logo

‘కడియం మోసాలు అందరికీ తెలుసు’

దళిత ద్రోహి కడియం శ్రీహరి గురించి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా వివరించి చెప్పనవసరం లేదని, ఆయన మోసాలు మొత్తం ప్రజలకు తెలుసని భాజపా లోక్‌సభ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ అన్నారు.

Published : 07 May 2024 07:06 IST

తాటికొండలో ప్రసంగిస్తున్న భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌

స్టేషన్‌ఘన్‌పూర్‌, జఫర్‌గఢ్‌, రఘనాథపల్లి, న్యూస్‌టుడే: దళిత ద్రోహి కడియం శ్రీహరి గురించి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా వివరించి చెప్పనవసరం లేదని, ఆయన మోసాలు మొత్తం ప్రజలకు తెలుసని భాజపా లోక్‌సభ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రఘునాథపల్లి, ఖిలాషాపురం, ఘన్‌పూర్‌, తాటికొండ, ఇప్పగూడెం, జఫర్‌గఢ్‌ మండల కేంద్రంలో ఆయన సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడుతూ.. చంద్రబాబు, కేసీఆర్‌ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన శ్రీహరి నియోజకవర్గానికి, ఒక్క దళితుడికైనా మేలు చేశాడా..? అని ప్రశ్నించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో దళితులకు అన్యాయం చేసింది కడియం శ్రీహరేనని విమర్శించారు.మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేను వర్ధన్నపేటలో మూడోసారి గెలిస్తే ఎక్కడ మంత్రి పదవి వస్తుందోనని.. పనికట్టుకొని డబ్బులు ఖర్చుపెట్టి ఓడించాడని ఆరోపించారు. కేంద్రంలో మళ్లీ భాజపా అధికారంలోకి రానుందని, తనను గెలిపిస్తే ఉమ్మడి జిల్లాను సర్వతోముఖాభివృద్ధి చేస్తానని వివరించారు. రాష్ట్ర నాయకుడు బొజ్జపల్లి సుభాష్‌, పార్టీ మండలాధ్యక్షులు వెంకటరమణ, నాగేష్‌, అయోధ్య, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని