logo

‘సాగునీరు అందించే బాధ్యత నాదే’

భీమదేరపల్లి మండలంలోని పొలాలకు సాగునీరు అందించే బాధ్యత తనదని, మీ ఆశీర్వాదంతో కరీంనగర్‌ కాంగ్రెస్‌ ఎంపీగా రాజేందర్‌రావును గెలిపించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు.

Published : 01 May 2024 06:25 IST

ములుకనూర్‌లో మాట్లాడుతున్న మంత్రి పొన్నం, చిత్రంలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రాజేందర్‌రావు

భీమదేవరపల్లి, న్యూస్‌టుడే: భీమదేరపల్లి మండలంలోని పొలాలకు సాగునీరు అందించే బాధ్యత తనదని, మీ ఆశీర్వాదంతో కరీంనగర్‌ కాంగ్రెస్‌ ఎంపీగా రాజేందర్‌రావును గెలిపించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. మంగళవారం ములుకనూర్‌లో ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. అంబేడ్కర్‌ కూడలి వద్ద హాజరైన ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడారు. రాబోయే కాలంలో గౌరవెల్లి, దేవాదుల జలాశయం పనులు పూర్తి చేయిస్తానన్నారు. వైస్‌ ఎంపీపీ మాడుగుల ఎజ్రా, భారాస నాయకుడు తాళ్ల తిరుపతితో పాటు పలువురు మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.  నాయకులు అయిలయ్య, బత్తిని శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌ గుప్తా, మాజీ అధ్యక్షుడు కేతిరి లక్ష్మారెడ్డి, స్వరూప, మాజీ ఎంపీపీలు సరోజన, అశోక్‌ ముఖర్జీ పాల్గొన్నారు.  

ప్రవీణ్‌రెడ్డి ఇంటికి మంత్రి: ములుకనూర్‌లో రోడ్‌షోకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు వాహనంలో నేరుగా మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. తాళం వేసి ఉండడంతో అక్కడే కొద్దిసేపు కూర్చొని అనంతరం రోడ్‌షో ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని