నూతన రైళ్లతో తీర ప్రాంత అభివృద్ధి
నూతన రైళ్లను నడపడం ద్వారా తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి అవకాశం ఏర్పడిందని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. విజయవాడ - హుబ్లీ మధ్య నడిచే అమరావతి ఎక్స్ప్రెస్ రైలు సేవలను శుక్రవారం నుంచి నరసాపురం వరకు పొడిగించారు.
జెండా ఊపి రైలును ప్రారంభిస్తున్న ప్రసాదరాజు
నరసాపురం, న్యూస్టుడే: నూతన రైళ్లను నడపడం ద్వారా తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి అవకాశం ఏర్పడిందని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. విజయవాడ - హుబ్లీ మధ్య నడిచే అమరావతి ఎక్స్ప్రెస్ రైలు సేవలను శుక్రవారం నుంచి నరసాపురం వరకు పొడిగించారు. నరసాపురంలో రైలుకు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ప్రసాదరాజు మాట్లాడారు. రైల్వే శాఖ ఏడీఆర్ఎం వి.శ్రీనివాస్ మాట్లాడుతూ భీమవరం నుంచి చెన్నై, నరసాపురం నుంచి బెంగళూరుకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. నరసాపురం నుంచి విశాఖ పట్నానికి రైలు నడిపే పరిస్థితి లేదని, ఈ ప్రాంతవాసుల వినతులను రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, పురపాలక ఛైర్పర్సన్ బర్రె శ్రీవెంకటరమణ, భాజపా జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ, రైల్వే ప్రయాణికుల సలహా మండలి సభ్యుడు జక్కంపూడి రమేష్కుమార్, విజయవాడ కమర్షియల్ మేనేజరు వి.రాంబాబు, నరసాపురం స్టేషన్ మేనేజరు చినిమిల్లి దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుక రేవుల్లో నిద్దరోతున్న నిఘా!
[ 16-06-2024]
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఏలూరు జిల్లాలో కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఇతర జిల్లా అధికారులు, పశ్చిమలో మైనింగ్, రెవెన్యూ అధికారులు ఇసుక రేవుల పర్యవేక్షణకు వచ్చారు -
చెర వీడుతోంది.. పోలవరం ప్రాజెక్టు పరిసరాలు శుభ్రం
[ 16-06-2024]
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టులో 2016 నుంచి 2019 వరకు ఆవిష్కరించిన శిలాఫలకాలకు మెరుగులు అద్దే పనుల్లో జల వనరుల శాఖాధికారులు నిమగ్నం అయ్యారు. -
నాన్న మాట.. గెలుపు బాట!
[ 16-06-2024]
భీమవరం అర్బన్, కలిదిండి, ఉంగుటూరు, న్యూస్టుడే: బిడ్డను తనకంటే ఎత్తున నిలిపేందుకు జీవితాంతం పోరాడే అలుపెరుగని యోధుడు నాన్న. -
జన హితం..సంక్షేమ సంతకం
[ 16-06-2024]
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్ల మొత్తం పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పింఛన్ల పెంపు దస్త్రంపై మూడో సంతకం చేశారు. -
పెనుగాలుల బీభత్సం
[ 16-06-2024]
పోలవరం ప్రాంతంలో శనివారం పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. జాతీయ రహదారిపై ప్రగడపల్లి, పట్టిసీమ గ్రామాల వద్ద చెట్లు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
బుక్కెడు బువ్వకు భరోసా!
[ 16-06-2024]
అన్నార్తులు, పేదల క్షుద్బాధ తీరనుంది. మూడు పూటలా కడుపు నిండా ఆహారం అందనుంది. వైకాపా పాలనలో మూతపడిన అన్న క్యాంటీన్లను పునరుద్ధరించేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
పేదలకు మరింత చేయూత
[ 16-06-2024]
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడగానే సామాజిక పింఛన్ల సొమ్మును పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దస్త్రంపై సంతకం చేశారు. -
8న మాధవాయపాలెం ఫెర్రీ రేవు వేలం
[ 16-06-2024]
నరసాపురం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలాల పరిధిలోని మాధవాయపాలెం ఫెర్రీ రేవు వేలం నిర్వహణకు సంయుక్త కార్యాచరణ కమిటీ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
శ్రీలీల ‘డ్రిప్పిన్’ కల్చర్.. రోజీ చీరలో మంజిమా..
-
కౌంటింగ్ వేళ ఈవీఎం అన్లాక్ ఘటన..ఎంపీ బంధువు అరెస్ట్
-
ఐపీఎస్ అధికారి గరికపాటి బిందు మాధవ్పై సస్పెన్షన్ ఎత్తివేత
-
మార్పొస్తుందని ఆశిస్తున్నా: పవన్ కల్యాణ్పై ఉపేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు
-
రేణుకాస్వామి హత్య కేసు.. ఆ కారు సీజ్!
-
శ్రీలంక-భారత్ ప్రతిపాదిత రోడ్డు మార్గం.. ద్వీపదేశం ఏమందంటే!