logo

కార్తికేయ కల్యాణం

అత్తిలి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కల్యాణం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది.

Published : 29 Nov 2022 05:47 IST

ఉత్సవ మూర్తులు

అత్తిలి, న్యూస్‌టుడే: అత్తిలి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కల్యాణం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. శోభాయమానంగా తీర్చిదిద్దిన స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెగా కొలువుదీర్చి శాస్త్రోక్తంగా క్రతువు నిర్వహించారు. ఈ కమనీయ ఘట్టాన్ని భక్తులు  తిలకించి పులకించారు. స్వామివారి తలంబ్రాల కోసం  పోటీ పడ్డారు. మంగళవారం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దామిశెట్టి రామజగ్గయ్య, నాగ సూర్యవాణి దంపతుల ఆధ్వర్యంలో ఈ క్రతువు నిర్వహించారు.

తాళిబొట్టు చూపుతున్న పురోహితుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని