డబ్బులిస్తేనే మస్తరు!
గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు పట్టెడన్నం పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో అవినీతి రాజ్యమేలుతోంది.
ఉపాధి హామీ పథకంలో అవినీతి
కూలీల నుంచి సొమ్ము వసూలు
ఏలూరు అర్బన్, న్యూస్టుడే
గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు పట్టెడన్నం పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో అవినీతి రాజ్యమేలుతోంది. కంచే చేను మేసిన చందంగా ఏలూరు జిల్లాలో నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) మండల స్థాయి అధికారులు, క్షేత్ర, సాంకేతిక సహాయకులు కొందరు కూలీల నుంచి సొమ్ము వసూలుచేస్తూ పథకాన్ని నీరుగారుస్తున్నారు.
పెదవేగి మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో క్షేత్ర సహాయకులకు బదులుగా గ్రామ వాలంటీర్లు మస్తరు వేస్తున్నారనే అభియోగం ఉంది.
బుట్టాయగూడెం మండలంలో ఏపీవో కనుసన్నల్లో అవినీతికి పాల్పడిన ఘటనలు బయట పడినా జిల్లా ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారు.
మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో క్షేత్ర సహాయకుల అవినీతి చర్యలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. వీరికి స్థానిక నాయకుల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది.
చాట్రాయి, ముసునూరు, నూజివీడు మండలాల్లో కూలీల నుంచి ఏపీవోలు మస్తర్ షీటు, పని పుస్తకం ముద్రణ, రవాణా ఖర్చుల కోసం క్షేత్ర సహాయకుల ద్వారా రూ.100 నుంచి రూ.150 వరకు కూలీల నుంచి వసూలు చేశారు.
కూలీలు డబ్బులిస్తేనే మస్తరు వేస్తామంటూ కొంతమంది అధికారులు (ఏపీవోలు) అవినీతికి పాల్పడుతున్నారు. జిల్లాలోని పెదవేగి, దెందులూరు, లింగపాలెం, ద్వారకాతిరుమల తదితర మండలాల్లో అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ అధికారుల కనుసన్నల్లో కూలీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదులందాయి. ఆ మేరకు డ్వామా ఏపీడీలతో కొన్ని గ్రామాల్లో విచారణ చేయించారు. జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెంలో కూలీల నుంచి ఏపీవోలు సొమ్ము వసూలు చేస్తున్నట్లు తేలింది. వీరిపై ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరికొన్ని ఘటనలు ఇలా..
జిల్లాలో ఉపాధి పనులు చేసే కూలీలకు వేతనాల చెల్లింపుల్లో జాప్యం నెలకొంటోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కూలీలకు మరోచోట పని కావాలంటే ఏపీవోలు, క్షేత్ర, సాంకేతిక సహాయకులకు ముడుపులు చెల్లించుకోక తప్పడం లేదు. ఇన్ని ఇబ్బందులు పడుతున్న కూలీల విషయంలో మండల స్థాయి అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు మూలిగే నక్కపై తాటిపండు అన్నచందంగా తయారైంది. పనులు యంత్రాలతో నిర్వహించి వాటిని పథకంలో నమోదు చేస్తున్న వైనంపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేయించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్న మండల స్థాయి అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
మధ్యవర్తులుగా క్షేత్ర సహాయకులు
ఉపాధి పనులు జరిగే గ్రామాల్లో కూలీలకు, ఏపీవోలకు మధ్యవర్తులుగా క్షేత్ర సహాయకులు వ్యవహరిస్తున్నారు. అనేక గ్రామాల్లో వీరి వ్యవహారశైలి కూలీలను ఇబ్బందులకు గురిచేస్తోంది. మస్తరు షీటు, పని పుస్తకాల ముద్రణకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా కూలీల నుంచి ఏపీవోలు, క్షేత్ర సహాయకులు సొమ్ము వసూలు చేస్తున్నారు.
యంత్రాలతో పనులు
ఉపాధి హామీ పనులను కూలీలతో మాత్రమే చేయించాలనేది నిబంధన. దీన్ని విస్మరించి కొన్ని గ్రామాల్లో యంత్రాలతో పనులు చేయిస్తూ వాటిని ఉపాధి పథకం కింద నమోదు చేస్తున్నారు. పెదవేగి, నూజివీడు, దెందులూరు, ముసునూరు, బుట్టాయగూడెం, ద్వారకా తిరుమల మండలాల్లో పొక్లెయిన్లతో మట్టి తవ్వి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇదంతా స్థానిక రాజకీయ నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది.
విచారణ చేయిస్తాం
జిల్లాలో ఉపాధి పనుల్లో కొందరు అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిపై తగిన విచారణ చేయిస్తామని డ్వామా పీడీ ఎ.రాము తెలిపారు. తాను కూడా కొన్ని గ్రామాలకు స్వయంగా వెళ్లి విచారణ నిర్వహిస్తానన్నారు. జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, చింతలపూడి, టి.నరసాపురం మండలాల్లో ఏపీడీలతో విచారణ చేయిస్తామన్నారు. అవినీతి ఎక్కువగా జరుగుతోందని ఫిర్యాదులు అందిన మండలాల్లో ఆకస్మిక తనిఖీలు చేయిస్తామని తెలిపారు. కూలీల నుంచి సొమ్ము వసూలు చేస్తున్న వారిపై, యంత్రాలతో పనులు చేయించి వాటిని ఉపాధి పనులుగా నమోదు చేస్తున్న వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ రాసిన మరణ శాసనం
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక నాటు సారా తయారీ, విక్రయాలు, వినియోగం అన్నీ పెరిగాయి. నూతన మద్యం విధానం పేరుతో రూ.60 ఉన్న క్వార్టర్ సీసాను రూ.120-150కి అమాంతం పెంచేశారు. -
మాటలు ఎక్కడో.. పనులు ఇక్కడే
[ 27-04-2024]
‘ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తాం.. తొమ్మిది రకాల అభివృద్ధి పనులు చేపట్టి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం’ అని సీఎం జగన్, వైకాపా నాయకుడు ఊకదంపుడు ఉపాన్యాసాలిచ్చారు. -
పార్లమెంట్ 4, అసెంబ్లీకి 26 తిరస్కరణ
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఏలూరు పార్లమెంట్కు 17 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా వివిధ కారణాలతో 4 తిరస్కరణకు గురయ్యాయి. -
‘భూగర్భం’లో.. కలిసిపోయిన హామీలు..!
[ 27-04-2024]
నరసాపురంలో ప్రస్తుత జనాభా సుమారు 70వేలకు చేరిందని అంచనా. 31 వార్డుల్లో 109 కి.మీ మేర డ్రెయిన్ వ్యవస్థ ఉంది. మేజర్ డ్రెయిన్ల అవుట్లెట్ పొన్నపల్లి వద్ద గోదావరిలోకి ఉంది. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సాధారణ పరిశీలకులు దీప, ఎల్ నిర్మలారాజ్, పోలీసు పరిశీలకులు శైలేష్కుమార్సిన్హా పేర్కొన్నారు. -
జగన్ పాలనలో అంతా దోపిడీ
[ 27-04-2024]
‘అయిదేళ్ల వైకాపా పాలనలో చింతలపూడి ఎత్తిపోతల కోసం సీఎం జగన్మోహన్రెడ్డి తట్టెడు మట్టి కూడా వేయలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. -
నామినేషన్ రోజునే గెలుపు ఖరారు: నిమ్మల
[ 27-04-2024]
తను నామినేషన్ వేసిన ఈ నెల 19న నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చినప్పుడే పాలకొల్లులో తన గెలుపు ఖరారయ్యిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు. -
నాడు జీవనాడి సవ్వడి.. నేడు జీవనం చతికిలపడి!
[ 27-04-2024]
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను 2014-19లో తెదేపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనులు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అటు అధికారులు, ఇటు గుత్తేదారులను పరుగులు పెట్టించేవారు. -
రెండు గంటల ఛార్జింగ్.. 25కి.మీ. ప్రయాణం
[ 27-04-2024]
తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) విద్యార్థులు ఎలక్ట్రికల్ బైక్కు రూపకల్పన చేశారు. -
కుమారుడి జీతం నుంచి తల్లికి జీవన భృతి
[ 27-04-2024]
జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను బాధ్యతగా, ప్రేమగా చూసుకోవాలని బాధ్యత పిల్లలదేనని ఆర్డీవో శ్రీనివాసులరాజు అన్నారు. -
ఇంత దగానా జగన్!
[ 27-04-2024]
‘అధికారంలోకి వచ్చిన వెంటనే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా. ఉద్యోగ భద్రత కల్పించి జీవనోపాధిని మెరుగుపరుస్తా..’ అంటూ గత ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక దానిని నెరవేర్చలేదు. -
రాక్షస పాలనకు త్వరలో తెర
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనకు త్వరలోనే తెరపడనుందని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
కూటమి వస్తేనే యువతకు ఉపాధి
[ 27-04-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. -
నేడు పాలిసెట్
[ 27-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి శనివారం పరీక్ష (పాలిసెట్) నిర్వహించనున్నారు. ఏలూరు, పరిసర ప్రాంతాల్లో పరీక్ష నిర్వహణకు 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్కుమార్, పరిశీలకులు దీప అభ్యర్థులు, వివిధ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్ల సమక్షంలో నామపత్రాలను పరిశీలించారు. -
నేటి నుంచి ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
ఇంటింటికీ ఓటరు సమాచార చీటీల పంపిణీని శనివారం నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్టు
[ 27-04-2024]
చీటింగ్ కేసులో నిందితుడి వద్ద రూ.50 వేలు తీసుకుంటూ ఓ కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. -
తపాలా బ్యాలెట్ దరఖాస్తుకు గడువు పెంపు
[ 27-04-2024]
తపాలా బ్యాలెట్ కోసం ఫారం-12 సమర్పించేందుకు మే 1 వరకు గడువును పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.