విదేశాల్లో ఓటుకు పట్టం.. వేయకుంటే ఊరుకోదు చట్టం!
దేశం ప్రగతి దిశగా సాగాలంటే సమర్థులనే పాలకులుగా ఎన్నుకోవాలి. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే సుపరిపాలన అందించే ప్రభుత్వం ఏర్పాటవుతుంది.
దేశం ప్రగతి దిశగా సాగాలంటే సమర్థులనే పాలకులుగా ఎన్నుకోవాలి. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే సుపరిపాలన అందించే ప్రభుత్వం ఏర్పాటవుతుంది. నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు. అందుకే ఓటు చేసే మేలును గుర్తించిన కొన్ని దేశాలు దాన్ని సద్వినియోగం చేసుకోవడం తప్పనిసరి చేస్తూ చట్టాలు చేశాయి.
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి, దేవరుప్పుల, గోపాలపూర్, న్యూస్టుడే
బ్రెజిల్.. జరిమానా తప్పదు
ఓటు వేయని వారిపై కఠిన చర్యలుంటాయి. ఒకసారి ఓటు వేయకుంటే జరిమానాతో సరిపెడతారు. వరుసగా మూడుసార్లు ఓటింగ్లో పాల్గొనకపోతే ఉద్యోగ పోటీ పరీక్షలు రాయకుండా, బ్యాంకుల నుంచి రుణాలు, పాస్ పోర్టు పొందడానికి వీల్లేకుండా నిషేధిస్తారు. ఆరు నెలల్లోగా జరిమానాలు చెల్లించకున్నా.. సరైన వివరణ ఇవ్వకపోయినా పైవాటిని రద్దు చేసే అవకాశం ఉంటుంది.
ఆస్ట్రేలియా.. కోర్టు విచారణ
ప్రపంచంలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదయ్యే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. 2019లో జరిగిన ఫెడరల్ ఎన్నికల్లో 92 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్లో గైర్హాజరై తగిన కారణాన్ని చెప్పకపోతే జరిమానా విధిస్తారు. కోర్టు విచారణకు ఆదేశిస్తారు. కొన్ని సందర్భాల్లో జరిమానా చెల్లించని వారిపై కోర్టు ధిక్కారం కేసులో జైలు శిక్ష కూడా విధిస్తారు.
సింగపూర్.. జాబితా నుంచి తొలగిస్తారు
గైర్హాజరైన ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. తిరిగి జాబితాలో పేరు నమోదు చేయాలంటే సరైన కారణం చెప్పాలి. కారణాలు నమ్మశక్యంగా లేకపోతే ఓటు పునరుద్ధరణకు రిజిస్ట్రేషన్ అధికారికి రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
పెరూ.. ఓటు వేయని వారిని బ్యాంకింగ్, ఇతర ప్రజాపాలన వ్యవస్థలో లావాదేవీలు చేయకుండా పరిమితం చేస్తారు. జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.
నౌరు..
చట్టబద్ధమైన కారణం చెప్పకుంటే జరిమానా వేస్తారు.
బెల్జియంలో రూ.10 వేల వరకు జరిమానా..
బెల్జియంలో వరుసగా నాలుగుసార్లు ఓటేయకపోతే పదేళ్ల వరకు ఓటు హక్కు ఉండదు. మొదటిసారి వేయకపోతే రూ.4 వేలు, రెండోసారికి రూ.10 వేలు జరిమానా విధిస్తారు. ఓటు హక్కు వినియోగంపై పౌరులు నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. ఇక్కడ 96 శాతం ఓటింగ్ నమోదవుతోంది.
గ్రీస్లో డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు ఇవ్వరు..
గ్రీస్లో ఓటుకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఇక్కడ ఓటు వేయని వారికి డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు ఇవ్వరు. బలమైన కారణాలు చూపితే తప్ప వాటిని పునరుద్ధరించరు. ఇతర సౌకర్యాల పైనా ఆంక్షలు విధిస్తారు. ఇక్కడ 96 శాతానికి పైగా ఓటింగ్ నమోదవుతుంది.
థాయిలాండ్..
గైర్హాజరైన ఓటరు కొన్ని రాజకీయ పరమైన అర్హతలను కోల్పోవాల్సివస్తుంది. చట్టాలను ప్రతిపాదించే హక్కు, మంత్రులను అభిశంసించే హక్కు, రాజకీయ పదవులను పొందే హక్కును కోల్పోతారు.
బొలీవియా..
ఓటింగ్లో పాల్గొనని వారిని పోలింగ్ జరిగిన తర్వాత రోజు నుంచి మూడు నెలల పాటు బ్యాంకు లావాదేవీలు చేయకుండా చేస్తారు. ప్రతి ఎన్నికల సమయంలో జాతీయ ఎలక్టోరల్ కోర్టు వారికి జరిమానా విధిస్తుంది.
22 దేశాల్లో తప్పనిసరి
ప్రపంచంలో 22 దేశాలు ఓటు వినియోగం తప్పనిసరి చేస్తూ.. చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నాయి. ఇందులో థాయిలాండ్, సింగపూర్, ఉరుగ్వే, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెల్జియం, బొలీవియా, బ్రెజిల్, మెక్సికో, నౌరు, పనామా, కాంగో, కోస్టారికా, లక్సెంబర్గ్, పరాగ్వే, పెరూ, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఈజిప్ట్, గ్రీస్, హోండురాస్, లెబనాన్ దేశాలున్నాయి. చాలా దేశాలు ఎన్నికల నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాయి. ఓటు హక్కు పౌరుల బాధ్యత అని అవగాహన కల్పిస్తాయి.
మన వద్ద ఇలా..
మన వద్ద శిక్షలు, విచారణలు, జరిమానాలు లేవు. ఆంక్షలు అసలే ఉండవు. ఓటర్ల కోసం ప్రభుత్వాలు సకల సౌకర్యాలు కల్పిస్తున్నా చాలా మంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం లేదు. మన దగ్గర తక్కువ పోలింగ్ శాతం నమోదవుతున్న నేపథ్యలో ఓటు వేయడం తప్పనిసరి చేయాలనే డిమాండ్ వస్తోంది.
జరిమానా విధిస్తారు
తోటకూరి నరేశ్, దేవరుప్పుల (ఆస్ట్రేలియాలో ఉంటున్నారు)
ఆస్ట్రేలియాలో ఓటు వేయని వారిని అధికారులు వివరణ కోరుతారు. సరైన కారణం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోలేదని నిర్ధారిస్తే జరిమానా వేస్తారు. 28 రోజుల్లోగా జరిమానా చెల్లించకపోతే రుసుం మరింత పెరుగుతుంది. ఓటు వేయడానికే చాలా మంది ముందుంటారు.
పోలింగ్ రోజు పండగ వాతావరణం
ఎర్రమరెడ్డి శశిధర్రెడ్డి, దేవరుప్పుల (సింగపూర్లో ఉంటున్నారు)
మన దగ్గర పండగ నాడు ఎంత సందడిగా ఉంటుందో, సింగపూర్లో పోలింగ్ రోజున అదే వాతావరణం కనిపిస్తుంది. అందరూ సంతోషంగా పోలింగ్లో పాల్గొంటారు. ఓటు వేయకుంటే అవమానంగా భావిస్తారు. గైర్హాజరైతే ప్రభుత్వానికి సంజాయిషి ఇవ్వాల్సి ఉంటుంది. వివరణ సహేతుకంగా లేకపోతే జరిమానా తప్పదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేధింపులను అరికట్టేందుకు.. మహిళా కమిటీలు
[ 20-05-2024]
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ కార్పొరేషన్, తొమ్మిది మున్సిపాలిటీల్లో కమిటీల ఏర్పాటుపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. -
నగరం.. చినుకులకే వణుకుతోంది..!
[ 20-05-2024]
‘ఇటీవల కురుస్తున్న చిన్నపాటి వర్షాలకే వరంగల్, హనుమకొండ ప్రధాన రహదారులు, కూడళ్లలో వరదనీరు ప్రవహించింది. అంతర్గత మురుగు కాలువలు పొంగిపొర్లాయి.’ -
కొలువు కల్ల.. జేబు గుల్ల!
[ 20-05-2024]
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నేరుగా లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు కొంత మంది దళారులకు కాసుల పంట పండుతోంది. వాటిని ఎరగా చేసుకుని అమాయక నిరుద్యోగులే లక్ష్యంగా గాలమేస్తున్నారు. -
ఆడిట్ విభాగంలో లెక్కలేనితనం
[ 20-05-2024]
గతేడాది సీనియర్ అసిస్టెంట్ బండా అన్వేష్ అభివృద్ధి పనుల పేరుతో సుమారు రూ.3.31 కోట్లు కొల్లగొట్టాడు. ఆడిట్, గణాంక విభాగాల అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో ప్రజాధనాన్ని ప్రైవేటు ఖాతాల్లోకి మళ్లించారు. -
బాల చోదకులు.. ప్రమాద కారకులు
[ 20-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనర్లు వాహనాలు నడుపుతూ.. తరచూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా.. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తున్నా.. తీరు మారడం లేదు. -
ఎమ్మెల్సీ ఎన్నికల భారాస సమన్వయకర్తలు వీరే
[ 20-05-2024]
వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేసేందుకు భారాస ప్రత్యేక దృష్టి సారించింది. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాకేశ్రెడ్డిని గెలిపించాలనే ఉద్దేశంతో అసెంబ్లీ సెగ్మెంటు వారీగా సమన్వయకర్తలను నియమిస్తున్నారు. -
అతివలకు ఉపాధి వెలుగులు
[ 20-05-2024]
విద్యుత్తు వినియోగం పెరుగుతూనే ఉంది.. వేసవిలోనైతే మరీ ఎక్కువ అవుతోంది.. దేశ వ్యాప్తంగా జల, పవన, బొగ్గు ఆధారిత విద్యుత్తుపై ఆధారపడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. -
‘విద్యావంతుడైన రాకేశ్రెడ్డిని గెలిపించుకుందాం’
[ 20-05-2024]
-
పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే
[ 20-05-2024]
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే ఉందని, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థినైన తనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తారని గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. -
వ్యర్థాల వడపోతకు బయోమైనింగ్!
[ 20-05-2024]
పురపాలికల్లో ఏళ్లతరబడి డంపుయార్డుల్లో పేరుకున్న ఘన వ్యర్థాలను వేరు చేస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంటు, విద్యుత్తు పరిశ్రమలకు విక్రయిస్తారు. మాగిన మట్టిని ఎరువుగా, రాళ్లు, పనికిరాని ఇతర వ్యర్థాలను లోతట్టు ప్రాంతాలు, భారీ గుంతలను నింపేందుకు ఉపయోగించవచ్చు. -
భారాస గెలుపునకు కృషి చేయాలి..
[ 20-05-2024]
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. -
కిసాన్ నిధి.. కొందరికేనా?
[ 20-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా పెట్టుబడి సాయం అందించేలా ఏడాదికి మూడు పర్యాయాలు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు రైతుల ఖాతాలో జమ చేసేలా కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించారు. -
వరి వైపే మొగ్గు
[ 20-05-2024]
జిల్లాలో ఈసారి వానాకాలంలో 4,30,521 ఎకరాల్లో పంటల సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు సాగు అంచనా ప్రణాళికలను రూపొందించారు. ఇందులో సింహభాగం వరి సాగు వైపు మొగ్గు చూపుతారని నిర్ధారించారు. -
మోడికుంట.. కాలయాపన ఎందుకంట?
[ 20-05-2024]
సాగునీటి పథకాలలో ముంపు రహిత ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది వాజేడు మండలంలోని మోడికుంట మాత్రమే. తెలంగాణ- ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని భద్రాద్రి మన్యంలో వాజేడు మండలం కృష్ణాపురం సమీపాన అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరదనీటికి అడ్డుకట్ట వేసి నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..