
ఉపాధి కూలీలకు సౌకర్యాలు తప్పనిసరి
[ 21-05-2024]
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచే విధంగా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీజ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
యూపీఏ హయాంలో పదేళ్లు ఒక్కరే ప్రధాని.. మోదీ వ్యాఖ్యలపై ఖర్గే కౌంటర్!
-
తనయుడి తెరంగేట్రంపై స్పందించిన అక్షయ్ కుమార్.. ఏమన్నారంటే?
-
హైదరాబాద్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లిన కోల్కతా
-
సాయుధ మూకల అరాచకం.. కాల్పుల్లో 40 మంది మృతి..!
-
వ్యాను ప్రమాదం.. కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరిగా మిగిలి!