జడ్పీ ఛైర్పర్సన్గా పద్మశ్రీ
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్గా పెదపాడు జడ్పీటీసీ సభ్యురాలు గంటా పద్మశ్రీ ఎన్నికయ్యారు.
వేడుకగా ప్రమాణస్వీకారం
పద్మశ్రీని అభినందిస్తున్న ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, ఆళ్ల నాని, చిత్రంలో అబ్బయ్యచౌదరి, వాసుబాబు, శ్రీధర్, కవురు, కారుమూరి తదితరులు
ఏలూరు వన్టౌన్, న్యూస్టుడే: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్గా పెదపాడు జడ్పీటీసీ సభ్యురాలు గంటా పద్మశ్రీ ఎన్నికయ్యారు. ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రసన్నవెంకటేశ్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. జిల్లాలో మొత్తం 47 మంది జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. ఛైర్మన్ ఎన్నికకు కోరం ప్రకారం 24 మంది హాజరు కావాల్సి ఉండగా.. మొత్తం 35 మంది పాల్గొన్నారు. ఛైర్పర్సన్గా గంటా పద్మశ్రీ పేరును ద్వారకాతిరుమల జడ్పీటీసీ సభ్యుడు చిగురుపల్లి శామ్యూల్ ప్రతిపాదించగా దెందులూరు జడ్పీటీసీ సభ్యురాలు నిట్టా లీలానవకాంతం బలపరిచారు. మిగిలిన సభ్యులందరూ ఆమోదం తెలపడంతో ఛైర్పర్సన్గా పద్మశ్రీ ఎన్నికైనట్లుగా కలెక్టర్ ప్రకటించారు. అనంతరం ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత పెదపాడు మండలంలోని ఇంటి నుంచి పద్మశ్రీ భారీ ఊరేగింపుగా జడ్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, వంక రవీంద్రనాథ్, ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, కొఠారు అబ్బయ్యచౌదరి, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, డీసీసీబీ ఛైర్మన్ పీవీఎల్ నరసింహరాజు, నగర మేయర్ షేక్ నూర్జహాన్, జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ సీఈవో రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బీసీలకు పెద్దపీట.. జడ్పీ ఛైర్పర్సన్ ప్రమాణ స్వీకరణ అనంతరం కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పలువురు ప్రజాప్రతినిధులు ప్రసంగించారు. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ బీసీల సర్వతోముఖాభివృద్ధికి వైకాపా పెద్ద పీట వేస్తోందన్నారు. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన మహిళకు జడ్పీ ఛైర్పర్సన్గా అవకాశం ఇవ్వడం సీఎం జగన్కు వారి పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు. గంటా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లా అంతటా పర్యటించి గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ఏలూరు బస్టాండు రోడ్డులో నిలిచిన ట్రాఫిక్
అడుగడుగునా ఆంక్షలే..
జడ్పీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఆ కార్యాలయ పరిధిలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. భారీ బందోబస్తుతోపాటు ప్రధాన రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయి వాహనచోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పత్రిక విలేకరులు, ఫొటోగ్రాఫర్లను సమావేశ హాలు లోపలికి అనుమతించలేదు. జడ్పీ సీఈవో చెబితేనే అనుమతిస్తామని తేల్చి చెప్పడంతో పోలీసులు, విలేకరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి ఎన్నిక ముగిసిన తర్వాత మాత్రమే అనుమతించారు.
ప్రధాన ద్వారాన్ని మూసివేసిన పోలీసులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ రాసిన మరణ శాసనం
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక నాటు సారా తయారీ, విక్రయాలు, వినియోగం అన్నీ పెరిగాయి. నూతన మద్యం విధానం పేరుతో రూ.60 ఉన్న క్వార్టర్ సీసాను రూ.120-150కి అమాంతం పెంచేశారు. -
మాటలు ఎక్కడో.. పనులు ఇక్కడే
[ 27-04-2024]
‘ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తాం.. తొమ్మిది రకాల అభివృద్ధి పనులు చేపట్టి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం’ అని సీఎం జగన్, వైకాపా నాయకుడు ఊకదంపుడు ఉపాన్యాసాలిచ్చారు. -
పార్లమెంట్ 4, అసెంబ్లీకి 26 తిరస్కరణ
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఏలూరు పార్లమెంట్కు 17 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా వివిధ కారణాలతో 4 తిరస్కరణకు గురయ్యాయి. -
‘భూగర్భం’లో.. కలిసిపోయిన హామీలు..!
[ 27-04-2024]
నరసాపురంలో ప్రస్తుత జనాభా సుమారు 70వేలకు చేరిందని అంచనా. 31 వార్డుల్లో 109 కి.మీ మేర డ్రెయిన్ వ్యవస్థ ఉంది. మేజర్ డ్రెయిన్ల అవుట్లెట్ పొన్నపల్లి వద్ద గోదావరిలోకి ఉంది. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సాధారణ పరిశీలకులు దీప, ఎల్ నిర్మలారాజ్, పోలీసు పరిశీలకులు శైలేష్కుమార్సిన్హా పేర్కొన్నారు. -
జగన్ పాలనలో అంతా దోపిడీ
[ 27-04-2024]
‘అయిదేళ్ల వైకాపా పాలనలో చింతలపూడి ఎత్తిపోతల కోసం సీఎం జగన్మోహన్రెడ్డి తట్టెడు మట్టి కూడా వేయలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. -
నామినేషన్ రోజునే గెలుపు ఖరారు: నిమ్మల
[ 27-04-2024]
తను నామినేషన్ వేసిన ఈ నెల 19న నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చినప్పుడే పాలకొల్లులో తన గెలుపు ఖరారయ్యిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు. -
నాడు జీవనాడి సవ్వడి.. నేడు జీవనం చతికిలపడి!
[ 27-04-2024]
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను 2014-19లో తెదేపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనులు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అటు అధికారులు, ఇటు గుత్తేదారులను పరుగులు పెట్టించేవారు. -
రెండు గంటల ఛార్జింగ్.. 25కి.మీ. ప్రయాణం
[ 27-04-2024]
తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) విద్యార్థులు ఎలక్ట్రికల్ బైక్కు రూపకల్పన చేశారు. -
కుమారుడి జీతం నుంచి తల్లికి జీవన భృతి
[ 27-04-2024]
జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను బాధ్యతగా, ప్రేమగా చూసుకోవాలని బాధ్యత పిల్లలదేనని ఆర్డీవో శ్రీనివాసులరాజు అన్నారు. -
ఇంత దగానా జగన్!
[ 27-04-2024]
‘అధికారంలోకి వచ్చిన వెంటనే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా. ఉద్యోగ భద్రత కల్పించి జీవనోపాధిని మెరుగుపరుస్తా..’ అంటూ గత ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక దానిని నెరవేర్చలేదు. -
రాక్షస పాలనకు త్వరలో తెర
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనకు త్వరలోనే తెరపడనుందని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
కూటమి వస్తేనే యువతకు ఉపాధి
[ 27-04-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. -
నేడు పాలిసెట్
[ 27-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి శనివారం పరీక్ష (పాలిసెట్) నిర్వహించనున్నారు. ఏలూరు, పరిసర ప్రాంతాల్లో పరీక్ష నిర్వహణకు 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్కుమార్, పరిశీలకులు దీప అభ్యర్థులు, వివిధ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్ల సమక్షంలో నామపత్రాలను పరిశీలించారు. -
నేటి నుంచి ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
ఇంటింటికీ ఓటరు సమాచార చీటీల పంపిణీని శనివారం నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్టు
[ 27-04-2024]
చీటింగ్ కేసులో నిందితుడి వద్ద రూ.50 వేలు తీసుకుంటూ ఓ కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. -
తపాలా బ్యాలెట్ దరఖాస్తుకు గడువు పెంపు
[ 27-04-2024]
తపాలా బ్యాలెట్ కోసం ఫారం-12 సమర్పించేందుకు మే 1 వరకు గడువును పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.