పదిలో నాలుగో స్థానం..!
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జనగామ జిల్లా మంచి ఫలితాలను సాధించింది. గతేడాదితో పోలిస్తే ఆరడుగులు ముందుకేసి రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.
జనగామలోని సాంఘిక సంక్షేమ గురుకుల పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు (పాతచిత్రం)
జనగామ అర్బన్, న్యూస్టుడే: పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జనగామ జిల్లా మంచి ఫలితాలను సాధించింది. గతేడాదితో పోలిస్తే ఆరడుగులు ముందుకేసి రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. జిల్లావ్యాప్తంగా 6,692 మంది పరీక్షలకు హాజరు కాగా 6,569 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 3,152 బాలురలో 3,076 మంది ఉత్తీర్ణులు కాగా 3,540 బాలికల్లో 3,493 మంది పాసయ్యారు. 123 మంది బాలబాలికలు ఫెయిలయ్యారు. 98.16 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానంలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలోని అన్ని యాజమాన్యాల్లోని 182 పాఠశాలలకు గాను 108 పాఠశాలలు ఈసారి వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. 133 మంది విద్యార్థులు 10/10జీపీఏ సాధించగా 101 మంది ప్రైవేటు పాఠశాలలకు చెందిన వారు కాగా, మిగతా 32 మంది ప్రభుత్వరంగ విద్యాసంస్థలకు చెందిన వారున్నారు. గతేడాది 91.90 ఉత్తీర్ణత శాతం నమోదు కాగా, ప్రస్తుతం సాధించిన 98.16 ఉత్తీర్ణత జిల్లాలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
గతేడాదితో పోలిస్తే మెరుగ్గా..
గతేడాది ఫలితాలతో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చక్కటి ప్రతిభను కనబరిచారు. జిల్లాలోని 102 జిల్లా పరిషత్ పాఠశాలలకు గాను 56 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రభుత్వ సెక్టార్లోని బీసీ సంక్షేమ-4, కేజీబీవీ-8, ఆదర్శ పాఠశాల-3, తెలంగాణ రెసిడెన్షియల్ గురుకుల, సాంఘిక సంక్షేమ, మైనారిటీ సంక్షేమ గురుకులాలు ప్రతిభ కనబర్చాయి. జిల్లాలోని తెలంగాణ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్లో 69 మందికి విద్యార్థులకు గాను అందరూ ఉత్తీర్ణులు కావడంతో వందశాతాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని విద్యాలయాల్లో-99.72, గిరిజన సంక్షేమ-99.35, ప్రైవేటు-99.27, మైనారిటీ గురుకులం-99.05, ఆదర్శ పాఠశాల-98.80, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు-98.74, సాంఘిక సంక్షేమ-97.99, ప్రభుత్వ-97.65, జిల్లా పరిషత్-97, ఆశ్రమ-96.77, ఎయిడెడ్ పాఠశాలలు-90.63శాతం ఫలితాలను సాధించాయి.
మంచి ఫలితాలు సాధించాం..
- రాము, డీఈవో
జిల్లా కలెక్టర్ సలహాలు, సూచనల మేరకు మంచి ఫలితాల సాధనే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకెళ్లాం. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదలతో రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచాం. గతేడాదితో పోలిస్తే ఈ ఫలితాలు చాలా సంతృప్తినిచ్చాయి. అనుత్తీర్ణులైన విద్యార్థులెవరూ ఆందోళన చెందొద్దు. సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి కొద్ది రోజులు శ్రమిస్తే ఉత్తీర్ణులు కావొచ్చు.
చాలా సంతోషంగా ఉంది..
- ఎండీ.యాసిన్, జడ్పీహెచ్ఎస్ (బాలికల) జనగామ
10జీపీఏ సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేక తరగతుల్లో ఉపాధ్యాయులు చెప్పిన అంశాలను క్షుణ్నంగా చదివేవాడిని. ఈ గ్రేడ్ పాయింట్ సాధించడానికి ఉపాధ్యాయుల సూచనలు ఎంతో దోహదపడ్డాయి.
డీఈవోకు కలెక్టర్ అభినందనలు..
జనగామ అర్బన్: విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జనగామ జిల్లా రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానంలో నిలవడం అభినందనీయమని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. ఫలితాలు విడుదలైన సందర్భంగా మంగళవారం డీఈవో కె.రాము, విద్యాశాఖాధికారులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేసిన డీఈవోను, ఉపాధ్యాయ బృందాలను అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీళ్లు మారరు వసూళ్ల పర్వం ఆపరు!
[ 21-05-2024]
ఉమ్మడి వరంగల్లోని అనేక మండలాల పరిధిలో రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది వసూళ్ల పర్వంలో మునిగితేలుతున్నారు. ప్రజలు వీరికి ఆమ్యామ్యాలు చెల్లించలేక చివరకు అవినీతి నిరోధక శాఖ (అనిశా)ను ఆశ్రయిస్తున్నారు. -
ఆరోపణలు.. విచారణలు!
[ 21-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం 14వ ఉప కులపతిగా మూడేళ్లపాటు విధులు నిర్వహించిన సామాజిక శాస్త్రం సీనియర్ ఆచార్యులు తాటికొండ రమేశ్ పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. -
స్థిరాస్తి వ్యాపారానికి ఛార్జీల పెంపు గుబులు
[ 21-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిజిస్ట్రేషను ఛార్జీల పెంపుపై కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో భూమి విలువ పెంచితే అది ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. -
సోదరులను బలిగొన్న రోడ్డు ప్రమాదం
[ 21-05-2024]
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. -
900 గ్రాముల మత్తు మందు పట్టివేత
[ 21-05-2024]
హశిష్ (గంజాయి ఆకులతో తయారు చేసినది) మత్తుమందు తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ను వరంగల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
పనులు త్వరగా పూర్తి చేయండి
[ 21-05-2024]
నగరానికి ముంపు తప్పాలంటే వరదనీరు సాఫీగా వెళ్లేలా చూడాలని, నాలాల్లో పూడికతీత పనులు తొందరగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులు, గుత్తేదారులకు సూచించారు. -
విద్యావంతున్ని గెలిపించండి
[ 21-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతుడు భారాస వైపు, నయవంచకుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని ప్రభుత్వ ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్ అన్నారు. -
జాడలేని వేసవి క్రీడా శిబిరాలు..!
[ 21-05-2024]
సెలవుల్లో చిన్నారులను క్రీడల వైపు మళ్లించడానికి తల్లిదండ్రులు తొలి ప్రయత్నంగా వేసవి శిబిరాలను ఎంచుకుంటారు. సంవత్సరం పొడవునా తరగతి గదులకు పరిమితమైన విద్యార్థుల్లో క్రీడాశిబిరాలు నూతన ఉత్సాహాన్ని నింపుతాయి. -
ఆటోడ్రైవర్లకు సీఎన్జీ కష్టాలు
[ 21-05-2024]
పెట్రోలు, డీజిల్ వాడకం తగ్గించి పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో సీఎన్జీ, విద్యుత్తు వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సీఎన్జీ కిలో ధర.. లీటరు పెట్రోల్ ధరకంటే రూ.17 తక్కువగా ఉండటం, మైలేజీ ఎక్కువగా రావడం వల్ల ఆటోడ్రైవర్లు ఈ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. -
ఖాళీ స్థలాలు.. సమస్యలకు నిలయాలు
[ 21-05-2024]
జనావాసాల్లో ఖాళీ స్థలాలు మురికి నీటితో కుంటలుగా మారి, కంపు కొడుతున్నాయి. యజమానుల నిర్లక్ష్యం అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలకు పాట్లు తప్పడం లేదు. -
నిధులున్నా.. నీరుగారిన నిర్వహణ
[ 21-05-2024]
జిల్లాకు సాగునీరందే ఏకైక సాగునీటి కాలువ ఎస్సారెస్పీ డీబీఎం 38.. రేగొండ, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, గణపురం మండలాల మీదుగా ఉప కాల్వలు ఉన్నాయి. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సన్నద్ధం
[ 21-05-2024]
జిల్లాలో ఇంకా ఎన్నికల వాతావరణం కొనసాగుతూనే ఉంది. వారం రోజుల కిందట లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఈనెల 27వ తేదీన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నిక నిర్వహణకు సందడి ప్రారంభమైంది. -
ఉపాధి కూలీలకు సౌకర్యాలు తప్పనిసరి
[ 21-05-2024]
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచే విధంగా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీజ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్వాతీ మాలీవాల్ కేసులో బిభవ్ ముంబయికి తరలింపు
-
డీప్ఫేక్ ఫొటోలను గుర్తించండిలా.. వీడియో షేర్ చేసిన కేంద్రం
-
నీ తండ్రి స్థాయేంటో తెలుసా అన్నారు : జొమాటో సీఈఓ
-
అతడి ప్రవర్తనకు భయపడ్డా: కాజల్ అగర్వాల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు సిగ్నల్ వ్యవస్థే లేదా..?