logo

నాలుగు వేల మందితో ర్యాలీ

భాజపా ఆధ్వర్యంలో ములుగులో ఈనెల 7న సాయంత్రం నిర్వహించనున్న లోక్‌సభ ఎన్నికల ర్యాలీని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మహబూబాబాద్‌ పార్లమెంటు భాజపా అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్‌ కోరారు.

Published : 07 May 2024 06:43 IST

ములుగు, న్యూస్‌టుడే: భాజపా ఆధ్వర్యంలో ములుగులో ఈనెల 7న సాయంత్రం నిర్వహించనున్న లోక్‌సభ ఎన్నికల ర్యాలీని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మహబూబాబాద్‌ పార్లమెంటు భాజపా అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్‌ కోరారు. సోమవారం ములుగులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు నాలుగు వేల మందితో ర్యాలీ నిర్వహిస్తామని, డప్పు చప్పుళ్లు, బంజారా, కోయ డోలు వాయిదాలతో ర్యాలీ జరుగుతుందన్నారు. కార్యక్రమానికి భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు హాజరు కానున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, జిల్లా ప్రభారి నరోత్తంరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, మహబూబాబాద్‌ కో-కన్వీనర్‌ తక్కళ్లపల్లి దేవేందర్‌ రావు, జిల్లా కార్యదర్శి నగరపు రమేష్‌, జిల్లా ఉపాధ్యక్షుడు భూక్యా జవహర్‌లాల్‌, నాయకులు భూక్యా రాజు నాయక్‌, సాంబశివరావు, శీలమంతుల రవీంద్రాచారి, చల్లూరి మహేందర్‌, జినుకల కృష్ణాకర్‌రావు, రాయంచు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని