logo

నరసాపురం నుంచి పోటీలో ఉంటా : రఘురామ

నరసాపురం లోక్‌సభ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉంటానని, ఇందుకు సంబంధించి త్వరలో స్పష్టత వస్తుందని ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. గురువారం సాయంత్రం యన రాజమహేంద్రవరం నుంచి భీమవరం  చేరుకున్నారు.

Published : 29 Mar 2024 04:17 IST

ఎంపీ కనుమూరితో అభిమానులు

భీమవరం పట్టణం, కాళ్ల, న్యూస్‌టుడే: నరసాపురం లోక్‌సభ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉంటానని, ఇందుకు సంబంధించి త్వరలో స్పష్టత వస్తుందని ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. గురువారం సాయంత్రం యన రాజమహేంద్రవరం నుంచి భీమవరం  చేరుకున్నారు. పెదఅమిరంలోని ఆయన నివాసం అభిమానులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. రాత్రి పొద్దుపోయే వరకు అభిమానులతో మాట్లాడారు. వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి కుయుక్తులకు తగిన గుణపాఠం త్వరలో చెబుతానని, అప్పటి వరకు అభిమానులు అధైర్య పడొద్దంటూ భరోసా కల్పించారు.  తెదేపా, జనసేన నాయకులు, జిల్లాలోని పలు మండలాలకు చెందిన అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని