logo

జగ్గన్నపేటలో మట్టి తవ్వకాలపై ఆరా

తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేటలో ఇటీవల మట్టి తవ్వకాలు అక్రమంగా చేపట్టారని ఉన్నతాధికారులకు వెళ్లిన ఫిర్యాదుల మేరకు త్రిసభ్య కమిటీ శుక్రవారం పరిశీలించింది. కమిటీలో భీమవరం ఆర్డీవో డి.రాజు, జిల్లా పంచాయతీ అధికారి ఎం.నాగలత

Published : 28 May 2022 04:47 IST

చెరువును పరిశీలిస్తున్న త్రిసభ్య కమిటీ సభ్యులు

తాడేపల్లిగూడెం, న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేటలో ఇటీవల మట్టి తవ్వకాలు అక్రమంగా చేపట్టారని ఉన్నతాధికారులకు వెళ్లిన ఫిర్యాదుల మేరకు త్రిసభ్య కమిటీ శుక్రవారం పరిశీలించింది. కమిటీలో భీమవరం ఆర్డీవో డి.రాజు, జిల్లా పంచాయతీ అధికారి ఎం.నాగలత, మైనింగ్‌ డీఈ కిశోర్‌వర్మ సభ్యులుగా ఉన్నారు. కమిటీ సభ్యులు జగ్గన్నపేట మాలపాడు చెరువులో మట్టి తవ్వకాలను పరిశీలించారు. ఉపాధి హామీ పథకంలో ఎంత మేరకు తవ్వారో వివరాలు తెలుసుకున్నారు. అక్కడి వాహనాలను పరిశీలించారు. వీఆర్‌ఓ సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, ఉపాధి క్షేత్ర సహాయకుల నుంచి జరిగిన పనుల వివరాలు తెలుసుకున్నారు. ఎప్పటి నుంచి తవ్వకాలు జరుగుతున్నాయని కార్యదర్శిని ప్రశ్నించారు. కమిటీ వెంట డిప్యూటీ తహసీల్దారు శివశంకర్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని