logo

నగరంలో నేడు సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌ షో

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం వరంగల్‌ నగరానికి రానున్నారు.

Published : 07 May 2024 07:09 IST

రంగంపేట, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం వరంగల్‌ నగరానికి రానున్నారు. వరంగల్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య తరఫున ప్రచారం చేసేందుకు వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గాల్లో రోడ్‌ షోలు, కూడలి సమావేశాల్లో(కార్నర్‌ మీటింగ్‌) పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌లు విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తూర్పులో అంతర్గత సమావేశాలు నిర్వహించారు. 24 డివిజన్ల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, ప్రజలు, మహిళలను తరలించేందుకు ప్రణాళిక రూపొందించారు.

 మంగళవారం సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా వరంగల్‌ మండిబజారు వద్దకు వస్తారు. ముస్లిలంతో కలిసి మండిబజారు దర్గాలో ప్రార్థనలు చేస్తారు. అక్కడి నుంచి పాదయాత్రగా బయల్దేరుతారు. పోచమ్మమైదాన్‌లోని సాయిబాబా మందిరంలో పూజలు చేస్తారు. పోచమ్మమైదాన్‌ కూడలిలో ఏర్పాటు చేసిన కూడలి సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. గత శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇక్కడే ప్రసంగించారు.

 వరంగల్‌ పశ్చిమ: మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హనుమకొండ వేయిస్తంభాల గుడి వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్‌ షో ద్వారా హనుమకొండ చౌరస్తా కూడలికి చేరుకుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కూడలి సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇటీవల భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఇదే కూడలిలో ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని