అంతస్తు మెలిక.. పనులు నత్తనడక!
వచ్చే నెల 5న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఏలూరు జిల్లా వ్యాప్తంగా నాడు-నేడు పనుల్లో భాగంగా చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. అది కూడా చాలా తక్కువ చోట్ల ఆయా పనులు జరుగుతున్నాయి. రెండో దశ అదనపు తరగతి గదుల
నాడు-నేడు రెండో దశ నిర్మాణాల్లో తీవ్ర జాప్యం
చింతలపూడి, న్యూస్టుడే: వచ్చే నెల 5న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఏలూరు జిల్లా వ్యాప్తంగా నాడు-నేడు పనుల్లో భాగంగా చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. అది కూడా చాలా తక్కువ చోట్ల ఆయా పనులు జరుగుతున్నాయి. రెండో దశ అదనపు తరగతి గదుల నిర్మాణానికి కొత్త మెలిక పెట్టారు. గతంలో పాఠశాల ఆవరణలోని స్థలంలో గదులు నిర్మించే వారు. తాజాగా మంజూరైన నిధులతో ఇప్పటికే ఉన్న పాత భవనాలపై రెండు, మూడు అంతస్తులుగా నిర్మించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ పునాదుల్లో గట్టితనం లేకుండా గదులు నిర్మిస్తే ప్రమాదకరమని ప్రధానోపాధ్యాయులు, పీఎంసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది చింతలపూడి సుబ్బరాజు జడ్పీ ఉన్నత పాఠశాల. ఇక్కడ 650 మంది విద్యార్థులుంటే విలీనంలో భాగంగా 3, 4, 5 తరగతులకి చెందిన 169 మంది గతేడాది వచ్చి చేరారు. ప్రస్తుతం 815 మంది చదువుతున్నారు. కొత్తగా నలుగురు ఉపాధ్యాయులు వచ్చారు. 800 మంది విద్యార్థులకు ఒక్కరే హిందీ ఉపాధ్యాయుడు ఉన్నారు. ఈ సబ్జెక్టుకు సంబంధించి అదనంగా ఇద్దరు కావాలి. ఇంతకు ముందు 15 సెక్షన్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 19కి చేరింది. ఒక్కో దానిలో 40 మంది మాత్రమే ఉండాలి. ఉపాధ్యాయులు 28 మంది అవసరమైతే 24 మందే ఉన్నారు. ఇంకా 16 గదులు అవసరం ఉంది. ఆయా పనులు ప్రారంభమే కాలేదు.
పొంతన లేని ధరలు
మరోవైపు మార్కెట్లో సిమెంట్, ఇనుము ధరలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ధరల ప్రకారం ఒక్క ఇటుకలు మాత్రమే కొనుగోలు చేయవచ్చని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. మిగిలిన వాటి ధరలు పొంతన లేకపోవడంతో పనులు చేపట్టాలంటే భయపడుతున్నారు. ప్రభుత్వం ఇనుము, ఇసుక ఇస్తామని చెబుతున్నా.. అరకొరగా మాత్రమే సరఫరా చేస్తోంది.
వేగవంతం చేస్తున్నాం
నాడు-నేడు పనులను వేగవంతం చేస్తున్నాం. పై అంతస్తులో అదనపు తరగతి గదులు నిర్మాణం చేపడుతున్నాం. ఒకవేళ పాఠశాల గ్రౌండ్ ఫ్లోర్ పునాదులు బలంగా లేవని భావిస్తే పీఎంసీలు సమావేశమై తీర్మానాన్ని ఉన్నతాధికారులకు పంపి అనుమతులు పొందాలి. ఇంజినీరింగ్ నిపుణుల సూచనల మేరకు నిర్మాణాలు చేపడుతున్నాం’అని సమగ్ర శిక్షా అభియాన్ ఏలూరు ఏపీసీ శ్యాంసుందర్ తెలిపారు.
అదనపు తరగతుల కోసం సేకరించిన ఇటుక
* ఒక్కో గది నిర్మాణానికి రూ.12 లక్షల చొప్పున రూ.142 కోట్లు మంజూరయ్యాయి. పనుల ప్రారంభం, శంకుస్థాపన, గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణాలకు ఇప్పటికే కొంత మేర నిధులు విడుదల చేశారు. కొన్ని చోట్ల పాఠశాల ఆవరణలోని ఖాళీ స్థలాల్లో పునాదులు తవ్వి అదనపు గదుల నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులు, ఎస్ఎస్ఏ ఉన్నతాధికారులతో ప్రారంభిస్తున్నారు. తాజాగా ఆ గదులను గ్రౌండ్ ఫ్లోర్గా కాకుండా ఇప్పటికే ఉన్న భవనాలపై రెండు, మూడు అంతస్తులుగా నిర్మించాలని, ఫలితంగా పాఠశాల స్థలం వృథా కాదని ఉన్నతాధికారులు సూచించారు. ఇప్పటికే ఉన్న భవనాలు పురాతనమైనవి కావడం, వాటి సామర్థ్యం ఎంత మేర ఉందో తెలియదు. పైగా మొదటి అంతస్తులో తరగతి గదులకు వెళ్లడం విద్యార్థులు, ఉపాధ్యాయులకు అసౌకర్యంగా ఉంటుంది. దివ్యాంగ విద్యార్థులు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంతస్తుల్లో తరగతుల నిర్వహణతో విద్యార్థులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. చాలా పాఠశాలల్లో సరిపడా స్థలం ఉన్నా కూడా అంతస్తులు నిర్మించాలని చెప్పడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ రాసిన మరణ శాసనం
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక నాటు సారా తయారీ, విక్రయాలు, వినియోగం అన్నీ పెరిగాయి. నూతన మద్యం విధానం పేరుతో రూ.60 ఉన్న క్వార్టర్ సీసాను రూ.120-150కి అమాంతం పెంచేశారు. -
మాటలు ఎక్కడో.. పనులు ఇక్కడే
[ 27-04-2024]
‘ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తాం.. తొమ్మిది రకాల అభివృద్ధి పనులు చేపట్టి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం’ అని సీఎం జగన్, వైకాపా నాయకుడు ఊకదంపుడు ఉపాన్యాసాలిచ్చారు. -
పార్లమెంట్ 4, అసెంబ్లీకి 26 తిరస్కరణ
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఏలూరు పార్లమెంట్కు 17 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా వివిధ కారణాలతో 4 తిరస్కరణకు గురయ్యాయి. -
‘భూగర్భం’లో.. కలిసిపోయిన హామీలు..!
[ 27-04-2024]
నరసాపురంలో ప్రస్తుత జనాభా సుమారు 70వేలకు చేరిందని అంచనా. 31 వార్డుల్లో 109 కి.మీ మేర డ్రెయిన్ వ్యవస్థ ఉంది. మేజర్ డ్రెయిన్ల అవుట్లెట్ పొన్నపల్లి వద్ద గోదావరిలోకి ఉంది. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సాధారణ పరిశీలకులు దీప, ఎల్ నిర్మలారాజ్, పోలీసు పరిశీలకులు శైలేష్కుమార్సిన్హా పేర్కొన్నారు. -
జగన్ పాలనలో అంతా దోపిడీ
[ 27-04-2024]
‘అయిదేళ్ల వైకాపా పాలనలో చింతలపూడి ఎత్తిపోతల కోసం సీఎం జగన్మోహన్రెడ్డి తట్టెడు మట్టి కూడా వేయలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. -
నామినేషన్ రోజునే గెలుపు ఖరారు: నిమ్మల
[ 27-04-2024]
తను నామినేషన్ వేసిన ఈ నెల 19న నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చినప్పుడే పాలకొల్లులో తన గెలుపు ఖరారయ్యిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు. -
నాడు జీవనాడి సవ్వడి.. నేడు జీవనం చతికిలపడి!
[ 27-04-2024]
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను 2014-19లో తెదేపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనులు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అటు అధికారులు, ఇటు గుత్తేదారులను పరుగులు పెట్టించేవారు. -
రెండు గంటల ఛార్జింగ్.. 25కి.మీ. ప్రయాణం
[ 27-04-2024]
తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) విద్యార్థులు ఎలక్ట్రికల్ బైక్కు రూపకల్పన చేశారు. -
కుమారుడి జీతం నుంచి తల్లికి జీవన భృతి
[ 27-04-2024]
జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను బాధ్యతగా, ప్రేమగా చూసుకోవాలని బాధ్యత పిల్లలదేనని ఆర్డీవో శ్రీనివాసులరాజు అన్నారు. -
ఇంత దగానా జగన్!
[ 27-04-2024]
‘అధికారంలోకి వచ్చిన వెంటనే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా. ఉద్యోగ భద్రత కల్పించి జీవనోపాధిని మెరుగుపరుస్తా..’ అంటూ గత ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక దానిని నెరవేర్చలేదు. -
రాక్షస పాలనకు త్వరలో తెర
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనకు త్వరలోనే తెరపడనుందని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
కూటమి వస్తేనే యువతకు ఉపాధి
[ 27-04-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. -
నేడు పాలిసెట్
[ 27-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి శనివారం పరీక్ష (పాలిసెట్) నిర్వహించనున్నారు. ఏలూరు, పరిసర ప్రాంతాల్లో పరీక్ష నిర్వహణకు 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్కుమార్, పరిశీలకులు దీప అభ్యర్థులు, వివిధ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్ల సమక్షంలో నామపత్రాలను పరిశీలించారు. -
నేటి నుంచి ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
ఇంటింటికీ ఓటరు సమాచార చీటీల పంపిణీని శనివారం నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్టు
[ 27-04-2024]
చీటింగ్ కేసులో నిందితుడి వద్ద రూ.50 వేలు తీసుకుంటూ ఓ కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. -
తపాలా బ్యాలెట్ దరఖాస్తుకు గడువు పెంపు
[ 27-04-2024]
తపాలా బ్యాలెట్ కోసం ఫారం-12 సమర్పించేందుకు మే 1 వరకు గడువును పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.